Heavy rainfall: హిమాచల్ప్రదేశ్లో అతి భారీ వర్షాలు.. 115 రోడ్లు మూసివేత
- హిమాచల్ప్రదేశ్లో అతి భారీ వర్షాలు
- 115 రోడ్లు మూసివేత
- ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హిమాచల్ప్రదేశ్ అంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కొండచరియలు విరిగిపడి రహదారులు మూసుకుపోయాయి. శుక్రవారం వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని సిమ్లా వాతావరణ కేంద్రం తెలిపింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాల నేపథ్యంలో దాదాపు 115 రహదారులను అధికారులు మూసివేశారు. దీంతో వాహనదారులకు ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులున్నాయి.
ఇది కూడా చదవండి: AAP-Cong: కాంగ్రెస్, ఆప్ పొత్తుకు బ్రేక్..అసెంబ్లీ ఎన్నికల్లో విడివిడిగా పోటీ
Also Read
- Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
- Chatgpt: చాట్ జీపీటీలో అంతరాయం.. వినియోగదారుల్లో ఆందోళన
- Jaishankar in Kyiv: భారత్ రష్యా చమురు కొనుగోలును ఆపుతుందా? జెలెన్స్కీకి జైశంకర్ క్లారిటీ..
- Jaishankar-Zelenskyy: కీవ్లో జెలెన్స్కీతో జైశంకర్ భేటీ.. యుద్ధంలో శాంతి ప్రయత్నాలపై చర్చ
మండిలో 107, చంబాలో నాలుగు, సోలన్లో మూడు, కాంగ్రా జిల్లాలో ఒకటి సహా మొత్తం 115 రోడ్లు వర్షాల కారణంగా మూసివేశారు. వాహనాల రాకపోకలు జరగకుండా ముందస్తుగా నిలిపివేశారు. ఇక రాష్ట్ర అత్యవసర ఆపరేషన్ కేంద్రం ప్రకారం రాష్ట్రంలో 212 ట్రాన్స్ఫార్మర్లకు అంతరాయం ఏర్పడినట్లు పేర్కొంది.
ఇది కూడా చదవండి: Harish Rao: రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు..
ఇదిలా ఉంటే చండీగఢ్-మనాలి నాలుగు-లేన్ల రహదారిలో మండి నుంచి పండోహ్ మధ్య పగుళ్లు ఏర్పడ్డాయి. బుధవారం నుంచి వన్-వే ట్రాఫిక్ను మాత్రమే అనుమతించాలని అధికారులు తెలిపారు. లక్షలాది రూపాయలు వెచ్చించి రిటైనింగ్ వాల్ను నిర్మించినప్పటికీ రెండు అడుగుల మేర పడిపోయిందని, నిర్మాణ నాణ్యతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. యుద్ధప్రాతిపదికన పనులు జరుగుతున్నాయని ప్రాజెక్ట్ మేనేజర్ రాజ్ శేఖర్ తెలిపారు.
ఇది కూడా చదవండి: Harish Rao: రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు..
ఇక శని, ఆదివారాల్లో (జూలై 6 మరియు 7) భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పసుపు హెచ్చరిక జారీ చేసింది. బలమైన గాలులు, వర్షం కారణంగా తోటలు, ఉద్యానవనాలు, పంటలకు నష్టం కలిగే అవకాశాలున్నాయని తెలిపింది. కచ్చా ఇళ్లు, గుడిసెలకు స్వల్ప నష్టం వాటిల్లుతుందని హెచ్చరించింది. రాష్ట్ర రాజధాని సిమ్లాలో బుధవారం సాయంత్రం నుంచి 84 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవడంతో పలు చెట్లు నేలకూలాయి. ఇక చెత్తాచెదారం రోడ్లపై పడి ఉంది.
ఇది కూడా చదవండి: SSMB 29 : ఏంటి సార్ ఇదీ.. వంట పాత్రలకు 20 లక్షల ఖర్చా?
తాజావార్తలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!