CM Revanth Reddy : పెంచే సినిమా టికెట్ రేట్లలో కార్మికులకు 20 శాతం.. లేకుంటే జీఓ ఇవ్వం
- హాలీవుడ్ను ఇక్కడికి తీసుకువచ్చే బాధ్యత నాది
- చిన్న సినిమాలను తక్కువచేసి చూసే ప్రసక్తే లేదు
- ప్రజాయుద్ధ నౌక గద్దర్ పేరుమీదు.. గద్దర్ ఫిల్మ్ అవార్డ్ను ప్రకటించి చిత్ర పరిశ్రమను ప్రోత్సహిస్తున్నాం
- సినీ కార్మికుల శ్రమ నాకు తెలుసు
- అధికారంతో నాకళ్లు మూసుకుపోలేదు
- కార్మికుల కష్టాలు నాకు తెలుసు
- ఆస్కార్ స్థాయికి తెలుగు పరిశ్రమ వెళ్లింది అంటే కారణం కార్మికులే. -సీఎం రేవంత్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : యూసుఫ్గూడలో నిర్వహించిన సినీ కార్మికుల అభినందన సభలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “సినీ కార్మికుల శ్రమ నాకు బాగా తెలుసు. మీ కష్టాలు తెలుసుకోలేనంతగా నా కళ్లూ మూసుకోలేదు” అని పేర్కొన్నారు. సినీ పరిశ్రమకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని సీఎం హామీ ఇచ్చారు. “ఒకప్పుడు సినీ పరిశ్రమ అంటే మద్రాసే అనుకునే వారు. కానీ, నేడు తెలుగు సినిమా ఆస్కార్ అవార్డుల వరకు వెళ్లగలిగింది. ఈ గౌరవం తెర వెనుక కష్టపడే కార్మికుల శ్రమ ఫలితమే” అని రేవంత్ అభినందించారు.
నిలిచిపోయిన నంది అవార్డులను ప్రజాయుద్ధ నౌక గద్దర్ పేరుతో అవార్డులను ఇస్తున్నామని సీఎం తెలిపారు. “హాలీవుడ్ కూడా తెలంగాణకు వచ్చి షూటింగ్ చేసుకునేలా మారాలి. చిన్న సినిమాలను తక్కువ చేసి చూసే ప్రసక్తే లేదు. ఐటీ రంగానికి ఎంత ప్రాధాన్యత ఇస్తామో, సినిమా పరిశ్రమకూ అంతే ప్రాధాన్యత ఇస్తాం” అని ఆయన అన్నారు.
Also Read
- Viswanath and Sons : అనిల్ రావిపూడి తరహాలో వెంకీ అట్లూరి... ఫస్ట్ సింగిల్ అనౌన్స్మెంట్ తోనే ప్రమోషన్స్ షురూ....
- Anandita Surgery Rumours : అలాంటి సర్జరీలు చేయించుకోలేదు... ట్రోలర్స్ పై మండిపడ్డ ఖుష్బూ కూతురు
- Dhurandhar: 'ధురంధర్’ స్క్రిప్ట్ పీఎంఓ నుంచి వచ్చిందా?.. నటుడు కీలక వ్యాఖ్యలు.!
- Gossip: పబ్ సాంగ్తో రాశి సింగ్ రచ్చ.. ఊపేస్తున్న ‘గాసిప్’ ఫస్ట్ సింగిల్
సినీ కార్మికుల సంక్షేమంపై సీఎం పలు కీలక హామీలు ఇచ్చారు. “కృష్ణా నగర్లో మూడు నుంచి నాలుగు ఎకరాల్లో కార్మికుల పిల్లల కోసం కార్పొరేట్ స్థాయి పాఠశాల నిర్మిస్తాం. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం లంచ్ కూడా అందిస్తాం. రాజీవ్ ఆరోగ్యశ్రీతో పాటు ఉచిత వైద్యం కూడా అందిస్తాం” అని చెప్పారు. తన మాటకు కట్టుబడి కృష్ణానగర్కు వచ్చానని గుర్తుచేసిన రేవంత్.. “కార్మికుల కోసం ప్రభుత్వం చేయాల్సిన పనులు చేస్తాం. వెల్ఫేర్ ఫండ్కు 10 కోట్లు ఇస్తున్నాం. కష్టాల్లో ఉన్న కార్మికుల కోసం ఆ నిధులు వినియోగించండి” అని అన్నారు.
అంతేకాకుండా, “సినిమా టికెట్ రేట్లు పెంచాలంటే కార్మికులకు 20 శాతం వాటా తప్పనిసరి. ఆ వాటా వెల్ఫేర్ ఫండ్కు బదిలీ అవ్వాలి. లేదంటే టికెట్ ధరల పెంపుకు జీఓ ఇవ్వం” అని స్పష్టం చేశారు. నిర్మాతలు, కార్మికులు కుటుంబ సభ్యుల్లా ఉండాలని సూచించారు. ఫైటర్స్, టెక్నీషియన్ల నైపుణ్యం పెంచేందుకు ఫ్యూచర్ సిటీలో భూమి కేటాయిస్తామని తెలిపారు. “మీకు అవసరం ఉన్నప్పుడు మీకు అందుబాటులో ఉంటా. ప్రభుత్వం ఎల్లప్పుడూ మీ వెన్నంటి ఉంటుంది” అని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
Bengal Gang Rape case: వైద్య విద్యార్థిని అత్యాచారం కేసులో ప్రియుడే సూత్రధారి..
తాజావార్తలు
-
Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నాని ప్రాసిక్యూషన్కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్!
-
SBI PO Recruitment 2026: 1500 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులకు ఎస్బీఐ నోటిఫికేషన్.. అర్హత, వయస్సు, జీతం పూర్తి వివరాలు
-
Gudivada Amarnath: 1-2 కేసులు ఉంటే మనిషిని చంపేస్తారా?.. ప్రజలు భయపడిపోతున్నారు!
-
Grain Storage Silos: తెలంగాణలో ధాన్యం నిల్వకు అత్యాధునిక సైలోలు.. రూ.4,450 కోట్లతో భారీ ప్రణాళిక.!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
ట్రెండింగ్
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Tilak Varma-Siraj: తెలుగు ప్లేయర్స్ సిరాజ్, తిలక్కు లీగల్ నోటీసులు.. ఇద్దరు టాలీవుడ్ హీరోస్కు కూడా!
-
Smriti Mandhana: క్రికెట్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా స్మృతి మంధాన.. పురుష క్రికెటర్లకు కూడా సాధ్యం కాని రేర్ రికార్డు!
-
పార్లమెంట్కూ చేరిన FIFA World Cup జోష్.. వైకింగ్ పడవ ప్రయాణాన్ని అనుకరించిన ఎంపీలు.! వీడియో వైరల్..