మరోసారి చిరు సరసన తమన్నా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
“సైరా” తర్వాత మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలను చేస్తున్నారు. కరోనా మహమ్మారి ఎఫెక్ట్ థియేటర్లు, సినిమా షూటింగ్లపై పడకుండా ఉంటే ఇప్పటి వరకు కనీసం రెండు మెగాస్టార్ చిత్రాలు విడుదల అయ్యేవి. చిరు ప్రస్తుతం కొరటాల శివతో “ఆచార్య”, మోహన్ రాజాతో “గాడ్ ఫాదర్”, మెహర్ రమేష్ “భోళా శంకర్”, ఇంకా బాబీ దర్శకత్వంలో ఓ సినిమాతో సహా దాదాపు నాలుగు సినిమాల్లో నటిస్తున్నారు.
Read Also : నెక్స్ట్ మూవీకి రష్మిక గ్రీన్ సిగ్నల్
Also Read
అయితే ఇక్కడ మెగాస్టార్ వరుస సినిమాలు చేయడం విషయం కాదు. ఆ సినిమాల్లో హీరోయిన్స్ని ఎంపిక చేయడం అసలైన పని. పూజా హెగ్డే, రష్మిక మందన్న వంటి వారు ఫుల్ బిజీ. కాబట్టి వాళ్ళు డేట్స్ ఇవ్వలేరు. సీనియర్ స్టార్ హీరోయిన్లు తమన్నా, కాజల్, త్రిష వంటి హీరోయిన్ల చేతిలో పెద్దగా సినిమాలు లేవు. కాబట్టి వాళ్ళు చిరు సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. “వేదాళం” రీమేక్ “భోళా శంకర్”లో చిరంజీవి సరసన శృతి హాసన్లో నటిస్తోందని అన్నారు. ఒరిజినల్లో శృతి అజిత్తో రొమాన్స్ చేసింది. చిరుతో కూడా ఆమెనే అనుకున్నారు. కానీ వివిధ కారణాల వల్ల మెగాస్టార్ ఇప్పుడు శృతి ప్లేస్ లో మిల్కీ బ్యూటీ తమన్నాను ఎంచుకున్నారు. గతంలో ఆమె “సైరా”లో చిరంజీవితో జతకట్టింది. కానీ అందులో చిరుతో తమన్నా చిందేయలేదు. అయితే ఇప్పుడు “భోళా శంకర్” మాస్ మూవీ కాబట్టి బెస్ట్ డ్యాన్స్ ట్రీట్లను చూడవచ్చని మెగా ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
తమన్నా హీరోయిన్గా నటిస్తుందనే విషయంపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది. వచ్చే నెలలో ఈ చిత్రం అధికారికంగా ప్రారంభమవుతుంది. ఎకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాకు మహతి సాగర్ సంగీత దర్శకుడు. మరోవైపు చిరంజీవి ‘ఆచార్య’ చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం ఆయన ఊటీలో “గాడ్ ఫాదర్” షూటింగ్ చేస్తున్నాడు. వచ్చే ఏడాది చిరంజీవికి మూడు సినిమాల రిలీజ్లు ఉంటాయి.
తాజావార్తలు
-
Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
-
CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్నాథ్, యోగితో కలిసి..
-
Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్పోన్..!
-
Prabhas-Spirit: మరింత డార్క్ అండ్ బోల్డ్.. యానిమల్కు మించి స్పిరిట్.. థియేటర్లు తగలబడిపోవడం ఖాయం!
-
Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!