Heartbreaking story: ట్రెక్కింగ్కి వెళ్లి ఇద్దరు మృతి.. రెండు రోజుల పాటు డెడ్బాడీలకు కుక్క కాపలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Heartbreaking story: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఇద్దరు వ్యక్తులు ట్రెక్కింగ్కి వెళ్లి మరణించారు. అయితే, వారితో కూడా వెళ్లిన పెంపుడు కుక్క తన యజమానులు మృతదేహాలకు రెండు రోజుల పాటు కాపలా కాసింది. ఈ ఘటన అందర్ని కంటతడి పెట్టిస్తోంది. విహారయాత్రకు వెళ్లిన యువతీ, యువకులు అనూహ్య రీతిలో మరణించారు. వారి డెడ్బాడీలను 48 గంటల తర్వాత కనుగొన్నారు. ట్రెక్కర్స్తో పాటు వచ్చిన జర్మన్ షెఫర్డ్, వారి శరీరాలను కాపాడటమే కాకుండా, ఫిబ్రవరి 6న వారిని రెస్క్యూ బృందం గుర్తించే వరకు అరుస్తూనే ఉంది.
మరణించిన ట్రెక్కర్లను పఠాన్కోట్లోని శివనగర్కి చెందిన అభినందన్ గుప్తా (30), మహారాష్ట్రకు చెందిన ప్రణితా వాలా (26)గా గుర్తించారు. పారాగ్లైడింగ్కి ప్రసిద్ధి చెందిన లోయ ప్రాంతంలో కనిపించకుండా పోయారు. వీరు టేకాఫ్ పాయింట్ నుంచి సుమారు మూడు కిలోమీటర్ల దిగువన శవాలుగా కనుగొనబడ్డారు. మంచులో పడిపోవడం వల్లే ఇద్దరు మరణించినట్లు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక తర్వాత మరిన్ని వివరాలు వెలుగులోకి రానున్నాయి.
Also Read
Read Also: CM Revanth Reddy : ఇసుక అక్రమ రవాణాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం
అభినందన్ గుప్తా గత నాలుగేళ్లుగా పారా గ్లైడింగ్, ట్రెక్కింగ్ కోసం ఈ ప్రాంతంలో నివసిస్తున్నాడు. మహిళ కొన్ని రోజుల క్రితం పూణే నుంచి ఇచ్చికి వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. నలుగురు వ్యక్తులు టీమ్గా ఆదివారం మధ్యాహ్నం ట్రెక్కింగ్ కోసం కారులో బయలుదేరారు. కొంతదూరం వెళ్లిన తర్వాత కాలినడక ప్రారంభించారు. వాతావరణం మారడంతో ఇద్దరు వెనక్కి తగ్గగా.. గుప్తా, ప్రణీతలు ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే, గుప్తా తనకు మార్గం తెలుసని చెప్పడంతో ప్రణీత, కుక్క ముందుకు వెళ్లారని అధికారులు తెలిపారు.
ఇద్దరు చాలా సేపటి తర్వాత కూడా తిరిగి రాకపోవడంతో మిస్సింగ్ ఫిర్యాదు నమోదు చేసి, వారి కోసం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఏటవాటు ప్రాంతంలో హిమపాతం వల్ల ఇద్దరు కిందికి జారి పోయినట్లుగా తెలుస్తోంది. వీరిద్దరు చనిపోయిన తర్వాత కుక్క అక్కడే ఉంది మృతదేహాలకు రక్షణగా నిలిచింది. ఏడుస్తూ, సాయం కోసం మొరుగుతూనే ఉంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పదవుల కోసం గాంధీ భవన్కు రావొద్దు.. పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
-
Google Pixel 11a: గూగుల్ పిక్సెల్ 11a.. 8GB RAM, 120Hz డిస్ప్లే, Tensor G6 చిప్సెట్.. కొత్త ఫీచర్లు ఇవే!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Sonam Wangchuk: ‘‘ఇది రెండో స్వాతంత్య్ర ఉద్యమం’’ సోనమ్ వాంగ్చుక్ సందేశం
-
RC 17 : రామ్ చరణ్ – సుకుమార్ సినిమా షూటింగ్ కు ముహూర్తం ఫిక్స్
ట్రెండింగ్
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!