RC15 : షెడ్యూల్ పూర్తి… ‘ఆచార్య’ కోసం హైదరాబాద్ కు పయనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘RC15’ షూటింగ్ లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కియారా అద్వానీ RC15లో రామ్ చరణ్ సరసన కథానాయికగా కనిపించనుంది. ప్రముఖ తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు RC15 చిత్రానికి స్క్రిప్ట్ అందించగా, సంగీత దర్శకుడు తమన్ నేపథ్య సంగీతాన్ని అందిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ పంజాబ్ లోని అమృత్ సర్ లో జరుగుతోంది. ఈ మేరకు పలు ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. తాజాగా RC15 టీం అమృత్ సర్ షెడ్యూల్ ను పూర్తి చేసుకున్నారు. ఇక అక్కడ షూటింగ్ ను పూర్తి చేసుకున్న చరణ్ ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు తిరుగు పయనమయ్యాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ చెర్రీ ఒక పిక్ ను కూడా షేర్ చేశారు.
Read Also : Ghani : ‘ఆహా’లో ప్రొడ్యూసర్స్ కట్ వెర్షన్… వర్కౌట్ అవుతుందా ?
Also Read
- Lenin Success Meet: 'లెనిన్' సక్సెస్ మీట్లో భావోద్వేగానికి గురైన భాగ్యశ్రీ.. 'వాళ్ల ప్రేమే నా అతిపెద్ద అవార్డు'!
- Nick Jonas: హాలీవుడ్ రేంజ్కి ఎదిగిన బాలీవుడ్ హీరోయిన్తో తన ప్రేమ ఎలా మొదలైందో చెప్పిన ప్రియాంక చోప్రా భర్త!
- Grand Comeback: హ్యాట్రిక్ ప్లాన్తో వస్తున్న హీరో.. గ్రాండ్ కంబ్యాక్కు మాస్టర్ స్ట్రాటజీ!
- SS Rajamouli: ఎవరూ ఊహించని హీరోతో దర్శకధీరుడు రాజమౌళి కొత్త సినిమా?
అందులో “అమృత్సర్ లో షెడ్యూల్ పూర్తయింది. ఆచార్య ప్రమోషన్స్ కోసం తిరిగి హైదరాబాద్ కు !!!” అంటూ తన కుక్క రైమ్ తో ఫ్లైట్ లో ఉన్న పిక్ ను షేర్ చేశారు. దీన్నిబట్టి చూస్తుంటే త్వరలోనే యాక్షన్ డ్రామా ‘ఆచార్య’ ప్రమోషన్స్ జోరందుకోబోతున్నాయని తెలుస్తోంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 29న విడుదల కానుంది. ‘ఆచార్య’లో మొట్టమొదటిసారిగా చిరు, చరణ్ స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకోబోతున్నారు. పూజా హెగ్డే, కాజల్ అగర్వాల్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ట్రైలర్కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ‘ఆచార్య’ పాటలకు కూడా మెగా ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటున్నాయి.
తాజావార్తలు
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
-
OTR: ఆరు నియోజకవర్గాల్లో కొత్త ఇన్ఛార్జ్లు.. తూర్పుగోదావరిపై చంద్రబాబు ప్రత్యేక ఫోకస్..
-
OTR: మాజీ ఎమ్మెల్యే, మంత్రి మధ్య సమాధి రాజకీయం
-
New Country: ఐసీసీ సభ్యత్వం పొందిన మరో దేశం.. మొత్తం 111కు చేరిన సంఖ్య..
-
India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!