Mukesh Udeshi: సినీపరిశ్రమలో తీవ్ర విషాదం.. చిరంజీవి సినిమాల నిర్మాత మృతి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Producer Mukesh Udeshi Death: బాలీవుడ్ సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ‘గో గోవా గాన్’, ‘ఏక్ విలన్’ సినిమాల నిర్మాత ముఖేష్ ఉదేషి ఈ లోకానికి వీడ్కోలు పలికారు. ఈ వార్త విని బాలీవుడ్ మొత్తం షాక్ అయ్యింది. ముఖేష్ తన కెరీర్లో ఎన్నో గొప్ప బాలీవుడ్ చిత్రాలను కూడా నిర్మించారు. ఇందులో ‘ది విలన్’ అలాగే ‘కలకత్తా మెయిల్’ ఉన్నాయి. దివంగత నిర్మాత ముఖేష్ గురించి ఆయన సన్నిహితుడు ప్రవేష్ సిప్పీ గురించి మాట్లాడుతూ, “ముఖేష్ అల్లు అరవింద్ ఆధ్వర్యంలో చెన్నైలో కిడ్నీ మార్పిడికి సిద్ధమవుతున్నాడు. కానీ ఆపరేషన్కు కొన్ని రోజుల ముందు ఆయన మరణించాడు” అని వెల్లడించాడు. ఇక మారిషస్లో చిత్రీకరించబడిన చాలా బాలీవుడ్ చిత్రాలకు ముఖేష్ ఉదేషి లైన్ ప్రొడ్యూసర్గా కూడా ఉన్నారు.
RK Roja: బాలకృష్ణపై మంత్రి రోజా అనుచిత వ్యాఖ్యలు
Also Read
నిర్మాత అంత్యక్రియల గురించి ఇంకా ఎటువంటి సమాచారం వెల్లడి కాలేదు. ముఖేష్ ఉదేషి గత రాత్రి అంటే సెప్టెంబర్ 11 న తుది శ్వాస విడిచారు. నిర్మాత మృతి వార్త బయటకు వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ వార్తతో బి-టౌన్ ప్రముఖులతో పాటు, వారి అభిమానులు కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. రామ్ గోపాల్ వర్మ ‘కౌన్’ చిత్రానికి ముఖేష్ ఉదేశి సహ నిర్మాత కూడా అని మీకు తెలియజేద్దాం. ఈ చిత్రంలో ఊర్మిళా మటోండ్కర్, మనోజ్ బాజ్పేయి తమ అద్భుతమైన నటనతో ప్రజల హృదయాలను గెలుచుకున్నారు. ఇది కాకుండా, చిరంజీవి హీరోగా హిందీలో చేసిన ప్రతి బంధ్, ద జెంటిల్ మ్యాన్, ఎస్పీ పరశురామ్ లాంటి సినిమాలను అల్లు అరవింద్ తో కలిసి ఆయన నిర్మించారు. ముఖేష్ ఉదేశికి విదేశాల్లో చలనచిత్ర నిర్మాణం, చిత్రీకరణలో ఆయనకు 37 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉంది.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..