NTV Telugu Site icon

Shocking: ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అరెస్ట్… అసలు ఏమైందంటే?

Atluri Narayana Rao Arrested

Atluri Narayana Rao Arrested

Tollywood Producer Atluri Narayana Rao Arrested: అధిక వడ్డీ ఆశ చూపించి వందలాది మందిని మోసం చేసిన కేసులో టాలీవుడ్ ప్రముఖ నిర్మాతను పోలీసులు అరెస్ట్ చేశారు. నీదీ నాది ఒకే కథ, గర్ల్ ఫ్రెండ్ లాంటి సినిమాలు నిర్మించిన అట్లూరి నారాయణరావు‌ని ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ దందా కేసులో పోలీసులు ఏపీలో అరెస్టు చేశారు పోలీసులు. డిసెంబర్ 01న అంటే శుక్రవారం నాడు ఆంధ్రప్రదేశ్ లో ఆయనను సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి, హైదరాబాద్ నాంపల్లి కోర్టులో హాజరు పరిచారని తెలుస్తోంది. ఇప్పుడు నారాయణరావును ఒక కేసులో అరెస్ట్ చేసినా ఆయన మీద గతంలో కూడా చాలా కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. చాక్లెట్ డిస్ట్రిబ్యూషన్, డీలర్ షిప్ పేరుతో దాదాపు వందల మందిని మోసం చేసి 530 కోట్లు వసూళ్లు చేశారని ఆయనపై గతంలోనే ఆభియోగాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ కేసులో సూత్రధారులుగా ఉన్న మరికొంత మందిని ఆంధ్రాలో గత నెలలోనే పోలీసులు అరెస్ట్ చేయగా ఇప్పుడు నారాయణ రావును అరెస్ట్ చేశారు.

Corona: భారత్‌లో కొత్తగా 88 కరోనా కేసులు..

రాంబాబు అనే ఒక వ్యక్తి తక్కువ సమయంలో పెట్టిన పెట్టుబడికి ఎక్కువ వడ్డీ వస్తుందని ఆశ చూపించి ఇండస్ట్రీకి చెందిన వారిని, పలు వ్యాపారులను మోసం చేసి కోట్లు వసూళ్లు చేసిన తర్వాత బోర్డు తిప్పేయడంతో బాధితులు కేసులు పెట్టారు. ఈ క్రమంలో రాంబాబు ఓ చార్టెడ్ అకౌంట్ ద్వారా నిర్మాత నారాయణరావును కలవగా, కేసు లేకుండా చేస్తా అని రూ.20 కోట్లు డిమాండ్ చేశాడు. బేరసారాలు చేసి డీల్ రూ.2 కోట్లకు కుదుర్చుకొని పది లక్షలు అడ్వాన్స్, కోటి విలువైన గోల్డ్ ఆభరణాలు తీసుకుని ఆ నగలను పాతబస్తీలో కరిగించి 90 లక్షలకు అమ్మేశాడు. ఈ క్రమంలో రాంబాబు కేసు పెట్టడంతో ఆయనను ఏపీలో అరెస్ట్ చేశారు. కాగా, నారాయణరావును అదనపు విచారణ కోసం పోలీసు కస్టడీకి అప్పగించాల్సిందిగా నాంపల్లి కోర్టుకు పోలీసులు పిటీషన్ దాఖలు చేసినట్లు వార్తలు వస్తున్నా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.