ప్రభాస్ మూడు సినిమాలు… మూడు కొత్త సాంకేతికతలు
‘బాహుబలి’ సీరీస్, ‘సాహో’ సినిమాలతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ ప్రస్తుతం వరుసగా ప్యాన్ ఇండియా సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. అంతే కాదు తను చేసే ప్రతి సినిమాలో కొత్త కొత్త విషయాలను చూపిస్తూ ఇండియన్ సినిమాలో ఇంతకుముందు ఉపయోగించని కొత్త టెక్నాలజీతో ప్రయోగాలు చేస్తూ వెళుతున్నాడు.
వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న ప్రభాస్ ‘రాధే శ్యామ్’ సినిమా కోసం వర్చువల్ ప్రొడక్షన్ టెక్నాలజీని ఉపయోగించారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజా హేగ్డే హీరోయిన్. ఇక ప్రభాస్ నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘సాలార్’ను ‘డార్క్ సెంట్రిక్ థీమ్’ టెక్నాలజీ ఉపయోగించి చిత్రీకరిస్తున్నారు. సినిమా పలు సన్నివేశాలు చీకటి-షేడెడ్ విజువల్స్ తో ఉంటాయి. హాలీవుడ్ సినిమాలు ‘ది మ్యాట్రిక్స్, బ్యాట్ మేన్ ట్రైయాలజీ, టెనెట్’ వంటి సినిమాల కోసం ఈ సాంకేతికతనే ఉపయోగించారు.
Also Read
- Yatra: హీరోగా రజనీకాంత్ మనవడు.. కొడుకు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీపై ధనుష్ క్లారిటీ ఇదే!
- NBK - Koratala Siva మూవీ స్టోరీ లీక్.. మాఫియా డాన్గా బాలయ్య! ఇక నందమూరి ఫ్యాన్స్కు పూనకాలే..
- Tollywood Star Hero: ధురందర్ డైరెక్టర్ తో సినిమాకి తెలుగు స్టార్ హీరో యత్నాలు?
- Hero Dupes: డబ్బు పెట్టే వాడికి లేని నొప్పి మనకెందుకు? .. జేడీ కీలక వ్యాఖ్యలు
ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ‘సాలార్’ లో శృతి హాసన్ హీరోయిన్. అలాగే ప్రభాస్ మరో సినిమా ‘అదిపురుష్’ కోసం మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఈ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ పౌరాణిక చిత్రంలో కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్ ఇతర ప్రధాన పాత్రధారులు. దీనిని 3D లో విడుదల చేయనుండటం విశేషం. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమా విడుదల కానుంది.
ఇలా మూడు సినిమాల్లో మూడు రకాల సాంకేతికతలను పరిచయం చేయబోతున్నాడన్నమాట. వీటితో పాటు మరో భారీ సినిమాను నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేయబోతున్నాడు. వీటన్నింటితో ప్రభాస్ ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదుగుడుతాడని అంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో!?
తాజావార్తలు
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
-
India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
-
SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
-
AP Govt: 99 పైసలకే ఎకరం భూమి కేటాయించిన ఏపీ.. మొత్తం 20 ఎకరాలు..
-
India Women vs SA Women: ఛేదనలో బొక్కబోర్లా పడ్డ టీమిండియా.. 4-1తో సిరీస్ ఓటమి.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!