Shocking: ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అరెస్ట్… అసలు ఏమైందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tollywood Producer Atluri Narayana Rao Arrested: అధిక వడ్డీ ఆశ చూపించి వందలాది మందిని మోసం చేసిన కేసులో టాలీవుడ్ ప్రముఖ నిర్మాతను పోలీసులు అరెస్ట్ చేశారు. నీదీ నాది ఒకే కథ, గర్ల్ ఫ్రెండ్ లాంటి సినిమాలు నిర్మించిన అట్లూరి నారాయణరావుని ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ దందా కేసులో పోలీసులు ఏపీలో అరెస్టు చేశారు పోలీసులు. డిసెంబర్ 01న అంటే శుక్రవారం నాడు ఆంధ్రప్రదేశ్ లో ఆయనను సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి, హైదరాబాద్ నాంపల్లి కోర్టులో హాజరు పరిచారని తెలుస్తోంది. ఇప్పుడు నారాయణరావును ఒక కేసులో అరెస్ట్ చేసినా ఆయన మీద గతంలో కూడా చాలా కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. చాక్లెట్ డిస్ట్రిబ్యూషన్, డీలర్ షిప్ పేరుతో దాదాపు వందల మందిని మోసం చేసి 530 కోట్లు వసూళ్లు చేశారని ఆయనపై గతంలోనే ఆభియోగాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ కేసులో సూత్రధారులుగా ఉన్న మరికొంత మందిని ఆంధ్రాలో గత నెలలోనే పోలీసులు అరెస్ట్ చేయగా ఇప్పుడు నారాయణ రావును అరెస్ట్ చేశారు.
Corona: భారత్లో కొత్తగా 88 కరోనా కేసులు..
Also Read
- Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
- Aadarsha Kutumbam Postponed: వెంకీ మామా ‘ఆదర్శ కుటుంబం’ పోస్ట్పోన్.. కొత్త డేట్ ఇదేనా?
- Z5: బాలయ్య, వెంకీ, అఖిల్, చైతూలతో 'జీ5' సంచలనం..కళ్లు చెదిరే బ్లాక్ బస్టర్ లైనప్ ఇదే!
- Trivikram Srinivas: అప్పట్లో ‘అజ్ఞాతవాసి’ దెబ్బకు ఇల్లు అమ్మేయాలనుకున్న త్రివిక్రమ్.. అసలేం జరిగిందంటే?
రాంబాబు అనే ఒక వ్యక్తి తక్కువ సమయంలో పెట్టిన పెట్టుబడికి ఎక్కువ వడ్డీ వస్తుందని ఆశ చూపించి ఇండస్ట్రీకి చెందిన వారిని, పలు వ్యాపారులను మోసం చేసి కోట్లు వసూళ్లు చేసిన తర్వాత బోర్డు తిప్పేయడంతో బాధితులు కేసులు పెట్టారు. ఈ క్రమంలో రాంబాబు ఓ చార్టెడ్ అకౌంట్ ద్వారా నిర్మాత నారాయణరావును కలవగా, కేసు లేకుండా చేస్తా అని రూ.20 కోట్లు డిమాండ్ చేశాడు. బేరసారాలు చేసి డీల్ రూ.2 కోట్లకు కుదుర్చుకొని పది లక్షలు అడ్వాన్స్, కోటి విలువైన గోల్డ్ ఆభరణాలు తీసుకుని ఆ నగలను పాతబస్తీలో కరిగించి 90 లక్షలకు అమ్మేశాడు. ఈ క్రమంలో రాంబాబు కేసు పెట్టడంతో ఆయనను ఏపీలో అరెస్ట్ చేశారు. కాగా, నారాయణరావును అదనపు విచారణ కోసం పోలీసు కస్టడీకి అప్పగించాల్సిందిగా నాంపల్లి కోర్టుకు పోలీసులు పిటీషన్ దాఖలు చేసినట్లు వార్తలు వస్తున్నా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!