Odisha: టాటా స్టీల్ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది. ఒడిశాలోని దెంకనల్ జిల్లాలోని టాటా స్టీల్ కు చెందిన మెరమండలి ప్లాంట్ లో మంగళవారం ఆవిరి లీక్ అయింది. ఈ ఘటనలో మొత్తం 19 మంది గాయపడినట్లు అక్కడి పోలీసులు వెల్లడించారు. తీవ్రంగా కాలిన గాయాలు అయిన వారిని వెంటనే కటక్ లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బ్లాస్ ఫర్నెస్ ని పరిశీలిస్తున్న సందర్భంలో ఈ ఘటన జరిగింది. కార్మికులు, పలువురు ఇంజనీర్లు గాయపడ్డారు.
Read Also: Ramya Krishna: రాకీభాయ్తో కలిసి డ్యాన్స్ ఇరగదీసిన శివగామి.. వీడియో వైరల్..
రెగ్యులర్ తనిఖీల్లో భాగంగా తనిఖీ చేస్తున్న సమయంలో మధ్యాహ్నం 1 గంటకు ప్రమాదం జరిగినట్లు టాటా స్టీల్ ఒక ప్రకటనలో తెలిపింది. సైట్ లో పనిచేస్తున్న కొందరు గాయపడినట్లు పేర్కొంది. క్షతగాత్రులను వెంటనే ప్లాంట్ ప్రాంగణంలోని ఆక్యుపేషనల్ హెల్త్ సెంటర్కు తరలించి తదుపరి చికిత్స కోసం కటక్కు తరలించామని, ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా గాయపడిన వారి వెంట డాక్టర్ , పారామెడికల్ సిబ్బంది ఉన్నట్లు ఈ ప్రకటనలో తెలిపారు. ప్రమాదానికి కారణాలను నిర్ధారించడానికి అంతర్గత దర్యాప్తు ప్రారంభించినట్లు టాటా సంస్థ తెలిపింది.
