Vishal Rathnam to release on april 26th: తెలుగువాడైనా హీరో విశాల్ సినిమాకు అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్లో మంచి డిమాండ్ ఉంటుంది. ఒకప్పటి స్టార్ నిర్మాత కుమారుడైన విశాల్ అంటే అందరికీ యాక్షన్ చిత్రాలు గుర్తుకు వస్తాయి. అలాంటి యాక్షన్ డైరెక్టర్ హరితో విశాల్ మూవీ అంటే యాక్షన్ మూవీ లవర్స్కు ఇక పండుగే అంటున్నారు మేకర్స్. వీరిద్దరి కాంబినేషన్లో ‘రత్నం’ అనే మూవీ ఫుల్ యాక్షన్ మూవీగా రాబోతోంది. ఆల్రెడీ ఇప్పటి వరకు వదిలిన ప్రమోషనల్ కంటెంట్ చూసి మాస్ లవర్స్లో ఈ మూవీ మీద అంచనాలు పెరిగాయి. జీ స్టూడియోస్తో పాటు స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంయుక్తంగా ఈ ‘రత్నం’ అనే సినిమాను నిర్మిస్తున్నారు. రత్నం సినిమాకి హరి డైరెక్టర్గా, కార్తికేయన్ సంతానం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
Prasanth Varma : సినిమాటిక్ యూనివర్స్ ఆలోచన అలా వచ్చింది..
కళ్యాణ్ సుబ్రహ్మణ్యం అలంకార్ పాండియన్ కో-ప్రోడ్యుసర్ కాగా ఈ సినిమాలో విశాల్ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ను అందిస్తున్న రత్నం ఫస్ట్ షాట్ టీజర్, పాటలు ఇలా ఇప్పటికే అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ మూవీ షూటింగ్ పూర్తయినట్టు మేకర్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ అప్డేట్ అలా ఇచ్చారో లేదో వెంటనే సినిమా యూనిట్ రిలీజ్ డేట్ను కూడా లాక్ చేసింది. ఏప్రిల్ 26న ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లుగా నిర్మాతలు ప్రకటించారు. సమ్మర్ టార్గెట్ గా ఈ యాక్షన్ మూవీ థియేటర్లోకి రాబోతోందని తెలిపారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుపుకుంటోన్న ఈ సినిమా వరుసగా అప్డేట్లతో టీం సందడి చేయనుందని పేర్కొన్నారు.