ప్రామిస్ చేస్తున్నా… ‘పుష్ప-2’పై రష్మిక ఆసక్తికర పోస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం తన తాజా చిత్రం “పుష్ప: ది రైజ్” విజయంతో ఫుల్ హ్యాపీగా ఉంది. ఈ చిత్రంపై అర్జున్ కపూర్, జాన్వీ కపూర్, మహేష్ బాబు, రవీంద్ర జడేజా వంటి ప్రముఖుల నుండి ప్రశంసలు లభించాయి. “పుష్ప : ది రైజ్” మాస్ ఫీస్ట్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పటికీ ‘పుష్ప’రాజ్ ఫైర్ తగ్గనేలేదు. ఇక ఇప్పుడు అందరి దృష్టి ‘పుష్ప-2’పై ఉంది. ఈ నేపథ్యంలో రష్మిక తాజాగా సినిమా విజయం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ‘పుష్ప-‘ గురించి కూడా మాటిచ్చేసింది. రష్మిక తన ఇన్స్టాగ్రామ్లో సీక్వెల్ మరింత బెటర్ గా, బిగ్గర్ గా ఉంటుందని ప్రామిస్ చేసింది. సినిమా పట్ల అందరూ కురిపించిన ప్రేమ తమను మరింత కష్టపడేలా చేస్తుందని చెప్పుకొచ్చింది.
Read Also : లైవ్ : ఏపీ సీఎంతో చిరంజీవి భేటీ
Also Read
- NANI : నాని ఫ్యాన్స్కు నిరాశ.. 'బ్లడీ రోమియో' వాయిదా.. 'OG 2'పై సుజీత్ ఫోకస్
- Jo Sharma: ఇలాంటి కాన్సెప్ట్ ప్రపంచంలోనే ఎక్కడా రాలేదు.. విలన్ ఎవరో చెబితే లక్ష ఇస్తాం!
- kannada Heros : హిట్ ఎఫెక్ట్.. భారీ రెమ్యునరేషన్స్ తీసుకుంటోన్న కన్నడ హీరోలు
- NBK 111 : రొమాంటిక్ సింహం.. బాలయ్యతో బాలీవుడ్ హీరోయిన్ ఐటం సాంగ్
తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో రష్మిక నవ్వుతూ ఉన్న అందమైన ఫోటోను పోస్ట్ చేసింది. “పుష్ప పట్ల మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు.. ఈ ప్రేమ మమ్మల్ని మరింత కష్టపడి పని చేసేలా చేస్తుంది.. మేము మీకు వాగ్దానం చేస్తున్నాము.. పుష్ప 2 మరింత బిగ్గర్ గా, బెటర్ గా ఉంటుంది!” అంటూ పోస్ట్ చేసింది.
“పుష్ప : ది రైజ్”లో అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్, ధనంజయ, సునీల్, అనసూయ కీలక పాత్రల్లో నటించారు. సమంత ‘ఊ అంటావా ఊ ఊ అంటవా’ అనే స్పెషల్ సాంగ్లో కనిపించి టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటిటి ప్లాట్ఫామ్లో ప్రసారం అవుతోంది.

తాజావార్తలు
-
Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
-
TVK Vijay: విజయ్కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్లపై వామపక్షాలు గుర్రు!
-
CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
-
US-Iran Talks: హార్ముజ్పై గుడ్న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!
-
Ponnam Prabhakar : రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం.. భౌతిక దాడులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం