వైరముత్తును పక్కన పెట్టిన మణిరత్నం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మణిరత్నం తాజా చిత్రం ‘పొన్నియన్ సెల్వం’. ఇది రెండు భాగాలుగా రాబోతోంది. తొలిభాగం 2022 వేసవికి విడుదల కానుంది. ఈ పీరియాడిక్ డ్రామా లో విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్యారాయ్, త్రిష, ఐశ్వర్యలక్ష్మి, శరత్ కుమార్ ప్రధాన తారాగణం. ఇక ఈ సినిమాకు మణి ఆస్థాన సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. అయితే మణితో దశాబ్దాల అనుబంధం ఉన్న గేయరచయిత వైరముత్తు ఈ చిత్రానికి పని చేయటం లేదు. దీనికి కారణం అతడిపై వచ్చిన లైంగిక ఆరోపణలు.
మణిరత్నం దర్శకుడైన తొలినాళ్ల నుంచి అతగాడి సినిమాలకు పాటలు రాస్తూ వచ్చాడు వైరముత్తు. మణి మూడో సినిమా ‘ఇదయకోవిల్’ నుంచి వీరిద్దరి అనుబంధం ‘చెక్కా వసంత వానం’ వరకూ కొనసాగింది. మూడు దశాబ్దాలకు పైగా వైరముత్తు పాట లేకుండా తొలిసారి సినిమా తీస్తున్నాడు మణిరత్నం. కేవలం వైరముత్తుపై వచ్చిన లైంగిక ఆరోపణలే అందుకు కారణం. రెండు భాగాల పొన్నియన్ సెల్వం లో ఇలంగో కృష్ణన్ ఎనిమిది పాటలు రాయగా… కపిలన్ నాలుగు పాటలు రాశారు. మరి లైంగిక ఆరోపణ కారణంగా వైరముత్తుతో ముప్ఫై ఏళ్ళ అనుబంధాన్ని పక్కన పెట్టి మణిరత్నం ఈ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూద్దాం.
Also Read
తాజావార్తలు
-
Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
-
Weather Update: ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ..
-
Jr NTR: జూనియర్ ఎన్టీఆర్కు తీవ్ర గాయం.. రేపే సర్జరీ!
-
Lal Darwaza Bonalu: బోనాల వేళ పోలీసుల సీక్రెట్ ఆపరేషన్.. 116 మంది అదుపులో..
-
Teacher Suspended: విద్యార్థినులతో లీలలు.. ప్రభుత్వ టీచర్ సస్పెండ్..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..