NTV Telugu Site icon

Boy in Bore Well : బోరుబావిలో పడిన బాలుడు.. 39 గంటలుగా..

Bore Wells

Bore Wells

దేశంలో బోరుబావిలో బాలుడు పడిన ఘటనలు మళ్లీ చోటు చేసుకుంటున్నాయి. గతంలో బోర్లు వేసి అందులో నీళ్లు పడకపోవడంతో నిర్లక్ష్యంగా వదిపెట్టడంతో.. తెలియక వెళ్లిన చిన్నారు అందులో పడి నరకయాతన అనుభవిస్తూ మృత్యువాతపడుతున్నారు. అయితే తాజాగా.. ఛత్తీస్‌గఢ్ లోని జాంజ్ గిర్ -చంపా జిల్లాలో 80 అడుగుల లోతు బోరు బావిలో రాహుల్‌ అనే 11 ఏళ్ల బాలుడు పడిపోయాడు. రాహుల్ ను కాపాడేందుకు గుజరాత్ కు చెందిన రోబోటిక్ టీమ్ రంగంలోకి దిగింది. మాట్లాడలేని, వినలేని సదరు బాలుడు శుక్రవారం సాయంత్రం బోరుబావిలో పడిపోవడం అందరినీ కలిచివేస్తోంది. ఇప్పటికి 39 గంటలు గడిచిపోయాయి.

అయితే ఇప్పటికే.. బాలుడ్ని కాపాడేందుకు రోబోటిక్ టీమ్ తన ప్రయత్నాలు మొదలు పెట్టింది. ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన సూరత్ కు చెందిన రోబోల బృందానికి తగిన సూచనలు చేసినట్టు చత్తీస్ గఢ్ సీఎం బూపేష్ బాఘల్ తెలిపారు. గుజరాత్ కు చెందిన మహేష్ అహిర్ తన బోరుబావి రెస్క్యూ రోబో ఆవిష్కరణను ట్వీట్ చేశాడని, అతడు రాహుల్ ను కాపాడగలడన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. చిన్నారిని రక్షించేందుకు అతడి సాయాన్ని తీసుకుంటున్నట్టు చెప్పారు. బోరు బావికి సమాంతరంగా క్రేన్ల సాయంతో మట్టిని తోడి పోస్తున్నారు.

ఈ క్రమంలో ఒక గట్టి రాయి తగిలింది. దాన్ని పగలగొట్టడం కూడా వారికి సవాలుగా మారింది. రాళ్లను బద్దలు కొట్టే మెషినరీని తీసుకొచ్చారు. బాలుడిని కాపాడేందుకు మరో 10 నుంచి 15 గంటల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. ముఖ్యమంత్రి స్వయంగా ఈ ఘటనను సమీక్షిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రక్షణ లేకుండా వదిలేసిన అన్ని బోర్ వెల్స్ ను మూసివేయాలని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు.