మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మాస్ ఎంటర్టైనర్ ‘పెద్ది’. మైత్రీ మూవీస్, వృద్ధి సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాగా చిత్రానికి తెలంగాణ ప్రభుత్వం నుంచి భారీ ఊరట లభించిన సంగతి తెలిసిందే. టికెట్ల రేట్ల పెంపుతో పాటు 10 రోజుల పాటు 5 షోల ప్రదర్శనకు అనుమతితో పాటు టికెట్ ధరలు పెంచుతూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. అయితే ఈ జీవో రావడం వెనుక నిర్మాత షైన్ స్క్రీన్స్ అధినేత సాహు గారపాటి అన్ని తానై వ్యవహరించారట. ఇప్పుడు ఈ విషయం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది.
వాస్తవంగా ‘పెద్ది’ సినిమాకు తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతులు వస్తాయా? రావా? అసలు టికెట్ రేట్ల పెంపు ఎంత వరకు ఉంటుంది? అని ఇండస్ట్రీ వర్గాలతో పాటు ఫ్యాన్స్ లోను ఎన్నో అనుమానాలు వ్యక్తమయ్యాయి. గతంలో మైత్రి వారి అనేక సినిమాలకు నైజాంలో అదనపు రేట్లు రాలేదు. దాంతో పెద్ది సినిమాకు జీవో రాదని డౌట్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన టాలీవుడ్ బడా నిర్మాత షైన్ స్క్రీన్ అధినేత సాహు గారపాటి తెరవెనుక చక్రం తిప్పారు. అసలు ఎలాంటి హడావుడి లేకుండా సైలెంట్గా బ్యాక్గ్రౌండ్ వర్క్ పూర్తి చేసి జీవోను సాధించి చూపించారు. మనశంకర వరప్రసాద్ గారు, అఖండ 2 సినిమాలకు కూడా నైజాం ఏరియాలో ఇలాగే అదనపు షోలు, స్పెషల్ పర్మిషన్లు రాబట్టారు సాహు గారపాటి. ఇప్పుడు‘పెద్ది’ సినిమా కోసం సాహు గారపాటి ప్రభుత్వం నుంచి జీవో తెప్పించడంలో సక్సెస్ అయ్యారు. ఈ జీవోతో నైజాం బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. మైత్రీ మూవీస్ కు సపోర్ట్ గా సాహు గారపాటి జీవో తీసుకురావడంతో సాహును అబినందింస్తున్నారు.
