Sapta Sagaralu Dhaati: ‘సప్త సాగరాలు దాటి’ టెన్షన్ పెట్టింది కానీ.. రిలీజ్ కి స్పెషల్ ప్లాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sapta Sagaralu Dhaati Hero Rakshit Shetty Interview: కన్నడలో ఘన విజయం సాధించిన ‘సప్త సాగర దాచే ఎల్లో’ సినిమాను ‘సప్త సాగరాలు దాటి’ పేరుతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెలుగు ప్రేక్షకులకు అందిస్తోంది. ‘అతడే శ్రీమన్నారాయణ’, ‘777 చార్లీ’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరైన రక్షిత్ శెట్టి హీరోగా నటిస్తూ నిర్మించిన ఈ సినిమా ‘సప్త సాగర దాచే ఎల్లో’ కన్నడలో సూపర్ హిట్ అందుకుంది. హేమంత్ ఎం రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటించగా ‘సప్త సాగరాలు దాటి’ అనే టైటిల్ తో సెప్టెంబర్ 22న ఈ తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో తెలుగు విలేకర్లతో ముచ్చటించిన రక్షిత్ శెట్టి పలు కీలక విషయాలు పంచుకున్నారు. దర్శకుడు హేమంత్ తో ఇది నాకు రెండో సినిమా అని తన మొదటి సినిమా ‘గోధి బన్న సాధారణ మైకట్టు’లో కూడా నేను నటించానని అన్నారు. తన రెండో సినిమా కూడా నాతో చేయాలి అనుకున్నా కానీ అప్పుడు నేను ‘అతడే శ్రీమన్నారాయణ’తో బిజీగా ఉండటం వల్ల కుదరలేదని కానీ ఇప్పుడు మూడో సినిమాకి ఇలా కుదిరిందని అన్నారు.. దర్శకుడిగా హేమంత్ ది ఒక విభిన్న శైలి అని, అతని మొదటి రెండు సినిమాలకే కన్నడ పరిశ్రమకు మరో మంచి దర్శకుడు దొరికాడనిపించిందని అన్నారు. చిత్రీకరణకు ముందు ఈ సినిమాని ఎలా తెరకెక్కిస్తారా అనే ఆసక్తి ఉండేది కానీ ఆయన ఈ కథని పొయెటిక్ గా ఎంతో అందంగా రూపొందించారని అన్నారు.
Anasuya Bharadwaj: ‘రంగమ్మత్త’ను మర్చిపోతారంటున్న అనసూయ
Also Read
- Rukmini Vasanth : నివిన్ పౌలీ సినిమాతో మలయాళంలోకి రుక్మిణీ వసంత్ ఎంట్రీ
- Yash - Radhika Engagement: యష్ – రాధికా ఎంగేజ్మెంట్కు 10 ఏళ్లు… రాధికా స్వీట్ పోస్ట్ వైరల్!
- I Am Game: దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’కు బ్రేక్? ఆగస్టు 20 విడుదలపై కొనసాగుతున్న సస్పెన్స్
- Independence Day Special: 78 ఏళ్ల క్రితమే మార్మోగిన తొలి సినీ దేశభక్తి పాట.. ఇప్పటికీ ఎందుకు అంత ప్రత్యేకమో తెలుసా ?
మొదట రెండు భాగాలు అనే ఆలోచన లేదు అయితే షూటింగ్ సమయంలో ప్రధాన పాత్రలు మను-ప్రియ మధ్య కెమిస్ట్రీ చూసి హేమంత్ రెండు భాగాలుగా చెప్పాలి అనుకున్నారని అన్నారు. హేమంత్ బౌండెడ్ స్క్రిప్ట్ తో రెడీగా ఉంటారు, ఏం చేయాలో క్లారిటీ ఉంటుంది అయినప్పటికీ షూటింగ్ సమయంలో ఇంకా ఏమైనా మెరుగు పరచగలమా అని ఆలోచిస్తూనే ఉంటారని అన్నారు. అలా కొంత భాగం షూటింగ్ అయ్యాక రెండు భాగాలుగా విడుదల చేయాలని ఆయన భావించారని అన్నారు.. మొదట నాకు కాస్త ఆందోళన కలిగినప్పటికీ.. కథ మీద, ఆయన విజన్ మీద నమ్మకంతో అంగీకరించానని షూట్ అయ్యాక ఎడిటింగ్ టేబుల్ లో చూసుకున్నాక రెండు భాగాలుగా చెప్పాలనే ఆయన ఆలోచన సరైనది అనిపించిందని అన్నారు. మామూలుగా మొదటి భాగం, రెండవ భాగం ఎక్కువ వ్యవధితో విడుదల చేస్తున్నారు కానీ మేము ఏడు వారాల వ్యవధిలోనే విడుదల చేస్తున్నాం కాబట్టి ప్రేక్షకులు కథతో, పాత్రలతో తేలికగా పయనిస్తారని అన్నారు. ఇది 2010 సమయంలో జరిగే కథ కావడంతో క్యాసెట్లతో ముడిపడి ఉంటుందని, అప్పుడు మనకు పాటల క్యాసెట్లు ఉండేవని అన్నారు. వాటిలో సైడ్-A, సైడ్-B అని ఉంటాయి, సైడ్-A పూర్తయిన తర్వాత సైడ్-B ప్లే చేస్తాం ఆ ఉద్దేశంతో ఇలా సైడ్-A, సైడ్-B అని పెట్టడం జరిగిందని అన్నారు.
తాజావార్తలు
-
RajyaSabha: రాజ్యసభలో ‘‘లుంగీ వాలా’’ దుమారం..
-
Sai Krishna Death Case: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరో కీలక అరెస్ట్
-
Air India Flight: ఫుకెట్-ఢిల్లీ విమానంలో గందరగోళం.. 3 హైడ్రాలిక్ అలర్ట్స్, ఆటోపైలట్ డిస్కనెక్ట్
-
AP Panchayat Elections : ఏపీలో పంచాయతీ పోరుకు బిగ్ అప్డేట్.. పోలింగ్ కేంద్రాలపై SEC ఫోకస్
-
Trump: ‘మీరు ప్రమాదకర విమానంలో ఉన్నారు’.. జర్నలిస్టులకు ట్రంప్ హెచ్చరిక
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..