Site icon NTV Telugu

Jammu Kashmir: సరిహద్దు దాటేందుకు యత్నించిన ఉగ్రవాదులను హతమార్చిన ఆర్మీ..

Indian Army

Indian Army

Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ లో అలజడి రేపేందుకు పాకిస్తాన్ ఎప్పుడూ కుయుక్తులు పన్నుతూనే ఉంది. భారత్-పాకిస్తాన్ మధ్య నియంత్రణ రేఖను దాటించి ఉగ్రవాదులను జమ్మూ కాశ్మీర్ లోకి పంపే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే సరిహద్దును ఆనుకుని పాకిస్తాన్ వైపు ఉగ్రవాదలు లాంచింగ్ ప్యాడ్స్ సిద్ధంగా ఉన్నాయి. అదును దొరికితే వారిని భారత్ లోకి పంపేందుకు చూస్తోంది పాకిస్తాన్ ఆర్మీ.

Read Also: Cyclone Biparjoy: భీకర తుఫానులో కోస్ట్‌గార్డ్ సాహసం.. సముద్రం నుంచి 50 మంది రెస్క్యూ..

ఇదిలా ఉంటే తాజాగా ఈ రోజు ఇద్దరు ఉగ్రవాదులు నియంత్రణ రేఖ దాటి భారత్ లోకి ప్రవేశించే ప్రయత్నం చేశారు. దీంతో అప్రమత్తం అయిన భద్రతా బలగాలు ఉగ్రవాదులిద్దర్ని కాల్చి చంపేశాయి. ఈ ఘటన జమ్మూ కాశ్మీర్ లోని కుప్వారా జిల్లా మచిల్ సెక్టార్ లో చోటు చేసుకుంది. ఇద్దరు ఉగ్రవాదులను ఎల్ఓసీ వద్ద ఆర్మీ, కుప్వారా పోలీసులు జాయింట్ ఆపరేషన్ లో హతమార్చినట్లు కాశ్మీర్ జోన్ పోలీసులు ట్వీట్ చేశారు. గత నెలలో శ్రీనగర్ లో జరిగిన జీ20 సమ్మిట్ ను భగ్నం చేసేందుకు ఇలాగే పాకిస్తాన్ మద్దతు ఉన్న ఉగ్రవాదులను జమ్మూ కాశ్మీర్ లోకి పంపే ప్రయత్నం చేసింది.

Exit mobile version