తమిళ హీరో శింబు తాజా చిత్రం ‘మానాడు’. కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా ఈ చిత్రాన్ని వెంకట్ ప్రభు తెరకెక్కించాడు. ఈ పొలిటికల్ డ్రామాను తెలుగులో ‘ది లూప్’ పేరుతో డబ్ చేస్తున్నారు. ఐదు భాషల్లో ఈ సినిమాను నవంబర్ 25న వరల్డ్ వైడ్ రిలీజ్ చేయబోతున్నారు. ఇటీవలే ఈ సినిమా డబ్బింగ్ ను విలన్ పాత్రధారి ఎస్.జె. సూర్య పూర్తి చేశాడు. ఎనిమిది రోజుల్లో డబ్బింగ్ పూర్తి చేయాలని అనుకున్నామని, కానీ ఐదు రోజుల్లోనే కంప్లీట్ చేశానని ఎస్.జె. సూర్య తెలిపాడు. ఎనిమిది రోజుల పనిని ఐదు రోజులలో చేయడంతో ఒళ్ళు హోనం అయిపోయింది. నాడి, నరాలు, మెడ, వెన్నుపూస, గొంతు… అన్నీ పోయాయి. కనీసం పదిరోజులైనా విశ్రాంతి తీసుకోవాల్సిందే’ అని ఎస్.జె. సూర్య ట్వీట్ చేశాడు. అయితే, డబ్బింగ్ అయిన తర్వాత చూస్తే అవుట్ పుట్ ఎంతో సంతృప్తికరంగా అనిపించిందని, నవంబర్ 25న తాము విజయం సాధించబోతున్నామని ఎస్. జె. సూర్య తెలిపాడు.
నిజానికి ఈ సినిమాను నవంబర్ 4న దీపావళి కానుకగా విడుదల చేయాలని అనుకున్నారు. కానీ అదే రోజు రజనీకాంత్ ‘అన్నాత్తే’ సినిమా ఉండటంతో శింబు చిత్ర నిర్మాతలు 25వ తేదీకి విడుదలను వాయిదా వేసుకున్నారు. ఈ సినిమాలో భారతీరాజా, ఎస్.ఎ. చంద్రశేఖర్, కరుణాకరన్, ప్రేమ్ జీ అమరన్ ఇతర సహాయ పాత్రలను పోషించారు.