పుష్ప’ రాజ్ ను వాడేసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం!
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెండు రోజుల క్రితమే అమూల్ సంస్థ ‘పుష్ఫ’ మూవీ హీరో పాత్రను ఉపయోగిస్తూ, ఓ వాణిజ్య ప్రకటనను విడుదల చేసింది. దేశంలో కాస్తంత సంచలనం సృష్టించిన అంశాలు కనిపిస్తే చాలు వాటిని ప్రకటనలుగా మార్చి, దేశ వాప్తంగా హోర్డింగ్స్ లో పెట్టడం అమూల్ సంస్థకు కొత్తకాదు. ఇదిలా ఉంటే తాజాగా కేంద్ర ప్రభుత్వం సైతం ‘పుష్ప’ను కరోనా అవేర్ నెస్ కార్యక్రమాలకు ఉపయోగించేస్తోంది. అందులోని ‘తగ్గేదేలే’ డైలాగ్ కు వచ్చిన పాపులారిటీని దృష్టిలో పెట్టుకుని, ఈ రకంగా సరికొత్త పోస్టర్స్ వేసే ప్రచారం చేస్తోంది. సినిమాలో హీరో ఎర్ర చందనం స్మగ్లరే అయినా… ఇప్పుడు మాత్రం అతని పాపులారిటీ మంచికే ఉపయోగపడుతోంది! మరి ‘పుష్ప’ రాజ్ స్పూర్తితో ఎట్టి పరిస్థితుల్లో మాస్కులు తీసేదే లే! అని జనం నిజంగా అనుకుంటే… వాళ్ళందరికీ మేలు జరిగినట్టే!

Also Read
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..