Shocking: ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అరెస్ట్… అసలు ఏమైందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tollywood Producer Atluri Narayana Rao Arrested: అధిక వడ్డీ ఆశ చూపించి వందలాది మందిని మోసం చేసిన కేసులో టాలీవుడ్ ప్రముఖ నిర్మాతను పోలీసులు అరెస్ట్ చేశారు. నీదీ నాది ఒకే కథ, గర్ల్ ఫ్రెండ్ లాంటి సినిమాలు నిర్మించిన అట్లూరి నారాయణరావుని ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ దందా కేసులో పోలీసులు ఏపీలో అరెస్టు చేశారు పోలీసులు. డిసెంబర్ 01న అంటే శుక్రవారం నాడు ఆంధ్రప్రదేశ్ లో ఆయనను సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి, హైదరాబాద్ నాంపల్లి కోర్టులో హాజరు పరిచారని తెలుస్తోంది. ఇప్పుడు నారాయణరావును ఒక కేసులో అరెస్ట్ చేసినా ఆయన మీద గతంలో కూడా చాలా కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. చాక్లెట్ డిస్ట్రిబ్యూషన్, డీలర్ షిప్ పేరుతో దాదాపు వందల మందిని మోసం చేసి 530 కోట్లు వసూళ్లు చేశారని ఆయనపై గతంలోనే ఆభియోగాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ కేసులో సూత్రధారులుగా ఉన్న మరికొంత మందిని ఆంధ్రాలో గత నెలలోనే పోలీసులు అరెస్ట్ చేయగా ఇప్పుడు నారాయణ రావును అరెస్ట్ చేశారు.
Corona: భారత్లో కొత్తగా 88 కరోనా కేసులు..
Also Read
- Dancers Association Rift: 'ఉప ఎన్నికల'కే మొగ్గు చూపిన అధ్యక్షురాలు.. 'పూర్తి ఎన్నికలు' కావాలంటున్న అసమ్మతి వర్గం!
- TamannaahBhatia : బోల్డ్ హారర్ థ్రిల్లర్లో తమన్నా భాటియా.. రసహృదయాలు కాస్త జాగ్రత్త
- NBK 111 Release Date : సంక్రాంతి కాదు.. బాలయ్య - గోపీచంద్ మలినేని NBK111 రిలీజ్ డేట్ ఫిక్స్?
- Mahendragiri Varahi : థియేటర్లలోకి వారాహి అమ్మవారి ఆగమనం.. 'మహేంద్రగిరి వారాహి' టీమ్ వినూత్న ప్రమోషన్స్!
రాంబాబు అనే ఒక వ్యక్తి తక్కువ సమయంలో పెట్టిన పెట్టుబడికి ఎక్కువ వడ్డీ వస్తుందని ఆశ చూపించి ఇండస్ట్రీకి చెందిన వారిని, పలు వ్యాపారులను మోసం చేసి కోట్లు వసూళ్లు చేసిన తర్వాత బోర్డు తిప్పేయడంతో బాధితులు కేసులు పెట్టారు. ఈ క్రమంలో రాంబాబు ఓ చార్టెడ్ అకౌంట్ ద్వారా నిర్మాత నారాయణరావును కలవగా, కేసు లేకుండా చేస్తా అని రూ.20 కోట్లు డిమాండ్ చేశాడు. బేరసారాలు చేసి డీల్ రూ.2 కోట్లకు కుదుర్చుకొని పది లక్షలు అడ్వాన్స్, కోటి విలువైన గోల్డ్ ఆభరణాలు తీసుకుని ఆ నగలను పాతబస్తీలో కరిగించి 90 లక్షలకు అమ్మేశాడు. ఈ క్రమంలో రాంబాబు కేసు పెట్టడంతో ఆయనను ఏపీలో అరెస్ట్ చేశారు. కాగా, నారాయణరావును అదనపు విచారణ కోసం పోలీసు కస్టడీకి అప్పగించాల్సిందిగా నాంపల్లి కోర్టుకు పోలీసులు పిటీషన్ దాఖలు చేసినట్లు వార్తలు వస్తున్నా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
తాజావార్తలు
-
Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
-
Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
-
Thalliki Vandanam: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. వారికి కూడా ‘తల్లికి వందనం’ వర్తింపు..
-
Pallaburusu: టూత్బ్రష్తో జిల్లా కోర్టులో లీగల్ ఫైట్?
-
Bullet Train: బుల్లెట్ ట్రైన్ ఆలస్యానికి భారతే కారణం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలు..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?