NTV Telugu Site icon

Salaar: ఇంత సైలెంట్ గా ఎలా షూట్ చేస్తున్నావు నీల్…

Salaar

Salaar

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఇండియాలోనే బిగ్గెస్ట్ కమర్షియల్ సినిమాగా తెరకెక్కుతోంది ‘సలార్’. హోంబలే ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీపై ఆకాశాన్ని తాకే అంచనాలు అనౌన్స్మెంట్ నుంచే ఉన్నాయి. మోస్ట్ వయొలెంట్ మాన్… ఒక మనిషిని మోస్ట్ వయొలెంట్ అన్నారు అతని పేరు సలార్ అంటూ ప్రశాంత్ నీల్ ఈ మూవీపై అంచనాలు పెంచాడు. KGF డైరెక్టర్, బాహుబలి హీరో కలిస్తే బాక్సాఫీస్ లెక్కలు తారుమారు అవ్వడం గ్యారెంటీ అని ట్రేడ్ వర్గాలు కూడా కాన్ఫిడెంట్ గా ఉన్నాయి. సెప్టెంబర్ 28న సలార్ రిలీజ్ రోజున ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఉన్న రికార్డులు అన్నీ బ్రేక్ అయ్యి కొత్త చరిత్ర పుట్టేలా ఉంది. ఇంతటి పెద్ద సినిమాని రెండు పార్ట్స్ చేస్తూ ప్రశాంత్ నీల్ నిర్ణయం తీసుకున్నాడు. రెండు పార్ట్స్ లో సలార్ వస్తుంది అనగానే బాహుబలి, KGFల హిస్టరీ ప్రతి ఒక్కరి కళ్లకి కనిపించింది. అంతటి అంచనాలు ఉన్న ఇలాంటి సినిమాని చెయ్యాలి అంటే ఏ డైరెక్టర్ లో అయినా కాస్త టెన్షన్ ఉంటుంది. ప్రశాంత్ నీల్ మాత్రం మరో అయిదు నెలల్లో రిలీజ్ పెట్టుకోని చాలా కూల్ గా సలార్ సినిమా షూటింగ్ చేస్తున్నాడు. ఇప్పటికే హీరోయిన్ శృతి హాసన్ క్యారెక్టర్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసిన సలార్ టీం, లేటెస్ట్ గా శ్రీయా రెడ్డి పాత్రకి సంబంధించిన షూటింగ్ ని కంప్లీట్ చేసారు.

పొగరు సినిమాలో నెగటివ్ రోల్ ప్లే చేసి చాలా మంచి పేరు తెచ్చుకున్న శ్రీయా రెడ్డి ఆ తర్వాత సినిమాలని తగ్గించింది. తను రాసుకున్న క్యారెక్టర్ కోసం శ్రీయ రెడ్డిని అప్రోచ్ అయ్యి, ఆమెని ఒప్పించిన ప్రశాంత్ నీల్ కి థాంక్స్ చెప్తూ శ్రీయ రెడ్డి స్పెషల్ పోస్ట్ చేసింది. సోషల్ మీడియాలో ప్రశాంత్ నీల్, డీఓపీ భువన్ గౌడతో దిగిన ఫోటోని పోస్ట్ చేసిన శ్రీయ రెడ్డి, సలార్ సినిమాలో తన పార్ట్ షూటింగ్ కి సంబంధించిన అప్డేట్ ని ఇచ్చింది. ఆదిపురుష్ సినిమా రిలీజ్ అయ్యే వరకు సలార్, ప్రాజెక్ట్ K సినిమాల నుంచి ఎలాంటి అప్డేట్స్ రాకూడదు అని ప్రభాస్ కండీషన్ పెట్టడంతో అసలు ఈ సినిమాల విషయంలో ఏం జరుగుతుంది అనేది ఎవరికీ తెలియలేదు. ఇప్పుడు శ్రీయ రెడ్డి పోస్ట్ తో సలార్ అప్డేట్ బయటకి వచ్చింది. జూన్ 16న ఆదిపురుష్ రిలీజ్ అయ్యాక ప్రశాంత్ నీల్-ప్రభాస్ లు సలార్ అప్డేట్స్ తో దండయాత్ర మొదలుపెట్టబోతున్నారు.