Jammu Kashmir Encounter: 24 గంటల్లో రెండో ఎన్కౌంటర్.. ఇద్దరు టెర్రరిస్టులు హతం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jammu Kashmir Encounter: జమ్మూ కాశ్మీర్ మరో ఎన్కౌంటర్ జరిగింది. భద్రతాబలగాలకు కీలక విజయం లభించింది. ఈ ఎన్కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతం అయినట్లు పోలీసులు వెల్లడించారు. కొద్ది రోజుల్లో ఉగ్రవాదులు భారీగా దాడులకు సిద్ధం అవుతున్నారనే నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో భద్రతా బలగాలు అప్రమత్తం అయ్యాయి. తాజాగా గురువారం ఉదయం బారాముల్లా జిల్లాలోని క్రీరి ప్రాంతంలో వనిగం గ్రామంలో ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమాచారంతో భద్రతా బలగాలు ముందస్తు ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ ఆపరేషన్ లో ఇద్దరు ఉగ్రవాదులను పోలీసులు మట్టుపెట్టారు. ఎన్కౌంటర్ స్థలం నుండి ఒక ఎకె రైఫిల్ మరియు పిస్టల్ను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.
చనిపోయిన ఇద్దరు ఉగ్రవాదులు స్థానికులే అని.. నిషిద్ధ టెర్రర్ గ్రూప్ లష్కరే తోయిబాకు చెందిన వారిగా తెలిపారు. చనిపోయిన ఉగ్రవాదులు షకీర్ మాజిద్ నాజర్, హనన్ అహ్మద్ సెహ్ గా గుర్తించారు. వీరిద్దరు 2023లో ఉగ్రవాదంలోకి చేరారని, తదుపరి విచారణ కొనసాగుతున్నట్లు వెల్లడించారు.
Also Read
- Ketan Agarwal Case: కేతన్ను లోయలోకి తోసేముందు చేతన్ ఏమన్నాడో తెలుసా.. వెలుగులోకి కొత్త విషయాలు
- Ketan Agarwal Case: కేతన్-సియా కేసులో కొత్త ట్విస్ట్.. బ్లాక్మెయిల్ కోణంలో దర్యాప్తు..
- Woman Constable: ఇదేం పద్దతి మేడం.. ఫిర్యాదు కోసం వచ్చిన వృద్ధుడి ఎదుట.. టేబుల్పై కాళ్లు పెట్టిన మహిళా కానిస్టేబుల్
- Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
#BaramullaEncounterUpdate: Two #terrorists neutralised. Identification being ascertained. #Incriminating materials, arms & ammunition including 01 AK 47 rifle and one pistol recovered.@JmuKmrPolice https://t.co/fVozgJj8ZH
— Kashmir Zone Police (@KashmirPolice) May 4, 2023
అంతకుముందు రోజు బుధవారం కూడా కుప్వారా జిల్లాలోని మచిల్ సెక్టార్లోని నియంత్రణ రేఖ వద్ద చొరబాటుకు యత్నించిన ఇద్దరు ఉగ్రవాదుల్ని బలగాలు మట్టుపెట్టాయి. 24 గంటల్లోనే రెండు ఎన్ కౌంటర్లలో నలుగుర ఉగ్రవాదులు హతమయ్యారు. మరికొన్ని రోజుల్లో శ్రీనగర్ కేంద్రంగా జీ-20 సమావేశాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ ను అస్థిర పరిచేందుకు ఉగ్రవాదులు ప్లాన్ చేస్తున్నారని నిఘా వర్గాలు హెచ్చరికలు నేపథ్యంలో భద్రతా బలగాలు హై అలర్ట్ ప్రకటించాయి. జమ్మూ-పఠాన్కోట్ జాతీయ రహదారి వెంబడి ఉన్న అన్ని ఆర్మీ పోస్టులను అప్రమత్తం చేశారు. జమ్మూ, సాంబా, కథువా కంటోన్మెంట్ ఏరియాల్లో అన్ని పాఠశాలను బుధవారం మూసేశారు. గత నెలలో పూంచ్ లో జరగిన ఉగ్రదాడిలో ఐదుగురు జవాన్లు మరణించారు. దాడికి తెగబడిన టెర్రరిస్టులను గుర్తించేందుకు భారీగా సెర్చ్ ఆపరేషన్ జరిగింది. అయితే ఉగ్రవాదులు పట్టుబడలేదు.
తాజావార్తలు
-
Denmark: డెన్మార్క్లో అజాన్పై బ్యాన్.. ఇస్లామీకీకరణపై ఆందోళన..
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
YouTube vs Instagram: డబ్బు సంపాదించాలంటే ఇన్స్టా బెస్ట్ ఆ? యూట్యూబ్ బెస్ట్ ఆ? ఈ లెక్కలు చూస్తే షాకవుతారు!
-
Ketan Agarwal Case: కేతన్ను లోయలోకి తోసేముందు చేతన్ ఏమన్నాడో తెలుసా.. వెలుగులోకి కొత్త విషయాలు
-
Ketan Agarwal Case: కేతన్-సియా కేసులో కొత్త ట్విస్ట్.. బ్లాక్మెయిల్ కోణంలో దర్యాప్తు..
ట్రెండింగ్
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!