‘మా’ అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతోంది. ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి తలసాని శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ “మా’కు ఎన్నికయిన సభ్యులకు నా అభినందనలు. ఇది ఎంతో సంతోషదాయకమై సందర్భం. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల స్థాయిలో ‘మా’ ఎన్నికలు జరిగాయి. ‘మా’ అసోషియేషన్ అంటే చిన్న అసోసియేషన్ కాదు. ‘మా’ అంటే పెద్ద వ్యవస్థ. మోహన్ బాబు మంచు విష్ణు కు చదువు, సంస్కరం, క్రమశిక్షణ ఇచ్చారు. ఇండస్ట్రీలో మోహన్ బాబుకు కోపం ,ఆవేశం ఎక్కువని అందరూ అనుకుంటారు. తప్పును తప్పు అని ధైర్యంగా మోహన్ బాబు చెబుతారు. మోహన్ బాబు నుంచి నేను చాలా నేర్చుకున్నాను. మోహన్ బాబు కోపం ఆయనికే నష్టం చేసింది ఇతరులకు కాదు.
Read Also : ప్రమాణ స్వీకారానికి డుమ్మా కొట్టిన రఘుబాబు
‘మా’ ఎన్నికకు 10 రోజుల ముందే ఫోన్ చేసి మంచు విష్ణు గెలుస్తారని చెప్పా. సినీ పరిశ్రమ తలుచుకుంటే 900 వందలు కాదు…9 వేల మందిని నడిపించుకోవచ్చు. మంచు విష్ణు టీం ను సీఎం కేసీఆర్ దగ్గరికి పిలుస్తాం. చిత్రపురి ప్రాంతాల్లో మౌలిక వసతుల ఏర్పాటు విషయంలో ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయం చేసాము. అందరూ సమిష్టిగా మా ను ముందుకు తీసుకెళ్లండి. మీ వెంట మేము ఉంటాము. అర్హులైన కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంక్షేమ కార్యక్రమాలు అందేలా చూస్తాం. సినిమాను థియేటర్లలలో చూడాలి” అంటూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తన స్పీచ్ ను పూర్తి చేశారు.