Pooja Hegde: యశ్ సినిమాలో పూజా.. ఇదిగోండి క్లారిటీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొన్ని రోజుల నుంచి పాన్ ఇండియా స్టార్ యశ్ తదుపరి సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా ఎంపిక అయ్యిందంటూ వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. నర్తన్ దర్శకత్వంలో యశ్ ఓ భారీ పాన్ ఇండియా చిత్రానికి ప్లాన్ చేస్తున్నాడని, ఈ సినిమాలోనే పూజా హీరోయిన్గా చేయనుందని ప్రచారం జరిగింది. కానీ, ఈ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని తాజాగా తేలిపోయింది. యశ్ సినిమా కోసం హీరోయిన్ పాత్రకు పూజాని ఎవ్వరూ సంప్రదించలేదని సన్నిహిత వర్గాలు స్పష్టం చేశాయి. ప్రస్తుతం పూజా హైదరాబాద్లో జరుగుతోన్న కభీ ఈద్ కభీ దివాలి సినిమా షూట్లో బిజీగా ఉంది. బాలీవుడ్ సూపర్స్టార్ సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి ఫర్హాద్ సంజీ దర్శకుడు.
అటు.. యశ్ తన తదుపరి సినిమాని ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. దర్శకుడు నర్తన్తో సినిమా చేస్తున్నట్టు గతేడాది నుంచి వార్తలైతే వస్తున్నాయి కానీ, అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం రాలేదు. దీంతో, యశ్ నెక్ట్స్ సినిమా ఏంటా? అని ఆడియన్స్లో క్యూరియాసిటీ నెలకొంది. ‘కేజీఎఫ్2’తో యశ్ బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ అందుకోవడంతో, నెక్ట్స్ ప్రాజెక్ట్పై చాలా జాగ్రత్త వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఇకపై చేసేవన్నీ దేశవ్యాప్తంగా విడుదల అవుతాయి కాబట్టి, అందరినీ ఆకట్టుకునే క్రేజీ సబ్జెక్ట్తోనే రావాలని నిర్ణయించుకున్నాడు. అందుకే.. కేజీఎఫ్2 రిలీజై ఇన్ని రోజులు అవుతున్నా, తదుపరి సినిమాపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరి, ఈ హీరో ఎప్పుడు తన నెక్ట్స్ సినిమా అనౌన్స్ చేస్తాడో?
Also Read
- 72nd National Film Awards: ఉత్తమ నటుడు కిరీటం వీళ్లిద్దరికీ.. జాతీయ ఉత్తమ నటిగా!
- Committee Kurrollu: 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’కు అరుదైన గౌరవం
- Kiran Abbavaram: ‘చెన్నై లవ్ స్టోరీ’పై కిరణ్ ధీమా.. నా కొడుకు అలా పిలిస్తే చాలు అంటూ కామెంట్స్!
- Kiran Abbavaram: "మా అమ్మ ఆరు ఏళ్లు నాకు దూరంగా ఉంది" కిరణ్ అబ్బవరం ఎమోషనల్..
ఇదిలావుండగా.. కేజీఎఫ్2 ఘన విజయం సాధించిన నేపథ్యంలో కేజీఎఫ్3కి మేకర్స్ శ్రీకారం చుట్టేందుకు సమాయత్తమవుతున్నారు. సినిమాలోనే మరో సీక్వెల్ ఉంటుందని దర్శకుడు హింట్ ఇవ్వడంతో, ఆడియన్స్ నుంచి దానికి డిమాండ్ వచ్చిపడింది. ఈ క్రమంలోనే కేజీఎఫ్3 ఉంటుందని, మేకర్స్ స్పష్టం చేశారు. అయితే, ఎప్పట్నుంచి ఈ సీక్వెల్ ప్రారంభమవుతుందన్న విషయంపై స్పష్టత ఇవ్వలేదు. ఎందుకంటే, దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం సలార్తో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత ఎన్టీఆర్తోనూ సెట్స్ మీదకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు. కాబట్టి, కేజీఎఫ్3 సెట్స్ మీదకి వెళ్లేందుకు చాలా సమయమే పట్టేలా కనిపిస్తోంది.
తాజావార్తలు
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!