Telugu indian idol: గ్రాండ్ ఫినాలే అలా ముగిసింది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వేలాది మంది ఔత్సాహిక గాయనీ గాయకులు, ప్రధాన నగరాల్లో జరిగిన వడపోత, ముగ్గురు న్యాయ నిర్ణేతలు, పదిహేను వారాల పాటు జరిగిన ప్రదర్శన… చివరగా విజేతకు మెగా స్టార్ చిరంజీవి చేతుల మీదుగా ట్రోఫీ! ఇదీ తెలుగు ఇండియన్ ఐడల్ కార్యక్రమం జరిగిన విధానం. ఫిబ్రవరి మూడోవారంలో ఆహాలో మొదలైన తెలుగు ఇండియన్ ఐడల్ కాంటెస్ట్ జూన్ 17వ తేదీతో ముగిసింది. ఈ షో సెమీ ఫైనల్స్ కు నందమూరి బాలకృష్ణ గెస్ట్ గా హాజరు కాగా, మెగా ఫినాలేకు చిరంజీవి వచ్చారు. దాంతో ఈ షోలో ఆయన పాటలకే ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. షో ప్రారంభంలో చిరంజీవి గెటప్ లోనే కంటెస్టెంట్స్ వచ్చి ఆయన సినిమా పాటలు పాడారు. దాంతో చివరి రోజు పార్టిసిపేట్ చేసిన ఐదుగురు సింగర్స్ కు చిరంజీవి చిరు బహుమతులు ఇచ్చారు. ఈ షోలో తన ప్రేమ విషయాన్ని బహిర్గతం చేసిన శ్రీనివాస్ ధరిమిశెట్టితో పాటు అతని కాబోయే భార్య స్నేహనూ వేదిక మీదకు పిలిచి చిరంజీవి పట్టుబట్టలు అందించారు. ఆ తర్వాత ప్రణతికి పెన్ బహుమతిగా ఇచ్చి తొలి ఆటోగ్రాఫ్ తానే తీసుకున్నారు. గాయని గానే కాదు నటిగానూ అవకాశాలు అందుకుంటున్న వాగ్దేవికి అద్దాన్ని ప్రెజెంట్ చేశారు. జయంత్ కు బ్లాక్ గాగుల్స్ ఇచ్చి రజనీకాంత్ స్టైల్ లో దానిని పెట్టుకోమని ఎంకరేజ్ చేశారు. వైష్ణవికి వాచ్ ఇవ్వడంతో పాటు ‘గాడ్ ఫాదర్’ మూవీలో పాట పాడే ఛాన్స్ ఇచ్చారు. అలానే చిరంజీవి సినిమాకు పాట పాడాలని ఉందన్న శ్రీరామ్ చంద్ర కోరికను తీర్చుతూ ‘గాడ్ ఫాదర్’లోనే పాట పాడిస్తానని హామీ ఇచ్చారు. ఈ చివరి షోలో జడ్జెస్ అయిన నిత్యామీనన్, కార్తీక్, తమన్ సైతం తమ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు.
Also Read
- Jackky Bhagnani: హీరోయిన్ రకుల్తో పెళ్లై ఏడాది కూడా కాకముందే డేటింగ్ యాప్లో జాకీ భగ్నానీ? వైరల్ అవుతున్న లీక్స్!
- Anantha Sriram: ‘కల్కి’ డైరెక్టర్ నాగ్ అశ్విన్ టార్గెట్గా అనంత శ్రీరామ్ కామెంట్స్? కర్ణుడు - అర్జునుడి పాత్రలను అలా చూపిస్తారా!
- Irumudi Kattu: సోషల్ మీడియాను షేక్ చేయడానికి రెడీ అయిన రవితేజ.. ‘ఇరుముడి కట్టు’ రిలీజ్ టైం ఫిక్స్!
- Dil Raju: 'సినిమాల్లో ఫెయిలైతే మళ్లీ అక్కడికే వెళ్లిపోయే వాడిని..': ప్రొడ్యూసర్ దిల్ రాజు

విజేతలకు భారీ ప్రైజ్ మనీ!
తెలుగు ఇండియన్ ఐడల్ లో మొదటి మూడు స్థానాల్లో శ్రీనివాస్ ధరిమిశెట్టి, వైష్ణవి, వాగ్దేవి నిలిచారు. వీరిలో విజేత పేరును మెగాస్టార్ చిరంజీవి ప్రకటించారు. వాగ్దేవి తెలుగు ఇండియన్ ఐడల్ మొదటి విజేతగా నిలిచింది. ఆమెకు ఆహా సంస్థ బిగ్ ట్రోఫీతో పాటు పది లక్షల రూపాయల ప్రైజ్ మనీని అందించింది. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన చందనా బ్రదర్స్ మూడు లక్షలు, తెనాలి డబుల్ హార్స్ సంస్థ మూడు లక్షల ప్రైజ్ మనీని అందించింది. ఫస్ట్ రన్నరప్ శ్రీనివాస్ ధరిమిశెట్టికి ఆహా రూ. మూడు లక్షల ప్రైజ్ మనీని, చందనబ్రదర్స్ రెండు లక్షల రూపాయల చెక్ ను అందించింది. సెకండ్ రన్నరప్ వైష్ణవికి ఆహా సంస్థ రెండు లక్షల ప్రైజ్ మనీ ఇవ్వగా, చందన బ్రదర్స్ రూ. లక్షరూపాయల బహుమతిని అందించింది. ఆహా తొలిసారి ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన తెలుగు ఇండియన్ ఐడల్ మెగా ఫినాలేకు అల్లు అరవింద్ కూడా హాజరయ్యారు. విజేతకు తమ గీతా ఆర్ట్స్ సంస్థ ద్వారా తొలి అవకాశం ఇవ్వాలని అనుకున్నామని, అందుకే వాగ్దేవితో అగ్రిమెంట్ చేసుకుంటున్నామని చెప్పి, ఆ కాగితాలను ఆమె చేతికి అరవింద్ అందించారు. న్యాయనిర్ణేతలతో పాటు ప్రేక్షకుల ఓట్ల ఆధారంగా తెలుగు ఇండియన్ ఐడల్ ను ఎంపిక చేసినట్టు నిర్వాహకులు తెలిపారు. తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ వన్ సూపర్ డూపర్ హిట్ కావడంతో ఇప్పుడీ షో సెకండ్ సీజన్ కోసం ఇప్పటి నుండే వీక్షకులు ఎదురుచూస్తున్నారు.
తాజావార్తలు
-
Astrology: సమస్యలు వచ్చినా భయపడని 4 రాశులు వీరేనా? ఎంత కష్టమైనా ధైర్యంగా ఎదుర్కొంటారట!
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!