Dj Tillu: ‘డీజే టిల్లు’కు ఉపయోగపడ్డ త్రివిక్రమ్ సజెషన్స్: నాగవంశీ
”పాండమిక్ టైమ్ లో ఫ్యామిలీ ఆడియెన్స్ థియేటర్లకు రావడం లేదని, ఈ పరిస్థితుల్లో థియేటర్లకు ప్రేక్షకుల్ని రప్పించాలంటే యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ సినిమాలే అవసరమని, ‘డీజే టిల్లు’ అలాంటి సినిమా’నే అని అన్నారు చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ. సిద్ధు జొన్నలగడ్డ, నేహాశెట్టి జంటగా నటించిన ఈ చిత్రంతో విమల్ కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. మూవీ ఈ నెల 12న జనం ముందుకు వస్తున్న సందర్భంగా సూర్యదేవర నాగవంశీ మీడియాలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మూవీ మేకింగ్ విశేషాలు చెబుతూ, ”’కృష్ణ అండ్ హిజ్ లీల’ సినిమా చూశాక సిద్ధును పిలిచి కథ ఉంటే చెప్పమన్నాను. అతను రొమాంటిక్ కామెడీస్ ఉన్నాయని అన్నాడు. కేవలం రోమ్ కామ్ వద్దు అని, ఇంకేదైనా కథ చూడు అన్నాను. అప్పుడు లవ్ స్టోరీకి క్రైమ్ యాంగిల్ కలిపి యూత్ ఫుల్ కథను చెప్పాడు. సిద్దు ఈ కథ చెబుతున్నంత సేపూ బాగా నవ్వుకున్నాను” అని అన్నారు. అయితే ఈ కథను త్రివిక్రమ్ శ్రీనివాస్ కు చెప్పాక ఆయన కొన్ని మార్పులు చేసి కొన్ని సలహాలు ఇచ్చారని ఆ రకంగా ‘డీజే టిల్లు’కు ఆయన ఇచ్చిన సజెషన్స్ ఎంతో ఉపయోగపడ్డాయని చెప్పారు.
గత యేడాది తమ బ్యానర్ నుండి వచ్చిన ‘రంగ్ దే’, ‘వరుడు కావలెను’ చిత్రాలకు మంచి టాక్ వచ్చినా, పాండమిక్ సిట్యుయేషన్ కు భయపడి ఫ్యామిలీ ఆడియెన్స్ థియేటర్లకు రాలేదని నాగవంశీ అన్నారు. బాక్సాఫీస్ దగ్గర అనుకున్న రిజల్డ్ పొందలేకపోయిన మాట వాస్తవమని, అయితే ‘డీజే టిల్లు’ విషయంలో తమకు ఓ కొత్త అనుభవం ఎదురైందని అన్నారు. సిద్ధూ ఆల్మోస్ట్ కొత్త హీరో అయినా హైదరాబాద్, విశాఖలో థియేటర్స్ బుకింగ్స్ ఫుల్ అయ్యాయని చెప్పారు. ఈ సినిమా కంటెంట్ పై మరింత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తూ, ”’డీజే టిల్లు’ యూత్ ఫుల్ సినిమా కానీ అడల్డ్ చిత్రం కాదు. ముద్దు సీన్స్ కూడా అడల్ట్ కిందకు వస్తాయనుకుంటే సరికాదు. ఇవాళ తెరకెక్కుతున్న కంటెంట్ ఎలా ఉంటుందో మనం చూస్తున్నాం. అమ్మాయి కోణంలో సాగే చిత్రమిది. టిల్లు ఒక అమాయక పాత్ర మాత్రమే. అతన్ని హీరోయిన్ ఆడుకుంటుంది. దానిలోనుంచే వినోదం పుడుతుంది. ఈ మూవీ కోసం రామ్ మిరియాల కంపోజ్ చేసి పాడిన డిజె టిల్లు సాంగ్ కానీ, అలాగే అనిరుద్ పాడిన పటాసు పిల్ల పాట, సిద్దు పాడిన మరో పాట ఇలా అన్నీ దేనికవే బాగా ఆకట్టుకున్నాయి” అని అన్నారు. ఈ చిత్రానికి సీక్వెల్ చేసే ఆలోచన కూడా తమకు ఉందని అందుకే ఆ రకంగా ఎండ్ చేశామని తెలిపారు.
Also Read
- Dubbing Movies : అర్థంకాని టైటిల్స్ పెట్టి నష్టపోతున్న నిర్మాతలు
- Trisha Karuppu: వయసు రివర్స్ అవుతోంది.. త్రిష బ్యూటీపై ఫ్యాన్స్ ఫిదా! కానీ మేకర్స్తో గొడవ ఏంటి?
- Onam Release : ఓనమ్ స్పెషల్.. ముగ్గురు మలయాళ బిగ్ స్టార్స్ మధ్య బిగ్ ఫైట్
- Peddi: చరణ్ ‘పెద్ది’ పంజా.. మహేష్ బాబు నిర్మిస్తున్న ‘రావు బహదూర్’కు థియేటర్ల సెగ!
అన్నీ అనుకూలిస్తే 25నే ‘భీమ్లా నాయక్’!
తాను గత ప్రెస్ మీట్ లో సీఎం జగన్ పేరు చెప్పినందుకు కొందరు మరోలా దానిని తీసుకున్నారని, అది కరెక్ట్ కాదని సూర్యదేవర నాగవంశీ వివరణ ఇచ్చారు. ‘భీమ్లా నాయక్’ పెద్ద సినిమా కాబట్టి నైట్ కర్ఫ్యూ వంటి పరిస్థితులు లేకుండా రోజుకు నాలుగు ఆటలు వేసేలా ఉన్నప్పుడే మూవీని విడుదల చేయాలన్నది తన ఆలోచన అని తెలిపారు. గురువారం ఎపీ సీఎంను చిరంజీవి గారితో పాటు ఇతర పెద్దలు వెళ్ళి కలిసిన తర్వాత సానుకూలంగా నిర్ణయాలు ఉంటాయనే నమ్మకం ఏర్పడిందని, అన్నీ బాగుంటే ‘భీమ్లా నాయక్’ను ఈ నెల 25న విడుదల చేస్తామని, మూవీ కంటెంట్ రెడీగా ఉందని నాగవంశీ చెప్పారు.
తాజావార్తలు
-
Donald Trump: 14-సూత్రాల ప్లాన్తో ఇరాన్.. ఆమోదయోగ్యం కాదని ట్రంప్ తిరస్కరణ.. మళ్లీ యుద్ధం చెలరేగుతుందా?
-
Dubbing Movies : అర్థంకాని టైటిల్స్ పెట్టి నష్టపోతున్న నిర్మాతలు
-
India Ship: హార్మూజ్ జలసంధి దాటిన భారత్కు వస్తున్న LPG క్యారియర్.. మే 13న విశాఖకు!
-
Mumbai Indians: ఓటమిలోనూ వరల్డ్ రికార్డ్.. టీ20 క్రికెట్ చరిత్రలో తొలి జట్టుగా ముంబై ఇండియన్స్
-
Ruturaj Gaikwad: ముంబైని ముంచిన చెన్నై వ్యూహం.. సీఎస్కే గెలుపు రహస్యం చెప్పిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!