8 రోజుల డబ్బింగ్ 5 రోజుల్లో పూర్తి చేసిన ఎస్. జె. సూర్య!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ హీరో శింబు తాజా చిత్రం ‘మానాడు’. కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా ఈ చిత్రాన్ని వెంకట్ ప్రభు తెరకెక్కించాడు. ఈ పొలిటికల్ డ్రామాను తెలుగులో ‘ది లూప్’ పేరుతో డబ్ చేస్తున్నారు. ఐదు భాషల్లో ఈ సినిమాను నవంబర్ 25న వరల్డ్ వైడ్ రిలీజ్ చేయబోతున్నారు. ఇటీవలే ఈ సినిమా డబ్బింగ్ ను విలన్ పాత్రధారి ఎస్.జె. సూర్య పూర్తి చేశాడు. ఎనిమిది రోజుల్లో డబ్బింగ్ పూర్తి చేయాలని అనుకున్నామని, కానీ ఐదు రోజుల్లోనే కంప్లీట్ చేశానని ఎస్.జె. సూర్య తెలిపాడు. ఎనిమిది రోజుల పనిని ఐదు రోజులలో చేయడంతో ఒళ్ళు హోనం అయిపోయింది. నాడి, నరాలు, మెడ, వెన్నుపూస, గొంతు… అన్నీ పోయాయి. కనీసం పదిరోజులైనా విశ్రాంతి తీసుకోవాల్సిందే’ అని ఎస్.జె. సూర్య ట్వీట్ చేశాడు. అయితే, డబ్బింగ్ అయిన తర్వాత చూస్తే అవుట్ పుట్ ఎంతో సంతృప్తికరంగా అనిపించిందని, నవంబర్ 25న తాము విజయం సాధించబోతున్నామని ఎస్. జె. సూర్య తెలిపాడు.
నిజానికి ఈ సినిమాను నవంబర్ 4న దీపావళి కానుకగా విడుదల చేయాలని అనుకున్నారు. కానీ అదే రోజు రజనీకాంత్ ‘అన్నాత్తే’ సినిమా ఉండటంతో శింబు చిత్ర నిర్మాతలు 25వ తేదీకి విడుదలను వాయిదా వేసుకున్నారు. ఈ సినిమాలో భారతీరాజా, ఎస్.ఎ. చంద్రశేఖర్, కరుణాకరన్, ప్రేమ్ జీ అమరన్ ఇతర సహాయ పాత్రలను పోషించారు.
Also Read
- PM Modi: పవన్ ఇంటికి ప్రధాని మోడీ.. సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్ వైరల్! ఫోటో చూశారా..
- Money Heist: 'మనీ హెయిస్ట్' ఫ్యాన్స్కు నెట్ఫ్లిక్స్ సర్ప్రైజ్.. ప్రొఫెసర్ ప్రయాణం ఇంకా ముగియలేదు!
- CM Vijay: తమిళనాడు సీఎంగా దళపతి విజయ్ .. 'జన నాయగన్' సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
- Peddi : బుకింగ్స్ ఓపెన్ చేసిన గ్లోబల్ స్టార్..అమెరికాలో ‘పెద్ది’ సందడి.. టికెట్ రేట్లు ఇవే!
తాజావార్తలు
-
Ragi Samosa: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. హెల్తీ ‘రాగి సమోసా’ను ‘సింపుల్గా ఇలా ట్రై చేయండి!
-
Tamil Politics: విజయ్పై మొదలైన డీఎంకే విమర్శలు.. ఏం జరిగిందంటే..?
-
RCB vs MI : RCB బౌలర్ల ధాటికి ముంబై తడబాటు.. భువనేశ్వర్ కుమార్ ‘నాలుగు’ వికెట్ల పంజా.!
-
PM Modi: పవన్ ఇంటికి ప్రధాని మోడీ.. సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్ వైరల్! ఫోటో చూశారా..
-
PM Modi: మే 15 లోపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగొచ్చా.. మోడీ వ్యాఖ్యల ఆంతర్యం ఏమిటి.?