Vaarasudu Trailer: గ్రౌండ్లో ఎంతమంది ప్లేయర్స్ ఉన్నా.. ఆడియన్స్ చూసేది ఒక్కరినే..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaarasudu Trailer: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్కు టాలీవుడ్లోనూ క్రమంగా మార్కెట్ పెరుగుతోంది. అతడి గత చిత్రాలు ఈ విషయం నిరూపించాయి. ముఖ్యంగా మాస్టర్ మూవీ విజయ్ కెరీర్లో తెలుగులోనూ బెస్ట్ వసూళ్లను సాధించింది. ఇప్పుడు వారసుడు మూవీతో మరోసారి విజయ్ తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ మూవీ సంక్రాంతి కానుకగా తమిళం, తెలుగు భాషల్లో ఈనెల 12న విడుదల కానుంది. ఈ సాయంత్రమే ఈ సినిమా తమిళ ట్రైలర్ విడుదల కాగా తాజాగా తెలుగు ట్రైలర్ కూడా విడుదల చేశారు. కుటుంబం నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీని వంశీ పైడిపల్లి తెరకెక్కించాడు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ సినిమా బ్యానర్లపై ఈ మూవీని దిల్ రాజు, ప్రసాద్ వి పొట్లూరి నిర్మించారు.
Read Also: VeerasimhaReddy: వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక మార్పు.. కారణం ఏంటంటే..?
Also Read
వారసుడు మూవీలో రష్మిక హీరోయిన్గా నటించగా ప్రకాష్ రాజ్, జయసుధ, సుమన్, శరత్ కుమార్, కిక్ శ్యామ్ ప్రధాన పాత్రలు పోషించారు. ట్రైలర్లో ప్రకాష్ రాజ్ విలన్గా కనిపిస్తున్నాడు. ఈ సందర్భంగా అతడికి, విజయ్కు మధ్య సాగే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉన్నాయి. గ్రౌండ్లో ఎంతమంది ప్లేయర్స్ ఉన్నా ఆడియన్స్ చూసేది ఒక్కరినే అని.. అది నాయకుడినే అని విజయ్ చెప్పే డైలాగ్ అభిమానులను ఆకట్టుకుంటోంది. తమన్ సంగీతం సమకూర్చిన ఈ సినిమాలో పాటలు కూడా ఇప్పటికే సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఓ కుటుంబం చుట్టూ తిరిగే కథతో ఈ సినిమా రూపొందిందని టైటిల్ చూస్తేనే తెలుస్తోంది. మరి సంక్రాంతి బరిలో వారసుడు ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో వేచి చూడాల్సిందే.
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!