Heavy rainfall: హిమాచల్ప్రదేశ్లో అతి భారీ వర్షాలు.. 115 రోడ్లు మూసివేత
- హిమాచల్ప్రదేశ్లో అతి భారీ వర్షాలు
- 115 రోడ్లు మూసివేత
- ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హిమాచల్ప్రదేశ్ అంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కొండచరియలు విరిగిపడి రహదారులు మూసుకుపోయాయి. శుక్రవారం వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని సిమ్లా వాతావరణ కేంద్రం తెలిపింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాల నేపథ్యంలో దాదాపు 115 రహదారులను అధికారులు మూసివేశారు. దీంతో వాహనదారులకు ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులున్నాయి.
ఇది కూడా చదవండి: AAP-Cong: కాంగ్రెస్, ఆప్ పొత్తుకు బ్రేక్..అసెంబ్లీ ఎన్నికల్లో విడివిడిగా పోటీ
Also Read
- Maharashtra: ఆర్టీఐలో మార్పులు.. అన్నాహజారే హెచ్చరికతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
- Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
- Modi-Takaichi: మారుతీ మెగా ప్లాంట్ ప్రారంభించిన మోడీ, తకైచి
మండిలో 107, చంబాలో నాలుగు, సోలన్లో మూడు, కాంగ్రా జిల్లాలో ఒకటి సహా మొత్తం 115 రోడ్లు వర్షాల కారణంగా మూసివేశారు. వాహనాల రాకపోకలు జరగకుండా ముందస్తుగా నిలిపివేశారు. ఇక రాష్ట్ర అత్యవసర ఆపరేషన్ కేంద్రం ప్రకారం రాష్ట్రంలో 212 ట్రాన్స్ఫార్మర్లకు అంతరాయం ఏర్పడినట్లు పేర్కొంది.
ఇది కూడా చదవండి: Harish Rao: రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు..
ఇదిలా ఉంటే చండీగఢ్-మనాలి నాలుగు-లేన్ల రహదారిలో మండి నుంచి పండోహ్ మధ్య పగుళ్లు ఏర్పడ్డాయి. బుధవారం నుంచి వన్-వే ట్రాఫిక్ను మాత్రమే అనుమతించాలని అధికారులు తెలిపారు. లక్షలాది రూపాయలు వెచ్చించి రిటైనింగ్ వాల్ను నిర్మించినప్పటికీ రెండు అడుగుల మేర పడిపోయిందని, నిర్మాణ నాణ్యతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. యుద్ధప్రాతిపదికన పనులు జరుగుతున్నాయని ప్రాజెక్ట్ మేనేజర్ రాజ్ శేఖర్ తెలిపారు.
ఇది కూడా చదవండి: Harish Rao: రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు..
ఇక శని, ఆదివారాల్లో (జూలై 6 మరియు 7) భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పసుపు హెచ్చరిక జారీ చేసింది. బలమైన గాలులు, వర్షం కారణంగా తోటలు, ఉద్యానవనాలు, పంటలకు నష్టం కలిగే అవకాశాలున్నాయని తెలిపింది. కచ్చా ఇళ్లు, గుడిసెలకు స్వల్ప నష్టం వాటిల్లుతుందని హెచ్చరించింది. రాష్ట్ర రాజధాని సిమ్లాలో బుధవారం సాయంత్రం నుంచి 84 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవడంతో పలు చెట్లు నేలకూలాయి. ఇక చెత్తాచెదారం రోడ్లపై పడి ఉంది.
ఇది కూడా చదవండి: SSMB 29 : ఏంటి సార్ ఇదీ.. వంట పాత్రలకు 20 లక్షల ఖర్చా?
తాజావార్తలు
-
Nandini Reddy: “నా పక్కన లేనిది మొగుడు ఒక్కడే.! మిగతావన్నీ ఉన్నాయి..” పెళ్లి, ఒంటరితనంపై ఓపెన్ అయిన లేడి డైరెక్టర్.!
-
DSP Bheem Reddy : విల్లాలు.. ఫ్లాట్లు.. కిలోల బంగారం.. డీఎస్పీ ఆస్తుల లెక్క ఇదే!
-
China: డ్రాగన్ కొత్త ఎత్తుగడ.. భారత్ సరిహద్దులో కొత్త కారిడార్కు ప్రణాళిక
-
Nandini Reddy: “అన్నం పెట్టే చెయ్యిని నరుకుతారా..?” రెమ్యునరేషన్లు పెంచే దర్శకులకు స్ట్రాంగ్ కౌంటర్!
-
Ponnam Prabhakar : ఆడలేక మద్దెల ఓడన్నట్లుంది బీఆర్ఎస్ వ్యవహారం
ట్రెండింగ్
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!