Bollywood : బాలీవుడ్ నటుడి ఇంట తీవ్ర కలకలం.. సోదరుడిపై గొడ్డలితో దాడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bollywood : బాలీవుడ్ విలక్షణ నటుడు పంకజ్ త్రిపాఠి కుటుంబంలో చోటుచేసుకున్న ఒక విషాదకర ఘటన అందరినీ కలచివేసింది. భూ వివాదం చెలరేగి హింసాత్మకంగా మారడంతో, ఆయన సోదరుడిపై గొడ్డలితో దాడి జరగడం తీవ్ర ఆందోళనకు దారితీసింది. ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, పోలీసులు వెంటనే రంగంలోకి దిగి నిందితుడిని అరెస్టు చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. బీహార్లోని గోపాల్గంజ్ జిల్లా మాధోపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బెల్సంద్ తివారీ టోలాలో జూన్ 21న ఈ ఘటన జరిగింది. పంకజ్ త్రిపాఠి సోదరుడు విజయేంద్రనాథ్ తివారీ, చాలా కాలంగా కొనసాగుతున్న భూ వివాదం నేపథ్యంలో తన పొరుగువారితో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. ఆ వివాదం ఒక్కసారిగా హింసాత్మకంగా మారడంతో, రాజేష్ సాహ్ అనే వ్యక్తి గొడ్డలితో విజయేంద్రనాథ్ తివారీపై దాడి చేసినట్లు పోలీసులు వెల్లడించారు. దాడిలో తీవ్రంగా గాయపడిన విజయేంద్రనాథ్ తివారీని స్థానికులు వెంటనే గోపాల్గంజ్ సదర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆయనను పాట్నాకు రిఫర్ చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించినట్లు సమాచారం. ఈ వార్త వెలుగులోకి రావడంతో పంకజ్ త్రిపాఠి అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read
- Yash: కేజీఎఫ్ 2 సక్సెస్ తర్వాత హైదరాబాద్ ఎందుకు రాలేదో చెప్పిన యశ్.. అసలు కారణం ఇదేనట!
- NBK 111 : బాలయ్య - గోపిచంద్ మలినేని సినిమా రిలీజ్ డేట్ ఇదే
- Toxic Mallareddy Event : టాక్సిక్ ప్రీరిలీజ్ ఈవెంట్లో నిర్లక్ష్యంగా మల్లారెడ్డి యూనివర్సిటీపై కేసు నమోదు..
- Kareena Kapoor: మూడోసారి గర్భవతా?.. వైరల్ రూమర్స్పై కరీనా కపూర్ ఫన్నీ రియాక్షన్!
సమాచారం అందుకున్న వెంటనే సదర్ 2 ఎస్డీపీఓ, మాధోపూర్ పోలీస్ స్టేషన్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. ఘటనకు సంబంధించిన పూర్తి ఆధారాలను సేకరించేందుకు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ బృందాన్ని కూడా రంగంలోకి దించారు. దాడికి ఉపయోగించిన గొడ్డలితో పాటు నిందితుడు ధరించిన రక్తపు మరకలున్న దుస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక విచారణలో ఈ దాడికి ప్రధాన కారణం చాలా కాలంగా కొనసాగుతున్న భూ వివాదమేనని పోలీసులు గుర్తించారు. ఈ కేసులో నిందితుడిగా గుర్తించిన రాజేష్ సాహ్ను పోలీసులు వెంటనే అరెస్టు చేశారు. ప్రస్తుతం అతడిని జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. ఈ ఘటన తర్వాత గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని అధికారులు తెలిపారు. పంకజ్ త్రిపాఠి కుటుంబంలో చోటుచేసుకున్న ఈ సంఘటనపై సినీ వర్గాలతో పాటు అభిమానులు కూడా విచారం వ్యక్తం చేస్తూ, విజయేంద్రనాథ్ తివారీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
తాజావార్తలు
-
Yash: కేజీఎఫ్ 2 సక్సెస్ తర్వాత హైదరాబాద్ ఎందుకు రాలేదో చెప్పిన యశ్.. అసలు కారణం ఇదేనట!
-
NBK 111 : బాలయ్య – గోపిచంద్ మలినేని సినిమా రిలీజ్ డేట్ ఇదే
-
Bangladesh: బంగ్లాదేశ్లో ఒకే హిందూ కుటుంబానికి చెందిన నలుగురు దారుణ హత్య?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. 300 బంతులు ఆడగలనని ప్రపంచానికి చూపించాలి!
-
Toxic Mallareddy Event : టాక్సిక్ ప్రీరిలీజ్ ఈవెంట్లో నిర్లక్ష్యంగా మల్లారెడ్డి యూనివర్సిటీపై కేసు నమోదు..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!