Ritika Naik : ఆమె నా స్ఫూర్తి.. మంచి యాక్షన్ కథల్లో నటించాలని ఉంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ చిత్రంతో తనదైన ముద్ర వేసుకున్న నటి రితికా నాయక్, తాజాగా ఫాంటసీ యాక్షన్ డ్రామా మిరాయ్ లో కీలక పాత్ర పోషించారు. హీరో తేజ సజ్జా, దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని కాంబినేషన్లో తెరకెక్కిన ఈ భారీ చిత్రం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టి.జి. విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సందర్భంగా రితికా నాయక్ మీడియాతో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
Also Read : Kantara-Chapter-1 : గ్లోబల్ రీచ్ కోసం సిద్ధమవుతున్న ‘కాంతార 1’.. వర్కౌట్ అవుతుందా?
Also Read
- Tollywood: షాక్ ఫ్యాక్టర్లు లీక్ ఫ్యాక్టర్లవుతుంటే ఎలా?
- Gudluri Ashok Babu: హీరోగా అవకాశం ఇస్తానంటూ రూ.3.5 కోట్ల మోసం.. 'భాగమతి' డైరెక్టర్పై కేసు నమోదు!
- Lenin : అఖిల్కు మాజీ వదిన కంగ్రాట్స్.. సోషల్ మీడియాలో సామ్ పోస్ట్ వైరల్
- Prabhas : 'ఫౌజీ' బిజినెస్ వేట షురూ.. భారీ రేటుకు నార్త్ ఇండియా, ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్!
‘‘సూపర్ హీరో సినిమాలు నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. మిరాయ్ నేను కూడా సూపర్ పవర్స్ ఉన్న యువతిగా కనిపిస్తాను. రెండున్నరేళ్ల పాటు కష్టపడి చేసిన ఈ సినిమా నా కెరీర్లో ప్రత్యేకమైన మలుపు అవుతుంది. అశోకవనంలో అర్జున కళ్యాణం తర్వాత మంచి కథ కోసం ఎదురు చూస్తున్నప్పుడు, కార్తీక్ ఘట్టమనేని వినిపించిన ఈ కథలోని ఫాంటసీ, ప్రేమ, యాక్షన్ అంశాలు నాకు బాగా నచ్చాయి. అందుకే వెంటనే అంగీకరించాను.‘ఇందులో నేను విభ అనే బలమైన సన్యాసిని పాత్రలో కనిపిస్తాను. హిమాలయాల్లో ఉండే ఈ పాత్ర ప్రయాణం ఏమిటన్నది తెరపైనే ఆసక్తికరంగా తెలుస్తుంది. నా నిజ జీవితానికి పూర్తిగా భిన్నమైన ఈ రోల్ చేయడం నాకు పెద్ద సవాల్. సాధారణంగా నేను చాలా మాట్లాడుతుంటాను కానీ విభ మాత్రం ప్రశాంతమైన శక్తివంతమైన పాత్ర. ఈ సినిమాలో ఎక్కువ భాగం సన్నివేశాలు నిజమైన మంచు పర్వతాలు, అడవుల్లో చిత్రీకరించాం. ఆ కఠిన పరిస్థితుల్లో షూటింగ్ చేయడం ఓ సాహసంలా అనిపించింది’’ అని వివరించారు.
తన భవిష్యత్తు గురించి రితికా మాట్లాడుతూ.. ‘‘ఫాంటసీ కథలు చేయడం నాకిష్టమే కానీ యాక్షన్, రొమాంటిక్ కథల్లోనూ నటించాలని ఉంది. ముఖ్యంగా యాక్షన్ సినిమాల్లో శక్తివంతమైన పాత్రలు చేయాలని కోరిక ఉంది. నేను అభిమానించే హీరోయిన్ సాయిపల్లవి. ఆమె కళ్లతోనే భావాలను వ్యక్తపరచే తీరు చూసి ఎంతో ముచ్చట పడ్డాను. ఫిదా సినిమా చూసిన తర్వాత ఆమెను స్ఫూర్తిగా తీసుకున్న. ప్రస్తుతం వరుణ్ తేజ్తో ఒక సినిమా చేస్తున్నా. అదనంగా డ్యూయెట్ తో పాటు మరికొన్ని ప్రాజెక్ట్ కూడా రెడీగా ఉన్నాయి.’ అని తెలిపింది. ప్రజంట్ సాయి పల్లవి గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో SIR ప్రక్రియ ఎలా నడుస్తోంది..? ఓటర్ల సాధకబాధకాలేంటి..?
-
OTR: ఒంగోలు వైసీపీలో వర్గ పోరు.. పార్టీ ఆఫీసులోనే రచ్చ, అధిష్టానం సీరియస్!
-
MHSRB: ANM మెరిట్ లిస్ట్ విడుదల.. అభ్యంతరాలకు ఛాన్స్
-
Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
-
Donald Trump: ఇరాన్తో సీజ్ఫైర్ ముగిసింది, కానీ చర్చలు కొనసాగుతాయి..
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!