Gujarat Riots Case: గుజరాత్ అల్లర్ల కేసులో 22 మందిని నిర్దోషులుగా ప్రకటించిన కోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gujarat Riots Case: 2002 గోద్రా ఘటన అనంతరం జరిగిన మతఘర్షణల్లో ఇద్దరు పిల్లలతో సహా 17 మంది మైనారిటీ కమ్యూనిటీకి చెందిన వారిని హత్య చేసిన కేసులో 22 మందిని నిర్దోషులుగా ప్రకటించింది పంచమహల్ జిల్లా హలోల్ కోర్టు. సాక్ష్యాలు లేని కారణంగా వీరందరిని నిర్దోషులుగా వప్రకటించింది. ప్రాసిక్యూషన్ ప్రకారం.. బాధితులను ఫిబ్రవరి 28, 2002 చంపి, సాక్ష్యాలు లేకుండా మృతదేహాలను కాల్చారు. హలోల్ కోర్టు అడిషనల్ సెషన్స్ జడ్డి హర్ష్ త్రివేది.. మంగళవారం మొత్తం 22 మంది నిందితులను నిర్దోషులుగా విడుదల చేసింది. వీరిలో 8 మంది కేసు పెండింగ్ ఉన్న సమయంలో మరణించారని డిఫెన్స్ లాయర్ గోపాల్ సింగ్ సోలంకి వెల్లడించారు.
Read Also: Congress: కాంగ్రెస్ కు బిగ్ షాక్.. ఏకే ఆంటోనీ కొడుకు పార్టీకి రాజీనామా..
Also Read
- India-Meta: మా చట్ట ప్రకారం నడవాల్సిందే.. మెటాకు కేంద్రం వార్నింగ్
- UPI Charges Bill: UPI చెల్లింపులపై ఛార్జీలకు గ్రీన్ సిగ్నల్.. లోక్సభలో కీలక బిల్లు ఆమోదం
- Karnataka: ఘోరం.. వాలీబాల్ ఆడుతుండగా గుండెపోటుతో టెన్త్ విద్యార్థి మృతి
- Rahul Gandhi: రాహుల్ గాంధీకి కిరణ్ రిజిజు ఫోన్.. ఏం సంభాషణ జరిగిందంటే..!
ఫిబ్రవరి 27, 2002న పంచమహల్ జిల్లాలోని గోద్రాలో కరసేవకులతో వస్తున్న సబర్మతి ఎక్స్ ప్రెస్ లోని బోగీలను తగలపెట్టారు కొందరు దుండగులు. ఈ ఘటనలో 59 మంది మరణించారు. వారిలో ఎక్కువగా కరసేవలకు ఉన్నారు. ఈ ఘటన తర్వాత గుజరాత్ లో పలు ప్రాంతాల్లో మతకలహాలు చోటు చేసుకున్నాయి. జిల్లాలోని డెలోల్ గ్రామలో ఇద్దరు పిల్లలతో సహా 17 మంది సభ్యులను కొంతమంది దుండగులు హత్య చేసి, మృతదేహాలను కాల్చివేశారు. తాజాగా ఈ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై ఎలాంటి సాక్ష్యాలు లేకపోవడంతో నిర్దోషులుగా ప్రకటించింది కోర్టు.
డెలోల్ గ్రామంలో జరిగిన హింసాకాండలో అల్లర్లలో పాల్గొన్న 22 మందిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నిందులకు వ్యతిరేకంగా ప్రాసిక్యూషన్ తగిన సాక్ష్యాలను సేకరించలేకపోయింది. బాధితులు మృతదేహాలు ఇప్పటి దొరకలేదు. కొన్నాళ్ల తరువాత పోలీసులు నది ఒడ్డున ఉన్న నిర్మానుష్య ప్రాంతంలో ఎముకలను స్వాధీనం చేసుకున్నారు. అయితే అవి బాధితుల గుర్తింపును నిర్ధారించలేనంతగా కాలిపోయాయి.
తాజావార్తలు
-
India-Meta: మా చట్ట ప్రకారం నడవాల్సిందే.. మెటాకు కేంద్రం వార్నింగ్
-
2027 World Cup: వన్డే వరల్డ్ కప్కు కౌంట్ డౌన్ స్టార్ట్.. షెడ్యూల్ ప్రకటించిన ఐసీసీ.. ఈ తేదీల్లోనే..
-
Burning of Ganja: రూ. 3.50 కోట్ల విలువైన గంజాయి దహనం.. ఎక్కడంటే..
-
UPI Charges Bill: UPI చెల్లింపులపై ఛార్జీలకు గ్రీన్ సిగ్నల్.. లోక్సభలో కీలక బిల్లు ఆమోదం
-
The Paradise Teaser Review: నాని ‘ది ప్యారడైజ్’ టీజర్ రివ్యూ.. మాస్ అవతార్తో రచ్చ చేసిన న్యాచురల్ స్టార్!
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!