అప్పుడప్పుడూ సినిమా షూటింగుల నుంచి రిలీఫ్ కోసం.. ఫారిన్ వెళ్తుంటారు రామ్ చరణ్. ఇక ఇప్పుడు కూడా ఓ ఫారిన్ ట్రిప్ వేయబోతున్నారు. ప్రస్తుతం శంకర్ సినిమాతో బిజీగా ఉన్న చరణ్.. సడెన్గా వెకేషన్కు వెళ్లడానికి ఓ బలమైన కారణమే ఉంది. తన వైవాహిక జీవితంలో.. చరణ్కు ఈ ఏడాది ఎంతో స్పెషల్గా నిలవనుంది. అందుకే విదేశాల్లో సెలబ్రేషన్స్ చేసుకోబోతున్నారు. ఇంతకీ చరణ్ ఎక్కడికి వెళ్తున్నాడు.. ఎందుకోసం వెళ్తున్నాడు..!
ట్రిపుల్ ఆర్ సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా.. కెరీర్లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు చరణ్. ఈ విషయంలో మెగా ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అయితే ఆచార్య ఫ్లాప్ అవడంతో.. కాస్త డీలా పడిపోయారు. అందుకే అప్ కమింగ్ ప్రాజెక్ట్ పై భారీ ఆశలే పెట్టుకున్నారు.. ఆ సినిమాను శంకర్ తెరకెక్కిస్తుండడంతో.. అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్తో బిజీగా ఉన్నాడు చరణ్. ఇక ఈ సినిమా తర్వాత గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. ఇదిలా ఉంటే.. చరణ్ ఇప్పుడు ఓ ఫారిన్ ట్రిప్ ప్లాన్ చేశాడు. ఈ నెల 14న రామ్చరణ్ పెళ్లి రోజు కావడంతో.. విదేశాలకు పయనమయ్యారు చరణ్, ఉపాసన జోడి. 2012 జూన్ 14న వీరి పెళ్లి అతిరథ మహారథుల మధ్య ఘనంగా జరిగింది. ఈ ఏడాదితో వీరి పెళ్లి జరిగి పదేళ్లు కానున్నాయి. దాంతో తమ తమ ప్రొఫెషన్స్ లో బిజీగా ఉండే ఈ సెలెబ్రిటీ కపుల్.. టెన్త్ వెడ్డింగ్ యానివర్సరీని.. ఎప్పటికీ గుర్తుండిపోయేలా.. ప్రత్యేకంగా జరుపుకోవాలని భావిస్తున్నారట. అందుకే ఈ సారి మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ ను ఇటలీలోని మిలాన్లో జరుపుకోబోతున్నట్లు సమాచారం. అక్కడ నాలుగైదు రోజులు వెకేషన్ ఎంజాయ్ చేసేలా ప్లాన్ చేసుకున్నట్లు తెలిసింది. ఇకపోతే..పెళ్ళైన తర్వాత నటుడుగా రామ్ చరణ్.. బిజినెస్ ఉమన్గా ఉపాసన ఫుల్ బిజీగా ఉన్నారు.
