Chhattisgarh: ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు షాక్, 23 మంది లొంగుబాటు..
- ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు షాక్..
- సుక్మా జిల్లాలో లొంగిపోయిన 23 మంది మావోలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chhattisgarh: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. సుక్మా జిల్లాలో ఒకేసారి భారీగా మావోయిస్టులు లొంగిపోయారు. 23 మంది లొంగిపోవడంతో పోలీసులు అతిపెద్ద విజయం సాధించారని చెప్పవచ్చు. వీరందరిపై కలిపి రూ. 1.18 కోట్ల నజరానా ఉంది. శనివారం, వీరంతా సుక్మా జిల్లా పోలీసులు ముందు లొంగిపోయారు. దీనికి ఒక రోజు ముందు, సుక్మా సరిహద్దు జిల్లా అయిన నారాయణపూర్ జిల్లాలో 22 మంది మావోయిస్టులు తమ ఆయుధాలను విడిచిపెట్టారు. సుక్మా పోలీసులు, సీఆర్పీఎఫ్ సంయుక్త ప్రయత్నాల కారణంగా ఈ లొంగుబాటు జరిగింది.
Read Also: COVID-19: ‘‘స్ట్రాటస్’’ రూపంలో మళ్లీ తిరిగి వచ్చిన కోవిడ్-19..
Also Read
- Iran Oil: భారత్పై ఇరాన్ ఆశలు.. సముద్రంలో భారీగా చమురు..
- Monsoon: రుతుపవనాలపై ఐఎండీ శుభవార్త.. ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
- Pune Trekker Case: హత్యకు 4 రోజుల ముందే ‘స్నేక్’ డ్రామా.. పూణెలో సోనమ్ వారసురాలు ఏం మర్డర్ ప్లాన్
- Padma Awards: దిగ్గజాలకు పద్మ పురస్కారాలు.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డుల ప్రదానం!
లొంగిపోయిన వారిలో అనేక మంది ఉన్నత స్థాయి మావోయిస్టు కేడర్ ఉంది. లొంగిపోయిన మావోయిస్టుల్లో కొందరిపై రూ. 8 లక్షలు పారితోషికం ఉంది. మరికొందరిపై రూ. 1 లక్ష నుంచి 5 లక్షల వరకు రివార్డులు ఉన్నాయి. వీరిలో చాలా మంది బస్తర్ ప్రాంతంలో తీవ్రమైన హింసాత్మక దాడుల్లో పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులలో ఒకరు 2012లో అప్పటి జిల్లా కలెక్టర్ అలెక్స్ పాల్ మీనన్ అపహరణలో పాల్గొన్నట్లు నివేదించబడింది. ఆ సమయంలో ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
సుక్మా జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్, సీఆర్పీఎఫ్ ఐజీ ఆనంద్ సింగ్ సమక్షంలో ఈ లొంగుబాటు జరిగింది. లొంగిపోయిన వారికి ప్రభుత్వం తరుపున పునరావాసం ఉంటుందని బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ చెప్పారు. వారు సమాజంలో గౌరవంగా బతికేందుకు అన్ని రకాల మద్దతు ఇస్తామని చెప్పారు.
తాజావార్తలు
-
Iran Oil: భారత్పై ఇరాన్ ఆశలు.. సముద్రంలో భారీగా చమురు..
-
Monsoon: రుతుపవనాలపై ఐఎండీ శుభవార్త.. ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
-
Pune Trekker Case: హత్యకు 4 రోజుల ముందే ‘స్నేక్’ డ్రామా.. పూణెలో సోనమ్ వారసురాలు ఏం మర్డర్ ప్లాన్
-
Padma Awards: దిగ్గజాలకు పద్మ పురస్కారాలు.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డుల ప్రదానం!
-
Sanjeev Bikhchandani: ఒక్క నిర్ణయం.. వేల కోట్ల సామ్రాజ్యం! నౌక్రీ.కామ్ బాస్ ఇన్వెస్ట్మెంట్ మ్యాజిక్ చూశారా?
ట్రెండింగ్
-
Ragi Biscuits : హెల్తీ రాగి బిస్కెట్లు ఎయిర్ ఫ్రైయర్లో 10 నిమిషాల్లో ఇలా చేసుకోండి.!
-
Kitchen Tips : నల్లబడిన వెండి ఆభరణాలు, వస్తువులు కొత్త వాటిలా మెరవాలా..? ఈ కిచెన్ ట్రిక్ సూపర్!
-
మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!
-
MS Dhoni: భారత క్రికెట్ చరిత్రలో నేడు ప్రత్యేకమైన రోజు.. ప్రపంచంలోనే ఏకైక కెప్టెన్గా ఎంఎస్ ధోనీ చరిత్ర!
-
11,000mAh భారీ బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, IP69K రేటింగ్ ప్రత్యేకతలతో HONOR X80 Pro Max లాంచ్.! ధర ఎంతంటే.?