బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే స్వల్ప అస్వస్థత గురయ్యింది. ఒక్కసారిగా ఆమెకు హార్ట్ బీట్ పెరగడంతో వెంటనే ఆమెను కామినేని హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే ఉందని, నోవాటెల్ హోటల్ లో అబ్జర్వేషన్ ఉంచినట్లు వైద్యులు తెలిపారు అంటూ కొద్దిసేపటి నుంచి వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ విషయం తెలియడంతో దీపికా అభిమానులు.. ఆమెకు ఏమైంది అంటూ సోషల్ మీడియాలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వార్తలపై ప్రాజెక్ట్ కె నిర్మాతలు స్పందించారు.
దీపికా ఆరోగ్యం బాగానే ఉందని, నార్మల్ చెకప్ కోసం మాత్రమే ఆమె హాస్పిటల్ కు వెళ్లినట్లు తెలిపారు. నిజానిజాలు తెలియకుండా వార్తలు రాయవద్దని, ఇలాంటి ఫేక్ వార్తలను అభిమానులు నమ్మవద్దని కూడా చెప్పుకొచ్చారు. దీంతో దీపికా అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇకపోతే ప్రస్తుతం దీపికా, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కె చిత్రంలో నటిస్తుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను వైజయంతీ మూవీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది.. ఈ షూటింగ్ కోసం ముంబై నుంచి వచ్చిన దీపికా.. కామినేని హాస్పిటల్ లో నార్మల్ హెల్త్ చెకప్ చేయించుకున్నారు. రేపటి నుంచి ఆమె యధావిధిగా షూటింగ్ లో పాల్గొననున్నారని సమాచారం.
