Prabhas: ప్రభాస్ విగ్రహంపై బాహుబలి నిర్మాత ఫైర్.. క్లారిటీ ఇచ్చిన మ్యూజియం అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్ బేస్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన రేంజ్ కేవలం ఇండియా మాత్రమే కాదు ప్రపంచం మొత్తం కూడా పాకింది అంటే అతిశయోక్తి లేదు. బాహుబలి సినిమాతో మొట్టమొదటి పాన్ ఇండియా స్టార్ గా ప్రభాస్ మారాడు. ఈ సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ మారిపోయింది అని చెప్పాలి ప్రస్తుతం ఆయన చేతిలో వరుస పాన్ ఇండియా సినిమాలు ఉండడం, ఆ సినిమాల కోసం ప్రపంచమంతా ఎదురు చూడడం తెల్సిందే. ఇప్పటికే అతనిపై గౌరవంతో మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ప్రభాస్ మైనపు విగ్రహంను ఆవిష్కరించారు. సౌత్ హీరోల్లో ప్రభాస్, మహేష్ బాబుకు తప్ప ఇప్పటివరకు ఆ మ్యూజియంలో మరో హీరో మైనపు విగ్రహం లేదు. ఇక ఈ మధ్యనే మైసూర్ మ్యూజియంలో ప్రభాస్ విగ్రహం ఆవిష్కరించినట్లు సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే ఆ విగ్రహం ప్రభాస్ లా లేదు అని అభిమానులు ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. దీంతో ఈ విగ్రహం పై బాహుబలి నిర్మాత శోభయార్లగడ్డ ఫైర్ అయ్యాడు. అసలు ఆ విగ్రహం ప్రొఫెషనల్ చేసినట్టు లేదని, మాకు విగ్రహం చేస్తున్నట్లు కూడా ఎవరూ చెప్పలేదని, వెంటనే దాని తొలగించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపాడు.
Nani- Mrunal: అబ్బబ్బ.. ఈ జంట ఎంత ముద్దుగా ఉన్నారు
Also Read
ఇక శోభు యారలగడ్డ ట్వీట్ పై మైసూరు మ్యూజియం అధికారులు స్పందించారు. ” ఎవరి మనోభావాలు దెబ్బతీయాలని అలా చేయలేదు.. అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి కాబట్టి.. మ్యూజియం నుంచి విగ్రహాన్ని తొలగిస్తాం” అని వారు తెలిపారు. దీంతో ఈ ట్రోలింగ్ పుల్ స్టాప్ పడినట్టే అని తెలుస్తుంది. ఇకపోతే అమరేంద్ర బాహుబలి విగ్రహం మ్యూజియంలో ఏర్పాటు చేయాలంటే ముందుగా నిర్మాతల అనుమతి తీసుకోవాలి. అలాగే విగ్రహం తయారైన తర్వాత నిర్మాతలకు చూపించి వారు ఓకే అంటేనే దాన్ని మ్యూజియంలో ఆవిష్కరించాలి. దీనికి సంబంధించిన పూర్తి హక్కులు నిర్మాతలకే ఉంటాయని తెలుస్తుంది. మరి మైసూర్ మ్యూజియంలోని అధికారులు మరోసారి నిర్మాతలను మెప్పించి ప్రభాస్ విగ్రహాన్ని ప్రతిష్టిస్తారా..? లేదా..? అనేది తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..