Telugu indian idol: గ్రాండ్ ఫినాలే అలా ముగిసింది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వేలాది మంది ఔత్సాహిక గాయనీ గాయకులు, ప్రధాన నగరాల్లో జరిగిన వడపోత, ముగ్గురు న్యాయ నిర్ణేతలు, పదిహేను వారాల పాటు జరిగిన ప్రదర్శన… చివరగా విజేతకు మెగా స్టార్ చిరంజీవి చేతుల మీదుగా ట్రోఫీ! ఇదీ తెలుగు ఇండియన్ ఐడల్ కార్యక్రమం జరిగిన విధానం. ఫిబ్రవరి మూడోవారంలో ఆహాలో మొదలైన తెలుగు ఇండియన్ ఐడల్ కాంటెస్ట్ జూన్ 17వ తేదీతో ముగిసింది. ఈ షో సెమీ ఫైనల్స్ కు నందమూరి బాలకృష్ణ గెస్ట్ గా హాజరు కాగా, మెగా ఫినాలేకు చిరంజీవి వచ్చారు. దాంతో ఈ షోలో ఆయన పాటలకే ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. షో ప్రారంభంలో చిరంజీవి గెటప్ లోనే కంటెస్టెంట్స్ వచ్చి ఆయన సినిమా పాటలు పాడారు. దాంతో చివరి రోజు పార్టిసిపేట్ చేసిన ఐదుగురు సింగర్స్ కు చిరంజీవి చిరు బహుమతులు ఇచ్చారు. ఈ షోలో తన ప్రేమ విషయాన్ని బహిర్గతం చేసిన శ్రీనివాస్ ధరిమిశెట్టితో పాటు అతని కాబోయే భార్య స్నేహనూ వేదిక మీదకు పిలిచి చిరంజీవి పట్టుబట్టలు అందించారు. ఆ తర్వాత ప్రణతికి పెన్ బహుమతిగా ఇచ్చి తొలి ఆటోగ్రాఫ్ తానే తీసుకున్నారు. గాయని గానే కాదు నటిగానూ అవకాశాలు అందుకుంటున్న వాగ్దేవికి అద్దాన్ని ప్రెజెంట్ చేశారు. జయంత్ కు బ్లాక్ గాగుల్స్ ఇచ్చి రజనీకాంత్ స్టైల్ లో దానిని పెట్టుకోమని ఎంకరేజ్ చేశారు. వైష్ణవికి వాచ్ ఇవ్వడంతో పాటు ‘గాడ్ ఫాదర్’ మూవీలో పాట పాడే ఛాన్స్ ఇచ్చారు. అలానే చిరంజీవి సినిమాకు పాట పాడాలని ఉందన్న శ్రీరామ్ చంద్ర కోరికను తీర్చుతూ ‘గాడ్ ఫాదర్’లోనే పాట పాడిస్తానని హామీ ఇచ్చారు. ఈ చివరి షోలో జడ్జెస్ అయిన నిత్యామీనన్, కార్తీక్, తమన్ సైతం తమ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు.
Also Read
- PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన 'పెద్ది'
- Mega Hero : 100 కథలు రిజెక్ట్ చేసి ఎట్టకేలకు కొత్త సినిమాను లైన్ లో పెట్టిన యంగ్ హీరో
- PEDDI Day -1collections : పెద్ది డే -1 కలెక్షన్స్.. రామ్ చరణ్ కెరీర్ హయ్యెస్ట్
- Sanjosh Foundation: చిన్న హీరో, పెద్ద సహాయం.. 118 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, మరెన్నో సేవా కార్యక్రమాలు!

విజేతలకు భారీ ప్రైజ్ మనీ!
తెలుగు ఇండియన్ ఐడల్ లో మొదటి మూడు స్థానాల్లో శ్రీనివాస్ ధరిమిశెట్టి, వైష్ణవి, వాగ్దేవి నిలిచారు. వీరిలో విజేత పేరును మెగాస్టార్ చిరంజీవి ప్రకటించారు. వాగ్దేవి తెలుగు ఇండియన్ ఐడల్ మొదటి విజేతగా నిలిచింది. ఆమెకు ఆహా సంస్థ బిగ్ ట్రోఫీతో పాటు పది లక్షల రూపాయల ప్రైజ్ మనీని అందించింది. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన చందనా బ్రదర్స్ మూడు లక్షలు, తెనాలి డబుల్ హార్స్ సంస్థ మూడు లక్షల ప్రైజ్ మనీని అందించింది. ఫస్ట్ రన్నరప్ శ్రీనివాస్ ధరిమిశెట్టికి ఆహా రూ. మూడు లక్షల ప్రైజ్ మనీని, చందనబ్రదర్స్ రెండు లక్షల రూపాయల చెక్ ను అందించింది. సెకండ్ రన్నరప్ వైష్ణవికి ఆహా సంస్థ రెండు లక్షల ప్రైజ్ మనీ ఇవ్వగా, చందన బ్రదర్స్ రూ. లక్షరూపాయల బహుమతిని అందించింది. ఆహా తొలిసారి ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన తెలుగు ఇండియన్ ఐడల్ మెగా ఫినాలేకు అల్లు అరవింద్ కూడా హాజరయ్యారు. విజేతకు తమ గీతా ఆర్ట్స్ సంస్థ ద్వారా తొలి అవకాశం ఇవ్వాలని అనుకున్నామని, అందుకే వాగ్దేవితో అగ్రిమెంట్ చేసుకుంటున్నామని చెప్పి, ఆ కాగితాలను ఆమె చేతికి అరవింద్ అందించారు. న్యాయనిర్ణేతలతో పాటు ప్రేక్షకుల ఓట్ల ఆధారంగా తెలుగు ఇండియన్ ఐడల్ ను ఎంపిక చేసినట్టు నిర్వాహకులు తెలిపారు. తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ వన్ సూపర్ డూపర్ హిట్ కావడంతో ఇప్పుడీ షో సెకండ్ సీజన్ కోసం ఇప్పటి నుండే వీక్షకులు ఎదురుచూస్తున్నారు.
తాజావార్తలు
-
Marriage Dispute: నాకు 41 ఏళ్లు సర్.. అయినా మా ఇంట్లో పెళ్లి చేయడం లేదు.. పోలీసులను ఆశ్రయించిన మహిళ
-
KL Rahul: కేఎల్ రాహుల్కు ఊహించని షాక్!
-
PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన ‘పెద్ది’
-
East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్పై బయటకు వచ్చి!
-
Praggnanandhaa: వరల్డ్ ఛాంపియన్కు చెక్ మెట్.. హ్యాట్రిక్ విజయంతో నార్వే చెస్ టైటిల్ రేసులో దూసుకపోతున్న ప్రజ్ఞానంద.!
ట్రెండింగ్
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..