Active Producers Guild : ఆ థియేటర్లకు మా సినిమాలు ఇచ్చే ప్రసక్తే లేదు !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు చిత్ర పరిశ్రమలో థియేటర్ల రెంట్/పర్సెంటేజ్ విషయంలో మరోసారి వివాదం రాజుకుంది. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇటీవల ప్రతిపాదించిన ‘పర్సంటేజ్ బేస్డ్ స్క్రీనింగ్’ విధానాన్ని తాము అంగీకరించే ప్రసక్తే లేదని ప్రముఖ నిర్మాతల మండలి అయిన ‘యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్’ తెగేసి చెప్పింది. ఈ మేరకు గిల్డ్ సభ్యులు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష, కార్యదర్శులకు ఒక బహిరంగ లేఖను విడుదల చేశారు. మార్చి 25, ఏప్రిల్ 2వ తేదీల్లో TFCC జారీ చేసిన సర్క్యులర్లపై నిర్మాతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పర్సంటేజ్ పద్ధతిని అమలు చేయాలన్న నిర్ణయం ఏకపక్షంగా తీసుకున్నదని, ఇందులో నిర్మాతల అభిప్రాయాలకు తావులేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతానికి అమల్లో ఉన్న పాత విధానాన్నే కొనసాగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Also Read :Varanasi: వారణాసి కథ ఇదేనా? గూస్బమ్స్ గ్యారెంటీ..
Also Read
- Ashwath Marimuthu: అనిల్ రావిపూడి స్పీడ్కి పోటీగా రజినీకాంత్ డైరెక్టర్.. 5 నెలల్లో సినిమా పూర్తి!
- Keerthy Suresh: నాని కోసం 13 ఏళ్ల తర్వాత స్పెషల్ సాంగ్.. ఐటం సాంగ్ కాదంటున్న కీర్తి సురేష్!
- Theatrical Releases: సెప్టెంబర్ లో సౌత్ సినిమాల జోరు… లవ్ స్టోరీల నుండి యాక్షన్ థ్రిల్లర్ల వరకు
- Spy Action Thriller: థియేటర్లలో పట్టించుకోలేదు.. ఓటీటీలో నంబర్ 1 ట్రెండింగ్ లో స్పై యాక్షన్ థ్రిల్లర్
నిర్మాతల ప్రధాన డిమాండ్లు:
ప్రస్తుతం ఏ పద్ధతిలో అయితే సినిమాలు థియేటర్లలో ప్రదర్శితమవుతున్నాయో, దానికే తాము కట్టుబడి ఉన్నామని నిర్మాతలు స్పష్టం చేశారు. ఎగ్జిబిటర్లతో చర్చలు జరిపి, తమకు అనుకూలమైన నిబంధనలతోనే సినిమాలను విడుదల చేస్తామని, ఛాంబర్ రుద్దే నిర్ణయాలను పాటించబోమని పేర్కొన్నారు. TFCC నిర్ణయించిన కొత్త మోడల్లో నడిచే థియేటర్లకు తమ సినిమాలను ఇచ్చే ప్రసక్తే లేదని నిర్మాతలు తేల్చి చెప్పారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గిల్డ్లోని దాదాపు అందరి అగ్ర నిర్మాతలు సంతకాలు చేశారు. వారిలో రవిశంకర్ యలమంచిలి (మైత్రీ మూవీ మేకర్స్), సుధాకర్ చెరుకూరి (SLV సినిమాస్), టి.జి. విశ్వప్రసాద్ (పీపుల్ మీడియా ఫ్యాక్టరీ), నాగవంశీ (సితార ఎంటర్టైన్మెంట్స్), సుప్రియ యార్లగడ్డ (అన్నపూర్ణ స్టూడియోస్), నాని ఘంటా (వాల్ పోస్టర్ సినిమా), బన్నీ వాసు, ఎస్.కె.ఎన్, ధీరజ్ మొగిలినేని వంటి మరికొందరు ఉన్నారు. పర్సంటేజ్ విధానంపై నిర్మాతలు కఠినంగా వ్యవహరిస్తుండటంతో, ఛాంబర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటుందా లేదా అనేది వేచి చూడాలి.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!