Kerala: జైలు నుంచి దివ్యాంగ ఖైదీ ఎలా తప్పించుకోగలిగాడు.. అధికారులు తర్జనభర్జన
- జైలు నుంచి ఖైదీ ఎలా తప్పించుకోగలిగాడు
- కేరళ జైలు అధికారులు మేథోమధనం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేరళలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన జైలు నుంచి శుక్రవారం తెల్లవారుజామున ఒక దివ్యాంగ ఖైదీ పరారయ్యాడు. ఉదయం తనిఖీలు చేస్తుండగా ఖైదీ మిస్ అయ్యాడు. దీంతో అధికారులకు సమాచారం ఇచ్చారు. సీసీటీవీ ఫుటేజ్ చూడగా ఖైదీ పారిపోతున్న దృశ్యాలు కనిపించాయి. దీంతో జైలు అధికారులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. అత్యాచారం, హత్య కేసులో దోషిగా గోవిందచామి జీవితఖైదీ అనుభవిస్తున్నాడు. పైగా అతడికి ఎడమ చేయి లేదు. ఇక జైలు గోడ 25 అడుగుల ఎత్తులో ఉంది. అంతేకాకుండా విద్యుత్ కంచె ఉంది. ఇంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన జైలు నుంచి ఎలా తప్పించుకోగలిగాడని తలలు పట్టుకున్నారు.
ఇది కూడా చదవండి: Suspicious Death: అమావాస్య రోజు భర్తకు పాదపూజ చేసిన భార్య.. ఆ తర్వాత రోజే హత్య
Also Read
ఇక రంగంలోకి దిగిన డాగ్ స్క్వాడ్, పోలీసులు విస్తృతంగా తనిఖీ చేయగా కొన్ని గంటల వ్యవధిలోనే దొరికిపోయాడు. ఇక గోవిందచామి రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు గుర్తుపట్టి కొందరు స్థానికులు పిలువగా పారిపోయాడు. అయితే కన్నూర్ సెంట్రల్ జైలు నుంచి దివ్యాంగ ఖైదీ ఎలా పారిపోయాడని అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ఇప్పటికే డ్యూటీలో ఉన్న సిబ్బందిని సస్పెండ్ చేశారు. గోవిందచామి తప్పించుకోవడానికి సిబ్బంది ఏమైనా సాయం చేశారా? అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నరు. బట్టలతో చేసిన తాడుతో గోవిందచామి తప్పించుకున్నట్లు కనిపెట్టారు. తెల్లవారుజామున ఉదయం 4.15 నుంచి 6.30 గంటల ప్రాంతంలో తప్పించుకున్నట్లుగా కనుగొన్నారు. అయితే ఆ సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లుగా తెలుస్తోంది. ఉద్దేశ పూర్వకంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయిందా? లేదంటే సాధారణంగా నిలిచిపోయిందా? అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: PM Modi: మరోసారి అత్యంత ప్రజాదరణ కలిగిన ప్రజాస్వామ్య నేతగా మోడీ రికార్డ్.. టాప్-5లో కనపడని ట్రంప్..!
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోవిందచామి సెల్లోని ఇనుప కడ్డీలను కత్తిరించడానికి బార్ కట్టర్ను ఉపయోగించినట్లుగా గుర్తించారు. గోడను స్కేల్ చేయడానికి తాడును తయారు చేయడానికి వస్త్రం, బెడ్షీట్లను ఉపయోగించాడు. అయితే ఎవరో సహాయం లేకుండా ఆరు మీటర్ల జైలు గోడను ఎలా ఎక్కగలిగాడని జైలు అధికారులకు అర్థం కావడం లేదు. గోవిందచామి చాలా రోజుల ముందుగానే తప్పించుకోవడానికి సిద్ధమయ్యాడని పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Trump: హమాస్ అంతం కావాల్సిందే.. పని పూర్తి చేయాలని ఇజ్రాయెల్కు ట్రంప్ సూచన
మంజక్కాడ్కు చెందిన 23 ఏళ్ల సౌమ్య అనే మహిళ ఫిబ్రవరి 1, 2011న ఎర్నాకుళం నుంచి షోర్నూర్కు ప్యాసింజర్ రైల్లో ఒంటరిగా ప్రయాణిస్తుండగా గోవిందచామి అనే వ్యక్తి అత్యాచారం చేసి హత్య చేశాడు. ఈ కేసును దర్యాప్తు చేసిన త్రిస్సూర్లోని ఫాస్ట్ ట్రాక్ కోర్టు 2012లో నిందితుడు గోవిందచామికి మరణశిక్ష విధించింది. 2014లో కేరళ హైకోర్టు ఈ తీర్పును సమర్థించింది. 2016లో ఈ కేసుపై దర్యాప్తు చేసిన సుప్రీంకోర్టు నిందితుడికి విధించిన మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చింది. నాటి నుంచి అతడు జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.
తాజావార్తలు
-
August 2026 Horoscope: ఆగస్టులో ఈ 4 రాశులకు ఆర్థికంగా కలిసొచ్చే అవకాశం.. ఆకస్మిక ధనలాభాలు?
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
OnePlus N6x 5G: 7000mAh బ్యాటరీతో వన్ప్లస్ అత్యంత చౌకైన 5G ఫోన్ లాంచ్.. ఈ ఫోన్లో ఇవే హైలైట్స్!
-
India’s Most Powerful Women 2026: దేశంలో అత్యంత ప్రభావవంతమైన మహిళలు ఎవరు?.. ఏకంగా రూ.39 లక్షల కోట్ల ఆస్తులు!
-
Telangana Civil Supplies: రేషన్ కార్డుదారులకు గుడ్న్యూస్.. 31 వరకే ఛాన్స్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!
-
24 క్యారెట్ బంగారంతో లగ్జరీ టచ్.. Caviar నుంచి ప్రత్యేక ఎడిషన్ల స్మార్ట్ ఫోన్స్ లాంచ్.!
-
200MP కెమెరా, 9,000mAh బ్యాటరీతో ఆగస్టు 11న ఎంట్రీ ఇవ్వనున్న Redmi K100 Pro Max.!
-
505Km రేంజ్, AI క్యాబిన్, 25 స్పీకర్లతో ఫ్యామిలీల కోసం Xiaomi SkyNomad Series ఎలక్ట్రిక్ SUVలు లాంచ్..!