Kanpur: కాన్పూర్లో దారుణం.. లా విద్యార్థిపై మూకుమ్మడి దాడి.. కడుపు కోసి.. వేళ్లు నరికివేత
- కాన్పూర్లో దారుణం
- లా విద్యార్థిపై మూకుమ్మడి దాడి
- కడుపు కోసి.. వేళ్లు నరికివేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో దారుణం జరిగింది. 22 ఏళ్ల లా విద్యార్థిపై మెడికల్ షాపు నిర్వాహకులు మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. విద్యార్థి కడుపు కోసి.. వేళ్లు నరికివేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని బాధిత విద్యార్థిని ఆస్పత్రికి తరలించారు. విద్యార్థి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.
ఇది కూడా చదవండి: Doctor Suicide Case: వైద్యురాలి ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్
Also Read
- Delhi Hotel Fire: మాతృమూర్తికి కుమారుడు కాలేయం దానం.. అగ్నిప్రమాదంలో ఇద్దరూ మృతి.. ‘కిర్గిజ్స్తాన్’ కుటుంబ విషాద గాథ
- Pakistan: మమ్మల్ని కాపాడినందుకు ట్రంప్నకు రుణపడి ఉంటాం: షహబాజ్ షరీఫ్..
- PM Modi: భారత్ దూకుడు.. జీడీపీ వృద్ధిరేటు పెరగడంపై మోడీ హర్షం.. ఎక్స్లో కీలక వ్యాఖ్యలు
- Cockroach Janta Party: ఢిల్లీలో "కాక్రోచ్ జనతా పార్టీ" ఆందోళన.. పోలీసులు ఏం చెబుతున్నారంటే..
అభిజీత్ సింగ్ చందేల్(22) కాన్పూర్ విశ్వవిద్యాలయంలో మొదటి సంవత్సరం న్యాయ విద్యను అభ్యషిస్తున్నాడు. మందుల కోసం ఒక మెడికల్ షాపుకు వెళ్లాడు. అయితే మందుల విషయంలో మెడికల్ షాపు అటెండెంట్ అమర్ సింగ్తో వాగ్వాదం చోటుచేసుకుంది. క్రమక్రమంగా అది తీవ్ర ఘర్షణకు దారి తీసింది. అమర్ సింగ్, అతడి సోదరుడు విజయ్ సింగ్, మరో ఇద్దరు ప్రిన్స్ రాజ్ శ్రీవాస్తవ, నిఖల్ అనే మొత్తం నలుగురు వ్యక్తులు.. అభిజీత్ సింగ్ చందేల్పై మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. పదునైన ఆయుధంతో అభిజీత్ కడుపు కోయడంతో పాటు చేతి వేళ్లు నరికివేశారు.
ఇది కూడా చదవండి: Vitamin D Tablets: విటమిన్ డి ట్యాబ్లెట్స్తో మూత్రపిండాలకు ఎఫెక్ట్!
తీవ్ర రక్తస్రావం కారణంగా అభిజీత్ నేలపై కుప్పకూలిపోయాడు. అనంతరం ప్రాణాలు కాపాడాలంటూ అరుస్తూ ఒక ఇంటి వైపు పరిగెత్తాడు. దుండగులు మళ్లీ వెంటపడి చేతిలోని రెండు వేళ్లను నరికేశారు. అభిజీత్ అరుపులు విన్న స్థానిక ప్రజలు సాయం చేయడానికి ముందుకు వచ్చారు. దీంతో దుండగులు పారిపోయారు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని అభిజీత్ను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితుడికి 14 కుట్లు పడ్డాయని.. పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
బాధితుడి తల్లి నీలం సింగ్ చందేల్ మాట్లాడుతూ.. ‘‘నిందితులు.. పోలీసులతో మంచి సంబంధాలు కలిగి ఉన్నారని, అదే రాత్రి తనపై, గాయపడిన తన కొడుకుపై తప్పుడు దోపిడీ కేసు నమోదు చేశారు.’’ అని ఆమె తెలిపింది. ‘‘హత్యకు పాల్పడిన వారిని అరెస్టు చేయడానికి బదులుగా.. పోలీసులు ప్రాణాలతో పోరాడుతున్న నా కొడుకుపై కేసు నమోదు చేశారు.’’ అని వాపోయింది. హత్యాయత్నం ఆరోపణలపై ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు ఏసీపీ కుమార్ తెలిపారు. నాల్గవ నిందితుడు ప్రిన్స్ శ్రీవాస్తవ పరారీలో ఉన్నాడని.. అతనిని పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు. చౌహాన్ ఫిర్యాదు ఆధారంగా చందేల్పై కూడా దోపిడీ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశామని.. కానీ దారుణమైన దాడి గురించి నిజం బయటపడిన తర్వాత కొత్త కేసు నమోదు చేశామని ఏసీపీ కుమార్ వెల్లడించారు.
తాజావార్తలు
-
Putin-Zelensky: యుద్ధం ముగిద్దాం.. పుతిన్కు జెలెన్స్కీ లేఖ.. రెస్పాన్స్పై సర్వత్రా ఆసక్తి
-
Delhi Hotel Fire: మాతృమూర్తికి కుమారుడు కాలేయం దానం.. అగ్నిప్రమాదంలో ఇద్దరూ మృతి.. ‘కిర్గిజ్స్తాన్’ కుటుంబ విషాద గాథ
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Pawan Kalyan: జనసేనలో సంస్థాగత పునర్వ్యవస్థీకరణ.. పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ ఇదే..
-
ALP: ఒంగోలులో లోకో పైలట్పై దాడి.. రైల్వే అధికారుల దర్యాప్తు..
ట్రెండింగ్
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!