Heavy rainfall: హిమాచల్ప్రదేశ్లో అతి భారీ వర్షాలు.. 115 రోడ్లు మూసివేత
- హిమాచల్ప్రదేశ్లో అతి భారీ వర్షాలు
- 115 రోడ్లు మూసివేత
- ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
హిమాచల్ప్రదేశ్ అంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కొండచరియలు విరిగిపడి రహదారులు మూసుకుపోయాయి. శుక్రవారం వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని సిమ్లా వాతావరణ కేంద్రం తెలిపింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాల నేపథ్యంలో దాదాపు 115 రహదారులను అధికారులు మూసివేశారు. దీంతో వాహనదారులకు ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులున్నాయి.
ఇది కూడా చదవండి: AAP-Cong: కాంగ్రెస్, ఆప్ పొత్తుకు బ్రేక్..అసెంబ్లీ ఎన్నికల్లో విడివిడిగా పోటీ
Also Read
- West Bengal Exit Poll 2026: బెంగాల్ లేటెస్ట్ ఎగ్జిట్ పోల్.. బీజేపీదే అధికారం..
- Rajnath Singh: "సుదీర్ఘ యుద్ధానికి భారత్ సిద్ధం".. ఆపరేషన్ సిందూర్పై రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు..
- Mamata Banerjee: "ఇక మనం జాగ్రత్తగా ఉండాలి".. ఎగ్జిట్ పోల్స్ అనంతరం మమతా బెనర్జీ తొలి ప్రకటన!
- DJ Sound: డీజే సౌండ్కు 140 కోళ్లు బలి.. కేసు నమోదు..
మండిలో 107, చంబాలో నాలుగు, సోలన్లో మూడు, కాంగ్రా జిల్లాలో ఒకటి సహా మొత్తం 115 రోడ్లు వర్షాల కారణంగా మూసివేశారు. వాహనాల రాకపోకలు జరగకుండా ముందస్తుగా నిలిపివేశారు. ఇక రాష్ట్ర అత్యవసర ఆపరేషన్ కేంద్రం ప్రకారం రాష్ట్రంలో 212 ట్రాన్స్ఫార్మర్లకు అంతరాయం ఏర్పడినట్లు పేర్కొంది.
ఇది కూడా చదవండి: Harish Rao: రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు..
ఇదిలా ఉంటే చండీగఢ్-మనాలి నాలుగు-లేన్ల రహదారిలో మండి నుంచి పండోహ్ మధ్య పగుళ్లు ఏర్పడ్డాయి. బుధవారం నుంచి వన్-వే ట్రాఫిక్ను మాత్రమే అనుమతించాలని అధికారులు తెలిపారు. లక్షలాది రూపాయలు వెచ్చించి రిటైనింగ్ వాల్ను నిర్మించినప్పటికీ రెండు అడుగుల మేర పడిపోయిందని, నిర్మాణ నాణ్యతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. యుద్ధప్రాతిపదికన పనులు జరుగుతున్నాయని ప్రాజెక్ట్ మేనేజర్ రాజ్ శేఖర్ తెలిపారు.
ఇది కూడా చదవండి: Harish Rao: రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు..
ఇక శని, ఆదివారాల్లో (జూలై 6 మరియు 7) భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పసుపు హెచ్చరిక జారీ చేసింది. బలమైన గాలులు, వర్షం కారణంగా తోటలు, ఉద్యానవనాలు, పంటలకు నష్టం కలిగే అవకాశాలున్నాయని తెలిపింది. కచ్చా ఇళ్లు, గుడిసెలకు స్వల్ప నష్టం వాటిల్లుతుందని హెచ్చరించింది. రాష్ట్ర రాజధాని సిమ్లాలో బుధవారం సాయంత్రం నుంచి 84 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవడంతో పలు చెట్లు నేలకూలాయి. ఇక చెత్తాచెదారం రోడ్లపై పడి ఉంది.
ఇది కూడా చదవండి: SSMB 29 : ఏంటి సార్ ఇదీ.. వంట పాత్రలకు 20 లక్షల ఖర్చా?
తాజావార్తలు
-
West Bengal Exit Poll 2026: బెంగాల్ లేటెస్ట్ ఎగ్జిట్ పోల్.. బీజేపీదే అధికారం..
-
Mangli: వివాదాల నడుమ మంగ్లీ కొత్త సాంగ్ రిలీజ్
-
IPL 2026 సీజన్లో 41 మ్యాచ్ల్లోనే 10 సార్లు 200+ రన్ ఛేజ్.. ఐపీఎల్ స్వరూపాన్నే మార్చేసిన ఒకే ఒక్క రూల్ ఇదే..
-
Sorakaya Paratha Recipe : మెత్తని సొరకాయ జొన్న పరాటాలు.. బరువు తగ్గాలనుకునే వారికి పర్ఫెక్ట్ హెల్తీ బ్రేక్ఫాస్ట్.!
-
Sajjala Ramakrishna Reddy: ఓట్లు తొలగింపుపై జాగ్రత్త.. వైసీపీ నేతలకు సజ్జల కీలక సూచనలు..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!