Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News 2008 Malegaon Blast Case Verdict Today Will Pragya Singh Thakur Be Punished Or Acquitted

Malegaon Blast Case: 2008 మాలేగావ్ పేలుళ్ల కేసులో నేడే తీర్పు.. ప్రజ్ఞా సింగ్ ఠాకూర్‌కు శిక్షా..విముక్తి?

Published Date :July 31, 2025 , 8:31 am
By Chandra Shekhar Pamena
  • నేడు ముంబై కోర్టులో 2008 మాలేగావ్ పేలుళ్ల కేసు తుదీ తీర్పు..
  • ఈ ఏడాది ఏప్రిల్ 19వ తేదీన తీర్పును రిజర్వ్ చేసిన న్యాయస్థానం..
  • ఈ తీర్పుపైనే ఆధారపడిన ప్రజ్ఞా సింగ్ ఠాకూర్, ప్రసాద్ పురోహిత్ భవిష్యత్..
Malegaon Blast Case: 2008 మాలేగావ్ పేలుళ్ల కేసులో నేడే తీర్పు..  ప్రజ్ఞా సింగ్ ఠాకూర్‌కు శిక్షా..విముక్తి?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Malegaon Blast Case: 2008 మాలేగావ్ పేలుళ్ల కేసులో ముంబైలోని ప్రత్యేక కోర్టు ఈరోజు (జూలై 31న) తుది తీర్పును వెలువరించనుంది. ఈ తీర్పుతో నిందితుల భవిష్యత్తు నిర్ణయించబడనుంది. అయితే, దాదాపు 17 సంవత్సరాల పాటు సాగిన ఈ కేసు విచారణ.. అనేక చట్టపరమైన మలుపులు, సుదీర్ఘ విచారణకు ముగింపు పలికింది. అయితే, ఈ కేసులో బీజేపీ మాజీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్, లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్ ప్రధాన నిందితులుగా ఉన్నారు. వీరితో పాటు రిటైర్డ్ మేజర్ రమేష్ ఉపాధ్యాయ్, సుధాకర్ చతుర్వేది, అజయ్ రాహిర్కర్, శంకరాచార్య, సమీర్ కులకర్ణి లాంటి మరో ఐదుగురు నిందితులు విచారణను ఎదుర్కొన్నారు.

Read Also: TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. శ్రీవాణి దర్శన సమయాల్లో మార్పులు

అయితే, 2008 సెప్టెంబర్ 29వ తేదీన మాలేగావ్‌లోని భికు చౌక్‌లో జరిగిన పేలుడులో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, మరో 101 మంది తీవ్రంగా గాయపడ్డారు. ద్విచక్ర వాహనానికి అమర్చిన IED బాంబు కారణంగా ఈ పేలుడు సంభవించింది. తొలుత మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక దళం (ATS) విచారణ చేసిన తరువాత 2011లో కేసు ఎన్ఐఏకి అప్పగించింది. ఇక, పేలుడుకు ఉపయోగించిన మోటార్ సైకిల్ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ పేరుపై రిజిస్టర్ చేయబడిందని ప్రాసిక్యూషన్ వాదించింది. NIA తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అవినాష్ రసల్, కాల్ డేటా రికార్డులు, ఫోన్ కాల్స్, నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న పలు ఆధారాలను సమర్పించారు. అయితే, సుధాకర్ చతుర్వేది నివాసంలో దొరికిన RDX బాంబు కల్నల్ ప్రసాద్ పురోహిత్ ఆదేశాల మేరకే ఉపయోగించారని ప్రాసిక్యూషన్ కీలక వాదన చేసింది.

Read Also: Largest Airports in India: భారత్ లోని టాప్ 10 అతిపెద్ద విమానాశ్రయాలు ఇవే!

