Vani Jayaram : వాణీ జయరామ్ సిగలో ‘పద్మ’భూషణం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు చిత్రసీమలో తనదైన వాణి వినిపించి, తనకంటూ ఓ బాణీని ఏర్పరచుకున్న మధురగాయని వాణీ జయరామ్ కీర్తి కిరీటంలో పద్మభూషణ్ అవార్డు చోటు చేసుకోవడం సంగీత ప్రియులందరికీ ఆనందం పంచుతోంది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్రప్రభుత్వం వాణీ జయరామ్ కు పద్మభూషణ్ అవార్డును ప్రకటించింది. ఈ వార్త వినగానే దేశవిధేశాల్లోని వాణీ జయరామ్ అభిమానుల ఆనందం అంబరమంటింది. వాణీ జయరామ్ ప్రతిభకు కేంద్రం తగిన సమయంలో సరైన అవార్డును ప్రదానం చేస్తోందని పలువురు సంగీతాభిమానులు ప్రశంసిస్తున్నారు.
తమిళనాట పుట్టి, ముంబైలో తన గళవిన్యాసాలను వినిపించి, తెలుగునేలపై సంగీతప్రియులను పరవశింపచేశారు వాణీజయరామ్. బాల్యం నుంచీ సంగీతం పట్ల అభిలాష కలిగిన వాణీజయరామ్ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో రంగరామానుజ అయ్యంగార్ వద్ద శాస్త్రీయ సంగీతంలో శిక్షణ తీసుకున్నారు. కర్ణాటక సంగీతంలో సాధన చేసిన వాణీ జయరామ్ కేవలం ఎనిమిదేళ్ళ ప్రాయంలోనే ఆల్ఇండియా రేడియోలో గానంచేసి మురిపించారు. పట్టాపుచ్చుకున్న తరువాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేశారు. 1967లో హైదరాబాద్ లోనూ ఆమె బ్యాంక్ ఉద్యోగిగా ఉన్నారు. పెళ్ళయిన తరువాత ఉత్తరాదికి వెళ్ళిన వాణిని ఆమెభర్త కూడా ఎంతగానో ప్రోత్సహించారు. అలా కొన్ని హిందీ చిత్రాలలో వాణి పాట మధురం పంచింది. ముఖ్యంగా జయబాధురికి నటిగా ఎంతో పేరు సంపాదించి పెట్టిన ‘గుడ్డి’లో వాణీ జయరామ్ పాడిన “బోలే రే పపిహరా…” పాట ఈ నాటికీ వీనులవిందు చేస్తూనే ఉంది. ప్రతిభావంతులు ఎక్కడ ఉన్నా ప్రోత్సహించే సంగీత దర్శకులు ఎస్.పి.కోదండపాణి 1973లో తాను స్వరకల్పన చేసిన ‘అభిమానవంతులు’లో “ఎప్పటి వలె కాదురా నా స్వామీ…” అనే పాటను పాడించారు. ఆ పాటతోనే తెలుగువారి మదిని గెలిచారు వాణి. తరువాతి రోజుల్లో కేవీ మహదేవన్, రాజన్ నాగేంద్ర, సుసర్ల దక్షిణామూర్తి, ఎమ్మెస్ విశ్వనాథన్, సత్యం, చక్రవర్తి, ఇళయరాజా వంటి సంగీత దర్శకులు వాణి జయరామ్ ను ఎంతగానో ప్రోత్సహించారు. నటదర్శకులు యన్టీఆర్ తన సొంత చిత్రాలలో వాణీ జయరామ్ తో ఏదో ఒక పాట పాడించేవారు. ఆయన దర్శకత్వంలో రూపొందిన ‘శ్రీమద్విరాటపర్వము’లోని “రమ్మని పిలిచిందిరో ఊర్వశి…” అనే గీతం, ‘శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర’లోని “శృంగార రసరాజమౌళి…” అంటూ సాగే పాటను వాణీ జయరామ్ ఆలపించారు. కళాతపస్వి కె.విశ్వనాథ్ కూడా పలు మధురమైన గీతాలను వాణీజయరామ్ తో పాడించి, జనాన్ని ఆకట్టుకొనేలా చేశారు. ‘శంకరాభరణం’లో వాణీజయరామ్ పాడిన పాటలు ప్రేక్షకులన విశేషంగా అలరించాయి. 1979లో వాణిని ఉత్తమగాయనిగా నంది అవార్డు అందుకొనేలా చేశాయి ‘శంకరాభరణం’ పాటలు.
Also Read
- Kayadu Lohar: ‘ది ప్యారడైజ్’లో కాయదు విలనా.. హీరోయినా? నాని మైండ్ బ్లాంక్ రియాక్షన్!
- The Paradise : ‘ది ప్యారడైజ్’ సీక్రెట్స్ లీక్ చేసిన సంపూర్ణేష్ బాబు! నాని జడల వెనుక అసలు కథ ఇదేనట..
- Sampoornesh Babu: స్టార్డమ్ ముసుగు తీసేసిన సంపూ.. తెరవెనుక అసలైన జీవితం ఇదేనట!
- Viswanath & Sons : నెట్ఫ్లిక్స్ను ఊపేస్తున్న సూర్య సినిమా.. ఇండియాలో నెం.1.. గ్లోబల్గా టాప్-3!
తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, హిందీ భాషలతో పాటు గుజరాతీ, మరాఠీ, మార్వాడీ, హర్యానీ, బెంగాలీ, ఒరియా, ఇంగ్లిష్ భాషల్లోనూ వాణీజయరామ్ తన గళంతో మధురం పంచారు. 1975లో కె.బాలచందర్ ‘అపూర్వ రాగంగళ్’లో పాటలు పాడి జాతీయ స్థాయిలో ఉత్తమగాయనిగా నిలిచారు వాణీజయరామ్. 1979లో ‘శంకరాభరణం’తోనూ నేషనల్ అవార్డును సొంతం చేసుకున్నారామె. 1991లో కె.విశ్వనాథ్ ‘స్వాతికిరణం’లో “ఆనతినీయరా…” పాటతో మరోమారు జాతీయ ఉత్తమగాయనిగా నిలిచారు. దాదాపు పదివేల పాటలు పాడిన వాణీ జయరామ్ కు ‘పద్మభూషణ్’ అవార్డు ప్రకటించడం పట్ల సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ గానకోకిల మరిన్ని ప్రతిష్ఠాత్మక అవార్డులు సొంతం చేసుకోవాలని పలువురు అభిలషిస్తున్నారు.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..