Ritika Naik : ఆమె నా స్ఫూర్తి.. మంచి యాక్షన్ కథల్లో నటించాలని ఉంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ చిత్రంతో తనదైన ముద్ర వేసుకున్న నటి రితికా నాయక్, తాజాగా ఫాంటసీ యాక్షన్ డ్రామా మిరాయ్ లో కీలక పాత్ర పోషించారు. హీరో తేజ సజ్జా, దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని కాంబినేషన్లో తెరకెక్కిన ఈ భారీ చిత్రం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టి.జి. విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సందర్భంగా రితికా నాయక్ మీడియాతో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
Also Read : Kantara-Chapter-1 : గ్లోబల్ రీచ్ కోసం సిద్ధమవుతున్న ‘కాంతార 1’.. వర్కౌట్ అవుతుందా?
Also Read
- Sanjosh Foundation: చిన్న హీరో, పెద్ద సహాయం.. 118 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, మరెన్నో సేవా కార్యక్రమాలు!
- JanaNayagan : విజయ్ 'జననాయగన్'.. బయ్యర్లకు వడ్డీతో సహా డబ్బులు వెనక్కి ఇస్తున్న కేవీఎన్ ప్రొడక్షన్స్!
- Buchi Babu : బుచ్చిబాబు.. మీ సినిమాలో హీరో అంటే ఏదో ఒక భాగం కోయాల్సిందేనా?
- Tollywood : ఆ మ్యూజిక్ డైరెక్టర్ ని చూసి ఇతర సంగీత దర్శకులు చాలా నేర్చుకోవాలి
‘‘సూపర్ హీరో సినిమాలు నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. మిరాయ్ నేను కూడా సూపర్ పవర్స్ ఉన్న యువతిగా కనిపిస్తాను. రెండున్నరేళ్ల పాటు కష్టపడి చేసిన ఈ సినిమా నా కెరీర్లో ప్రత్యేకమైన మలుపు అవుతుంది. అశోకవనంలో అర్జున కళ్యాణం తర్వాత మంచి కథ కోసం ఎదురు చూస్తున్నప్పుడు, కార్తీక్ ఘట్టమనేని వినిపించిన ఈ కథలోని ఫాంటసీ, ప్రేమ, యాక్షన్ అంశాలు నాకు బాగా నచ్చాయి. అందుకే వెంటనే అంగీకరించాను.‘ఇందులో నేను విభ అనే బలమైన సన్యాసిని పాత్రలో కనిపిస్తాను. హిమాలయాల్లో ఉండే ఈ పాత్ర ప్రయాణం ఏమిటన్నది తెరపైనే ఆసక్తికరంగా తెలుస్తుంది. నా నిజ జీవితానికి పూర్తిగా భిన్నమైన ఈ రోల్ చేయడం నాకు పెద్ద సవాల్. సాధారణంగా నేను చాలా మాట్లాడుతుంటాను కానీ విభ మాత్రం ప్రశాంతమైన శక్తివంతమైన పాత్ర. ఈ సినిమాలో ఎక్కువ భాగం సన్నివేశాలు నిజమైన మంచు పర్వతాలు, అడవుల్లో చిత్రీకరించాం. ఆ కఠిన పరిస్థితుల్లో షూటింగ్ చేయడం ఓ సాహసంలా అనిపించింది’’ అని వివరించారు.
తన భవిష్యత్తు గురించి రితికా మాట్లాడుతూ.. ‘‘ఫాంటసీ కథలు చేయడం నాకిష్టమే కానీ యాక్షన్, రొమాంటిక్ కథల్లోనూ నటించాలని ఉంది. ముఖ్యంగా యాక్షన్ సినిమాల్లో శక్తివంతమైన పాత్రలు చేయాలని కోరిక ఉంది. నేను అభిమానించే హీరోయిన్ సాయిపల్లవి. ఆమె కళ్లతోనే భావాలను వ్యక్తపరచే తీరు చూసి ఎంతో ముచ్చట పడ్డాను. ఫిదా సినిమా చూసిన తర్వాత ఆమెను స్ఫూర్తిగా తీసుకున్న. ప్రస్తుతం వరుణ్ తేజ్తో ఒక సినిమా చేస్తున్నా. అదనంగా డ్యూయెట్ తో పాటు మరికొన్ని ప్రాజెక్ట్ కూడా రెడీగా ఉన్నాయి.’ అని తెలిపింది. ప్రజంట్ సాయి పల్లవి గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi Record: వైభవ్ సూర్యవంశీకి గుడ్న్యూస్.. ఇక క్రికెట్ దిగ్గజం సచిన్ రికార్డు బద్దలే!
-
RBI MPC 2026: ఆర్బీఐ కీలక నిర్ణయం.. రెపో రేటు 5.25% వద్ద యథాతథం.. లక్షలాది మంది రుణగ్రహీతలకు ఊరట
-
Karnataka Politics: కర్ణాటక రాజకీయంలో హైడ్రామా.. కేబినెట్ కొలువుదీరిన కొద్దిరోజులకే మంత్రి రాజీనామా!
-
వరల్డ్ కప్ గెలిచినా అసలు ట్రోఫీ దక్కదట.! ‘FIFA World Cup’ గురించి తెలియని విషయాలు మీకోసం..
-
Ather Rizta Price Hike: పెరిగిన ఏథర్ రిజ్టా ధరలు.. ఏ వేరియంట్పై ఎంత ధర పెరిగిందో తెలుసా?
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..