Site icon NTV Telugu

Perni Nani : టికెట్ రేట్లపై జీవో ఆలస్యం… ఎందుకంటే ?

Perni Nani

ఇప్పుడు టాలీవుడ్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “భీమ్లా నాయక్” ఫీవర్ పట్టుకుంది. అయితే ఏపీలో మాత్రం ఇంకా థియేటర్లు, టికెట్ రేట్లపై వివాదం నడుస్తూనే ఉంది. అయితే “భీమ్లా నాయక్” విడుదలకు ముందే సవరించిన టిక్కెట్ ధర GOను ఏపీ ప్రభుత్వం విడుదల చేస్తుందని అంతా భావించారు. ఏపీ ప్రభుత్వం థియేటర్లపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అక్కడ టిక్కెట్ ధరలు తక్కువగా ఉండడంతో ఇప్పటికే కొన్ని థియేటర్లు మూతపడ్డాయి. నిన్న ‘భీమ్లా నాయక్’ విడుదల సందర్భంగా ఆంధ్రాలోని థియేటర్ల వద్ద నెలకొన్న పరిస్థితులపై పవన్ అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో జీఓ విడుదలలో జాప్యం ఎందుకు జరిగింది ? అనే విషయాన్ని ఏపీ మంత్రి పేర్ని నాని వెల్లడించారు.

Read Also : RC15 video leaked : షూటింగ్ లో చెర్రీ అలా…

జీఓపై ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని స్పందిస్తూ ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మృతితో రివైజ్డ్ జీఓ ఆలస్యమైందని అన్నారు. ఫిబ్రవరి 23న జీవో జారీ కావాల్సి ఉందని అన్నారు. కొత్త రివైజ్డ్ జిఓ వచ్చే వారం విడుదల కావచ్చని, వేసవికి వచ్చే సినిమాలకు ప్రయోజనం చేకూరుతుందని చర్చలు జరుగుతున్నాయి. ‘భీమ్లా నాయక్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ సందర్భంగా పవన్ కళ్యాణ్ సినిమా సమస్యల గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ‘భీమ్లా నాయక్’ సినిమా విడుదల తర్వాత నెలకొన్న పరిస్థితులను బట్టి పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేశారని, సమస్యలు పరిష్కారమవుతాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక మరోవైపు ‘భీమ్లా నాయక్’ బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే.

Exit mobile version