NTV Telugu Site icon

Bheemla Nayak : నిరాశలో పవన్ ఫ్యాన్స్… హీరోయిన్ కు షాక్

bheemla nayak

bheemla nayak

ఎట్టకేలకు ఎంతగానో ఎదురు చూస్తున్న పవర్ స్టార్ చిత్రం “భీమ్లా నాయక్” ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ప్రీమియర్ షోలు ఓవర్సీస్‌లో ప్రదర్శితం అయ్యాయి. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి, విమర్శకుల నుంచి పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. ప్రస్తుతం థియేటర్లలో ‘భీమ్లా నాయక్’ సందడి నడుస్తోంది. మెగా అభిమానులు సినిమా హాళ్లలో రచ్చరచ్చ చేస్తున్న వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

Read Also : Pawan Kalyan: భీమ్లా నాయక్ వచ్చేశాడు.. అందరికీ నచ్చేశాడు..!!

సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తున్నప్పటికీ అభిమానులు మాత్రం ఒక్క విషయంలో నిరాశకు గురైనట్టు తెలుస్తోంది. మెలోడియస్ సాంగ్ “అంత ఇష్టం ఏందయ్యా” అనే పాటను మేకర్స్ సినిమా నుండి తొలగించడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. అయితే ఈ లిరికల్ సాంగ్ విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. మరి ఈ హిట్ ట్రాక్‌ని మూవీలో నుంచి తీసివేయడానికి గల కారణాలు ఏంటో తెలియరాలేదు. ఇక నిత్యామీనన్ కు కూడా మొత్తానికే ఆమె పాటను సినిమాలో నుంచి కట్ చేయడం షాకిచ్చే విషయమని చెప్పొచ్చు.