Site icon NTV Telugu

Son Of India: ఈ సొసైటీలో చెత్తనాకొడుకులను ఏరిపారేస్తా అంటున్న మోహన్ బాబు

son of india

son of india

కలెక్షన్‌ కింగ్‌, డా. మంచు మోహన్‌బాబు హీరోగా డైమండ్‌ రత్నబాబు దర్శకత్వంలో విష్ణు మంచు నిర్మించిన చిత్రం ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’. చిత్ర కథానాయకుడు మోహన్‌బాబు అదనంగా దీనికి స్క్రీన్‌ప్లే బాధ్యతను కూడా నిర్వహించారు. ఫిబ్రవరి 18న సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న నేపధ్యంలో గురువారం సాయంత్రం థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేశారు. 1.33 నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్ లో మోహన్ బాబు తనదైన శైలిలో సంభాషణలు చెప్పి మెప్పించారు. దర్శకుడు డైమండ్ రత్నబాబు బేసికల్ గా మంచి రైటర్ కావడంతో మోహన్ బాబు నోట తూటల్లాంటి డైలాగ్స్ పలికించారు.

”ప్రపంచంలో ఏ పోరాటమైనా ఒక్కడితోనే ప్రారంభమవుతుంది. ప్రపంచమంతా నా కుటుంబం. ప్రపంచం బాధే నా బాధ. స్వామి… ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే… నేను దాన్నే ఫాలో అవుతున్నా… డబ్బున్నోడికి ఓ న్యాయం… డబ్బులేనోడికి ఓ న్యాయం… పవర్ ఉన్నోడికి ఓ న్యాయం… పవర్ లేనోడికి ఓ న్యాయం… డెమోక్రసీలో లా ఒకొక్కడికి ఒక్కోలా ఉంటే ఎలా… అయ్యోధ్యలో శ్రీరామ అని రాసిన ప్రతి ఇటుక మీద ప్రమాణం చేసి చెబుతున్నాను… ఈ సొసైటీలో చెత్త నా కొడుకులని, క్రిమినల్ నా కొడుకులని ఏరిపారేయాలి… నీ ప్రశ్నలన్నింటికి సమాధానం నీతో పాటు 135 కోట్ల ఇండియన్స్ కి చాలా డిటైయిల్డ్ గా చెబుతాను…” అంటూ మోహన్ బాబు పలు సందర్భాలలో పలికి సంభాషణలతో ఈ ట్రైలర్ సాగింది. మోహన్‌ బాబు మార్కు డైలాగులు, యాక్షన్‌ ఎపిసోడ్స్‌, ఊహించని మలుపులతో అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఈ సినిమా ఉండబోతోందని ట్రైలర్ ని చూస్తే అర్ధమవుతోంది. ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్, శ్రీకాంత్, తనికెళ్ల భరణి, అలీ, వెన్నెల కిషోర్, ఫృథ్వీ రాజ్, రఘుబాబు, రాజా రవీంద్ర, రవిప్రకాష్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఇళయరాజా సంగీతం సమకూర్చారు.

Exit mobile version