ఇక, డిఫెన్స్ ఈ ఆధారాలన్నింటినీ ప్రశ్నించింది. ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ తరపున న్యాయవాది మోటార్ సైకిల్ ఛాసిస్ పూర్తిగా దెబ్బతిన్నదని.. యాజమాన్యం నిర్ధారణ సాధ్యం కాదని వాదించారు. కల్నల్ ప్రసాద్ పురోహిత్ న్యాయవాది విరాల్ బాబర్ తన క్లయింట్‌ను కావాలనే ఇరికించారని, తీవ్రంగా హింసించి ఈ కేసు ఒప్పుకునేలా చేశారని వాదనలు కోర్టుకు తెలిపారు. ఎలక్ట్రానిక్ కాల్ రికార్డులకు సెక్షన్ 65B సర్టిఫికేట్ లేకపోవడంతో అవి చట్టపరంగా ఆమోదయోగ్యం కావని పేర్కొన్నారు.

Read Also: YS Jagan Nellore Tour: నేడు నెల్లూరుకు వైఎస్‌ జగన్‌.. ఆంక్షలు, కండిషన్లతో ఉత్కంఠ..

కాగా, 2018 డిసెంబర్‌లో విచారణ అధికారికంగా ప్రారంభం కాగా, 323 మంది సాక్షులను ఎంక్వైరీ చేయగా.. వారిలో 39 మంది వాంగ్మూలం మార్చగా, 26 మంది సాక్ష్యం చెప్పకముందే చనిపోయారు.. NIA MCOCA అభియోగాలను ఎత్తివేసినా, UAPA, IPC, పేలుడు పదార్థాల చట్టం కింద విచారణ కొనసాగించింది. ఈ ఏడాది ఏప్రిల్ 19వ తేదీన తీర్పును రిజర్వ్ చేసిన న్యాయస్థానం.. నేడు చివరి నిర్ణయం ప్రకటించనుంది. ఇక, దేశవ్యాప్తంగా ఈ కేసు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. ప్రజ్ఞా సింగ్ ఠాకూర్, ప్రసాద్ పురోహిత్ తదితరుల భవిష్యత్తు ఈ తీర్పుపైనే ఆధారపడి ఉంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 2008 Malegaon blast verdict
  • 2008 Malegaon terror attack
  • Lt Col Prasad Purohit
  • Malegaon blast case judgment
  • Malegaon blast case latest news

తాజావార్తలు

  • PM Modi: తృణమూల్ అహంకారం ముక్కలవుతుంది.. మమతా సర్కార్‌పై ప్రధాని ఫైర్..

  • Best Roti for Health : ఏ పిండితో రొట్టె చేసుకుంటే ఎక్కువ బెనిఫిట్స్.? నిపుణుల మాట.!

  • PM Kisan: పీఎం కిసాన్ రైతులకు శుభవార్త.. అకౌంట్లోకి నిధులు జమ అయ్యేది అప్పుడే..!

  • Brett Randell: T20 వరల్డ్ కప్ ఫైనల్ కు ముందు.. 5 బంతుల్లో 5 వికెట్లు పడగొట్టి షాకిచ్చిన కివీస్ బౌలర్

  • Uttam Nagar Tarun Case: తరుణ్‌ను చంపిన నిజాముద్దీన్ ఇంటిపై బుల్డోజర్ యాక్షన్..

ట్రెండింగ్‌

  • IND vs NZ Final 2026: టీమిండియాకు కలిసిరాని ‘సండే’ ఫైనల్స్‌.. ఈసారి సెంటిమెంట్ బ్రేక్ చేస్తుందా?

  • Sanju Samson: ఫైనల్‌కు ముందు సంజు భావోద్వేగ సందేశం.. మీరు నన్ను నిజంగా ప్రేమిస్తే..!

  • India Playing XI: భారత్ ప్లేయింగ్ ఎలెవన్‌లో కీలక మార్పు.. టీ20 ప్రపంచ కప్‌ ఫైనల్‌కు కొత్త కాంబినేషన్!

  • Team India: టీమిండియాలో భారీ మార్పులు.. సూర్యకు వీడ్కోలు, అయ్యర్‌కు నిరాశ!

  • UK07 Rider: “అమ్మా నీ ప్రేమ కావాలి”.. ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లోనే ఫేమస్ యూట్యూబర్ సూసైడ్ అటెంప్ట్.. కట్‌చేస్తే..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions