దివంగత నటుడు, కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కు అరుదైన గౌరవం దక్కింది. ఆయన మరణాంతరం ఆయనకు ‘కర్ణాటక రత్న’ అవార్డును అందిస్తున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. పునీత్ రాజ్ కుమార్ కు ‘కర్ణాటక రత్న’ అవార్డును అందిస్తున్నట్లు కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై ట్విటర్ వేదికగా తెలిపారు. అక్టోబర్ 29 న పునీత్ గుండెపోటుతో మృతిచెందారు. ఆయన మృతిని కన్నడిగులు ఇప్పటికి జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికి పలువురు అభిమానులు ఆయన మృతిని తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పునీత్ చేసిన సేవలను గుర్తించి కర్ణాటక ప్రభుత్వం ‘కర్ణాటక రత్న’ అవార్డును అందిస్తున్నందుకు పునీత్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ಕನ್ನಡನಾಡಿನ ಜನಪ್ರಿಯ ಕಲಾವಿದ ದಿವಂಗತ ಶ್ರೀ ಪುನೀತ್ ರಾಜಕುಮಾರ್ ಅವರಿಗೆ ಮರಣೋತ್ತರ ಕರ್ನಾಟಕ ರತ್ನ ಪ್ರಶಸ್ತಿ ನೀಡಿ ಗೌರವಿಸಲು ರಾಜ್ಯ ಸರ್ಕಾರ ತೀರ್ಮಾನಿಸಿದೆ.
— Basavaraj S Bommai (@BSBommai) November 16, 2021
State Government has decided to honour late Sri #PuneethRajukumar with Karnataka Ratna award posthumously.#KarnatakaRatna