ఢిల్లీ సీఎంతో సోనూసూద్ భేటీ… కీలక నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఈ రోజు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ని కలిశారు. అనంతరం ఇద్దరూ కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ “నేడు సోనూసూద్ దేశం మొత్తానికి స్ఫూర్తిదాయకంగా మారారు. సహాయం కోసం తన ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికీ సోను సూద్ సహాయం చేస్తాడు. నేడు పాలన సాగిస్తున్న ప్రభుత్వాలు ఏమీ చేయలేకపోతున్నాయి. అలాంటిది సోను సూద్ సాయం చేస్తున్నారు. మేము ఢిల్లీ ప్రభుత్వం చేపట్టబోయే ఓ మంచి పని కోసం సోనూ సూద్తో మాట్లాడాము” అని అన్నారు. దీంతో పంజాబ్ ఎన్నికల్లో సోనూసూద్ ప్రచారానికి సంబంధించిన అన్ని ఊహాగానాలకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ ముగింపు పలికారు. కేజ్రీవాల్ ఢిల్లీలో ‘దేశ్ కే మెంటర్’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నామని చెప్పారు. సోనూ సూద్ “దేశ కే మెంటర్” కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉంటారు.
Read Also : మిడ్ నైట్ సర్ప్రైజ్… “సీటిమార్” అంటున్న దర్శకుడు
Also Read
- Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
- Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
- Krrish 4 : 'క్రిష్ 4' ఆలస్యానికి కారణం అదే?
- LGBT - A Legal Battle: 'ఎల్జీబీటీ'ల ఆక్రందనలపై సినిమా.. జూన్ 19న విడుదల!
సోను సూద్ మాట్లాడుతూ లాక్డౌన్ సమయంలో చాలా మంది వ్యక్తులతో కనెక్ట్ అయినప్పుడు మన దగ్గర విద్య ఒక పెద్ద సమస్య అని తెలిసింది. ఈ మధ్య తలెత్తుతున్న మరో పెద్ద ప్రశ్న ఏమిటంటే ఎంతోకొంత తరువుకున్న తరువాత పిల్లలకు ఏమి చేయాలో తెలియదు. కుటుంబంలో వారికి చెప్పడానికి ఎవరూ లేరు. పిల్లలకు విద్యను అందించడం ముఖ్యమే కానీ వారికి సరైన దిశానిర్దేశం చేసేవారు కూడా ఉండాలి. కాబట్టి ఈ కార్యక్రమం పిల్లలకు మార్గనిర్దేశం చేసే ప్రయత్నం అవుతుంది. పిల్లలకు గురువుగా మార్గనిర్దేశనం చేయడానికి బాగా చదువుకున్న వారు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ రోజు ఢిల్లీ ప్రభుత్వం దేశం కోసం ఏదో ఒకటి చేయడానికి ఈ వేదికను సృష్టించింది. మీరు ముందుకు వచ్చి కొంతమంది పిల్లలను ఎన్నుకోండి. మీరు మార్గనిర్దేశం చేసి దేశానికి మంచి భవిష్యత్తును అందించవచ్చు. అంతేకాకుండా వలస కార్మికులు, వాళ్ళ సమస్యలు, ఉద్యోగాలు వంటి విషయాలను, నిరుద్యోగుల కోసం ఆయన క్రియేట్ చేసిన “ప్రవాసీ రోజాగర్” యాప్ పని విధానాన్ని కూడా సీఎం కేజ్రీవాల్ కు వివరించారట సోను.
ఇక తన రాజకీయ ఎంట్రీ గురించి వస్తున్న వార్తలపై సోనూ మాట్లాడుతూ మంచి పని చేస్తున్నారు కాబట్టి రాజకీయాల్లోకి రండి అని ప్రజలు కోరుతున్నారని, కానీ ఏదైనా మంచి పనికి చేయడానికి రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదని అన్నారు. నాకు ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. కానీ నేను దాని గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. రాజకీయాల గురించి సిఎం అరవింద్ కేజ్రీవాల్తో మాట్లాడలేదు. పంజాబ్లో ప్రచారం గురించి కూడా తాను ఏమీ ఆలోచించలేదని చెప్పాడు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!