Site icon NTV Telugu

లతా మంగేష్కర్ మృతికి ప్రధాని సంతాపం

Lata Mangeshkar

ఇండియా నైటింగేల్, లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ తాజాగా కన్నుమూశారు. 92 ఏళ్ల లతా కరోనా వల్ల అనారోగ్యంతో గత 29 రోజులుగా ఆమె ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తీవ్ర అస్వస్థత కారణంగా ఆమె ఈరోజు మృతి చెందింది. నైటింగేల్ ఆఫ్ ఇండియా, క్వీన్ ఆఫ్ మెలోడీ అని కూడా అభిమానులు ఆమెను పిలుచుకుంటారు. లతా మంగేష్కర్ 7 దశాబ్దాలకు పైగా భారతీయ సంగీతానికి ఆమె చేసిన కృషి అద్భుతం. లతామంగేష్కర్ తన గాన జీవితంలో అనేక అవార్డులను గెలుచుకున్నారు. ఆమె 2001లో భారతరత్న, 1999లో పద్మవిభూషణ్, 1989లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డులను గెలుచుకుంది. ఆమె ఐదేళ్ల వయసులో తన తండ్రి సంగీత నాటకాల్లో నటించడం ప్రారంభించింది.

Read Also : మరపురాని మధురం… లతా మంగేష్కర్ మరి లేరు!

తాజాగా లతా మంగేష్కర్ మృతికి ప్రధాని సంతాపం తెలియజేశారు. ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. “నేను చెప్పలేనంత వేదనలో ఉన్నాను. దయ, శ్రద్ధ గల లతా దీదీ మమ్మల్ని విడిచిపెట్టారు. ఆమె మన దేశంలో పూరించలేని శూన్యాన్ని మిగిల్చింది. రాబోయే తరాలు ఆమెను భారతీయ సంస్కృతికి మారుపేరుగా గుర్తుంటుంది. ఆమె మధురమైన స్వరం ప్రజలను మంత్రముగ్ధులను చేసింది. లతా దీదీ పాటలు రకరకాల ఎమోషన్స్‌ని తీసుకొచ్చాయి. ఆమె దశాబ్దాలుగా భారతీయ చలనచిత్ర ప్రపంచం మార్పులను దగ్గరగా చూసింది. సినిమాలకు అతీతంగా, ఆమె భారతదేశం అభివృద్ధిపై ఎల్లప్పుడూ మక్కువ చూపేది. ఆమె బలమైన, అభివృద్ధి చెందిన భారతదేశాన్ని చూడాలని కోరుకుంది. లతా దీదీ నుండి నేను అపారమైన ప్రేమను పొందడం నా గౌరవంగా భావిస్తున్నాను. ఆమెతో నా పరిచయం మరువలేనిది. లతా దీదీ మరణం నాకు బాధను కలిగించింది. ఓం శాంతి” అంటూ మోడీ ట్వీట్ చేశారు.

Exit mobile version