Bollywood : బాలీవుడ్ నటుడి ఇంట తీవ్ర కలకలం.. సోదరుడిపై గొడ్డలితో దాడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bollywood : బాలీవుడ్ విలక్షణ నటుడు పంకజ్ త్రిపాఠి కుటుంబంలో చోటుచేసుకున్న ఒక విషాదకర ఘటన అందరినీ కలచివేసింది. భూ వివాదం చెలరేగి హింసాత్మకంగా మారడంతో, ఆయన సోదరుడిపై గొడ్డలితో దాడి జరగడం తీవ్ర ఆందోళనకు దారితీసింది. ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, పోలీసులు వెంటనే రంగంలోకి దిగి నిందితుడిని అరెస్టు చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. బీహార్లోని గోపాల్గంజ్ జిల్లా మాధోపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బెల్సంద్ తివారీ టోలాలో జూన్ 21న ఈ ఘటన జరిగింది. పంకజ్ త్రిపాఠి సోదరుడు విజయేంద్రనాథ్ తివారీ, చాలా కాలంగా కొనసాగుతున్న భూ వివాదం నేపథ్యంలో తన పొరుగువారితో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. ఆ వివాదం ఒక్కసారిగా హింసాత్మకంగా మారడంతో, రాజేష్ సాహ్ అనే వ్యక్తి గొడ్డలితో విజయేంద్రనాథ్ తివారీపై దాడి చేసినట్లు పోలీసులు వెల్లడించారు. దాడిలో తీవ్రంగా గాయపడిన విజయేంద్రనాథ్ తివారీని స్థానికులు వెంటనే గోపాల్గంజ్ సదర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆయనను పాట్నాకు రిఫర్ చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించినట్లు సమాచారం. ఈ వార్త వెలుగులోకి రావడంతో పంకజ్ త్రిపాఠి అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read
- The Odyssey: 'ది ఒడిస్సీ' ప్రీ రివ్యూ ..
- The Odyssey: రిలీజ్కు ముందే సెన్సేషన్.. హాట్కేకుల్లా అమ్ముడవుతున్న 'ది ఒడిస్సీ' టికెట్లు! లక్షకు పైగా..
- Kiran Abbavaram: 'మా తమిళోల్లు మీ సినిమాలు చూడరు..' ఉన్న విషయం చెప్పిన హీరో కిరణ్ అబ్బవరం
- Vallabhaneni Anil: చిరంజీవి చెప్పిన మాటతో కదిలిన ఫెడరేషన్.. డ్యాన్స్ మాస్టర్స్ గొడవకు ఫుల్ స్టాప్?
సమాచారం అందుకున్న వెంటనే సదర్ 2 ఎస్డీపీఓ, మాధోపూర్ పోలీస్ స్టేషన్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. ఘటనకు సంబంధించిన పూర్తి ఆధారాలను సేకరించేందుకు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ బృందాన్ని కూడా రంగంలోకి దించారు. దాడికి ఉపయోగించిన గొడ్డలితో పాటు నిందితుడు ధరించిన రక్తపు మరకలున్న దుస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక విచారణలో ఈ దాడికి ప్రధాన కారణం చాలా కాలంగా కొనసాగుతున్న భూ వివాదమేనని పోలీసులు గుర్తించారు. ఈ కేసులో నిందితుడిగా గుర్తించిన రాజేష్ సాహ్ను పోలీసులు వెంటనే అరెస్టు చేశారు. ప్రస్తుతం అతడిని జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. ఈ ఘటన తర్వాత గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని అధికారులు తెలిపారు. పంకజ్ త్రిపాఠి కుటుంబంలో చోటుచేసుకున్న ఈ సంఘటనపై సినీ వర్గాలతో పాటు అభిమానులు కూడా విచారం వ్యక్తం చేస్తూ, విజయేంద్రనాథ్ తివారీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!