Shocking: ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అరెస్ట్… అసలు ఏమైందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tollywood Producer Atluri Narayana Rao Arrested: అధిక వడ్డీ ఆశ చూపించి వందలాది మందిని మోసం చేసిన కేసులో టాలీవుడ్ ప్రముఖ నిర్మాతను పోలీసులు అరెస్ట్ చేశారు. నీదీ నాది ఒకే కథ, గర్ల్ ఫ్రెండ్ లాంటి సినిమాలు నిర్మించిన అట్లూరి నారాయణరావుని ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ దందా కేసులో పోలీసులు ఏపీలో అరెస్టు చేశారు పోలీసులు. డిసెంబర్ 01న అంటే శుక్రవారం నాడు ఆంధ్రప్రదేశ్ లో ఆయనను సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి, హైదరాబాద్ నాంపల్లి కోర్టులో హాజరు పరిచారని తెలుస్తోంది. ఇప్పుడు నారాయణరావును ఒక కేసులో అరెస్ట్ చేసినా ఆయన మీద గతంలో కూడా చాలా కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. చాక్లెట్ డిస్ట్రిబ్యూషన్, డీలర్ షిప్ పేరుతో దాదాపు వందల మందిని మోసం చేసి 530 కోట్లు వసూళ్లు చేశారని ఆయనపై గతంలోనే ఆభియోగాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ కేసులో సూత్రధారులుగా ఉన్న మరికొంత మందిని ఆంధ్రాలో గత నెలలోనే పోలీసులు అరెస్ట్ చేయగా ఇప్పుడు నారాయణ రావును అరెస్ట్ చేశారు.
Corona: భారత్లో కొత్తగా 88 కరోనా కేసులు..
Also Read
- Rashmika Mandanna: గానకోకిల బయోపిక్లో నేషనల్ క్రష్.. క్లాప్ కొట్టిన కమల్ హాసన్!
- CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
- Anant Nag: కేజీఎఫ్ నటుడికి దాదాసాహెబ్ ఫాల్కే.. సినీ లెజెండ్పై ప్రధాని మోడీ పొగడ్తల వర్షం!
- The Paradise: కాకులు వేటకు సిద్ధమయ్యాయి.. నాని 'ది ప్యారడైజ్' టూర్ షెడ్యూల్ ఇదే! ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
రాంబాబు అనే ఒక వ్యక్తి తక్కువ సమయంలో పెట్టిన పెట్టుబడికి ఎక్కువ వడ్డీ వస్తుందని ఆశ చూపించి ఇండస్ట్రీకి చెందిన వారిని, పలు వ్యాపారులను మోసం చేసి కోట్లు వసూళ్లు చేసిన తర్వాత బోర్డు తిప్పేయడంతో బాధితులు కేసులు పెట్టారు. ఈ క్రమంలో రాంబాబు ఓ చార్టెడ్ అకౌంట్ ద్వారా నిర్మాత నారాయణరావును కలవగా, కేసు లేకుండా చేస్తా అని రూ.20 కోట్లు డిమాండ్ చేశాడు. బేరసారాలు చేసి డీల్ రూ.2 కోట్లకు కుదుర్చుకొని పది లక్షలు అడ్వాన్స్, కోటి విలువైన గోల్డ్ ఆభరణాలు తీసుకుని ఆ నగలను పాతబస్తీలో కరిగించి 90 లక్షలకు అమ్మేశాడు. ఈ క్రమంలో రాంబాబు కేసు పెట్టడంతో ఆయనను ఏపీలో అరెస్ట్ చేశారు. కాగా, నారాయణరావును అదనపు విచారణ కోసం పోలీసు కస్టడీకి అప్పగించాల్సిందిగా నాంపల్లి కోర్టుకు పోలీసులు పిటీషన్ దాఖలు చేసినట్లు వార్తలు వస్తున్నా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!