గుడ్ సినిమా గ్రూప్ నిర్మాణంలో క్రేజీ ప్రాజెక్టుగా రూపుదిద్దుకున్న చిత్రం క్రేజీ అంకుల్స్. బుల్లితెర బ్యూటీ యాంకర్ శ్రీముఖి ప్రధాన పాత్రలో ఇ. సత్తి బాబు దర్శకత్వంలో ‘క్రేజీ అంకుల్స్’ తెరకెక్కింది. ఈ నెల 19న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు యూనిట్ తెలిపింది. సింగర్ మనో, నటులు రాజా రవీంద్ర, భరణి ప్రధాన పాత్రధారులుగా బండ్ల గణేష్, ప్రవీణ్, పోసాని కృష్ణమురళి, గిరి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కామెడీ జానర్లో తెరకెక్కిన ఈ సినిమా టైటిల్ లిరికల్ సాంగ్ని ఇంతకు ముందు దర్శకుడు అనిల్ రావిపూడి విడుదల చేశారు. రఘు కుంచే సంగీతం అందించగా లిప్సిక గానం చేసిన ఈ పాటను కాసర్ల శ్యామ్ రాశారు. ఈ పాట అందరినీ ఆకట్టుకుంది. ఈ పాట ఇప్పటికే 50 లక్షల వ్యూస్ తో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.ఈ సినిమాను మేలో విడుదల చేద్దాం అనుకున్నప్పటికీ కరోనా సెకండ్ వేవ్ వల్ల ఈ నెల 19న విడుదల చేయాలనే నిర్ణయం తీసుకున్నాం అని నిర్మాత శ్రేయాస్ శ్రీను చెప్పారు.