Rakesh Maria Biopic : తెరపైకి ముంబై ఎక్స్ పోలీస్ కమీషనర్ జీవితకథ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రోహిత్ శెట్టి & రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ కాంబో రిపీట్ కాబోతోంది. ముంబై ఎక్స్ పోలీస్ కమీషనర్ జీవితకథ ఆధారంగా సినిమాను రూపొందించబోతున్నట్టుగా ఈ కాంబో అధికారికంగా వెల్లడించింది. మాజీ కమీషనర్ ఆఫ్ పోలీస్ రాకేష్ మారియా తన కెరీర్లో సాధించిన సక్సెస్ ఆధారంగా ఈ బయోపిక్ రూపుదిద్దుకోనుంది. ప్రముఖ చిత్రనిర్మాత రోహిత్ శెట్టి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ సందర్భంగా రోహిత్ శెట్టి మాట్లాడుతూ “రాకేష్ మారియా… 36 ఏళ్లుగా ఆయన అద్భుతమైన ప్రయాణంలో 1993 ముంబైలో జరిగిన పేలుళ్ల నుండి, అండర్ వరల్డ్ ముప్పు, 2008లో 26/11 ముంబై ఉగ్రదాడుల వరకు ఎన్నో చూశారు. ఈ నిజ జీవిత సూపర్ కాప్ ధైర్య, నిర్భయ ప్రయాణాన్ని తెరపైకి తీసుకురావడం నిజంగా గౌరవంగా భావిస్తున్నాను!! ” అంటూ బయోపిక్ పై అధికారిక ప్రకటన చేశారు.
Read Also : Mega154 : టైటిల్ లీక్ చేసిన మెగాస్టార్
Also Read
- NANI : నాని ఫ్యాన్స్కు నిరాశ.. 'బ్లడీ రోమియో' వాయిదా.. 'OG 2'పై సుజీత్ ఫోకస్
- Jo Sharma: ఇలాంటి కాన్సెప్ట్ ప్రపంచంలోనే ఎక్కడా రాలేదు.. విలన్ ఎవరో చెబితే లక్ష ఇస్తాం!
- kannada Heros : హిట్ ఎఫెక్ట్.. భారీ రెమ్యునరేషన్స్ తీసుకుంటోన్న కన్నడ హీరోలు
- NBK 111 : రొమాంటిక్ సింహం.. బాలయ్యతో బాలీవుడ్ హీరోయిన్ ఐటం సాంగ్
IPS అధికారి అయిన రాకేష్ మారియా 1981 బ్యాచ్ నుండి సివిల్ సర్వీస్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. 1993లో డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్)గా ఉన్న ఆయన బాంబే వరుస పేలుళ్ల కేసును ఛేదించాడు. తరువాత ముంబై పోలీస్ DCP (క్రైమ్), ఆ తర్వాత జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ (క్రైమ్) అధికారిగా మారారు. 2003 గేట్వే ఆఫ్ ఇండియా, జవేరీ బజార్ జంట పేలుళ్ల కేసును మారియా సాల్వ్ చేశారు. 2008లో 26/11 ముంబై దాడులను పరిశోధించే బాధ్యతను కూడా మరియాకు అప్పగించారు. ఆయన సజీవంగా పట్టుబడిన ఏకైక ఉగ్రవాది అజ్మల్ కసబ్ను విచారించి, కేసును విజయవంతంగా పరిశోధించారు.
తాజావార్తలు
-
Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
-
TVK Vijay: విజయ్కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్లపై వామపక్షాలు గుర్రు!
-
CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
-
US-Iran Talks: హార్ముజ్పై గుడ్న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!
-
Ponnam Prabhakar : రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం.. భౌతిక దాడులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం