Palletoori Monagadu: నాలుగు పదుల ‘పల్లెటూరి మొనగాడు’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Palletoori Monagadu Completes 40 Years: మెగాస్టార్ చిరంజీవి మాస్ హీరోగా జేజేలు అందుకోవడానికి కారణమైన చిత్రాలలో ‘పల్లెటూరి మొనగాడు’కూ స్థానం ఉంటుంది. తమిళ దర్శకుడు ఎస్.ఏ.చంద్రశేఖర్ దర్శకత్వంలో రాజలక్ష్మీ ఆర్ట్ మూవీస్ పతాకంపై మిద్దే రామారావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నాటి మేటి తమిళ స్టార్ హీరో విజయ్ తండ్రి ఎస్.ఏ.చంద్రశేఖర్. విజయ్ తల్లి శోభా చంద్రశేఖర్ రాసిన కథ ఆధారంగానే ఈ సినిమా రూపొందింది. అంతకు ముందు చిరంజీవికి ఘన విజయాన్ని అందించిన ‘చట్టానికి కళ్ళులేవు’ చిత్రానికి కూడా శోభనే కథ సమకూర్చగా, చంద్రశేఖర్ దర్శకత్వం వహించారు. ఆ సినిమాకు ‘సట్టం ఒరు ఇరుట్టారై’ ఆధారం కాగా, ఈ ‘పల్లెటూరి మొనగాడు’కు ‘నెంజిలే తునివిరుందాల్’ మాతృక. ఆ రెండు తమిళ సినిమాలలోనూ విజయకాంత్ నాయకుడు, కాగా తెలుగులో రెండు చిత్రాల్లోనూ చిరంజీవి హీరో. రాధిక నాయికగా నటించిన ‘పల్లెటూరి మొనగాడు’ 1983 ఫిబ్రవరి 5న విడుదలయింది.
‘పల్లెటూరి మొనగాడు’ కథ ఏమిటంటే – పేదవాళ్ళకు వైద్యం అందించడమే ధ్యేయంగా డాక్టర్ శాంతి ప్రతినపూనుతుంది. అందుకు ఓ గ్రామాన్ని ఎంచుకుంటుంది. ఆ ఊరి జమీందార్ తనకు ఎవరు ఎదురొచ్చినా గుట్టు చప్పుడు కాకుండా తలతీసేస్తుంటాడు. అదే ఊరిలో రాజన్న అనే రౌడీ ఉంటాడు. జమీందార్ కూతురు ఓ పేదింటి అబ్బాయిని ప్రేమిస్తుంది. ఆ డాక్టర్ శాంతి ఆ ఊరినే ఎంచుకోవడానికి కారణం, ఆమె చిన్నప్పుడు అక్కడ పెరిగి ఉంటుంది. ఆమె తండ్రి కూడా డాక్టర్. ఆయనను జమీందార్ హతమార్చి ఉంటాడు. శాంతి చిన్నప్పటి ఫ్రెండ్ రాజన్న అనే తెలుస్తుంది. వారిద్దరూ ప్రేమించుకుంటారు. రాజన్న తీరు మారుతుంది. అది కూడా జమీందార్ కు నచ్చదు. జమీందార్ కూతురు, ఆమె ప్రేమించిన వాడికి రాజన్న అండగా నిలచి పెళ్ళి జరిపిస్తాడు. దాంతో జమీందార్ ఆగ్రహంతో ఊగిపోతాడు. అప్పటినుంచీ రాజన్నను, డాక్టర్ శాంతిని మట్టుపెట్టే ప్రయత్నం చేస్తూంటాడు జమీందార్. ఆ ప్రయత్నాలను చిత్తు చేసి, జమీందార్ ను హతమారుస్తాడు రాజన్న. ఏడేళ్ళు జైలు శిక్ష అనుభవించి వచ్చిన రాజన్న, శాంతి కలుసుకోవడంతో కథ సుఖాంతమవుతుంది.
Also Read
- NBK112: బాలయ్య – కొరటాల సినిమా క్యాన్సిలా! కారణం ఇదేనా?
- Bollywood vs South: పాత్ర కోసమా? పాపులారిటీ కోసమా? హీరోయిన్ల బోల్డ్ మేకోవర్పై హాట్ చర్చ!
- Jai Hanuman: ‘జై హనుమాన్’లో రాముడిగా ఆ స్టార్ హీరోనేనా? ప్రశాంత్ వర్మ ప్లాన్ ఇదేనా!
- Prashanth Neel: ‘డ్రాగన్’ షూటింగ్కు బ్రేక్.. ప్రభాస్తో ‘సలార్-2’ మొదలుపెట్టనున్న ప్రశాంత్ నీల్?
ఇందులో గొల్లపూడి మారుతీరావు, రాజేశ్, పూర్ణిమ, చలపతిరావు, వీరభద్రరావు, వేలు, కె.కె.శర్మ, అత్తిలి లక్ష్మి, ఆర్.నారాయణ మూర్తి తదితరులు నటించారు. ఈ చిత్రానికి సత్యానంద్ మాటలు రాయగా, సి.నారాయణ రెడ్డి, ఆత్రేయ, రోహీణీ చక్రవర్తి పాటలు పలికించారు. చక్రవర్తి సంగీతం సమకూర్చారు. ఇందులోని “గుండె గది ఖాళీ…”, “పలుకే బంగారామా…”, “అక్కుమ్ బక్కుమ్ హో…”, “జడలోని బంతిపూవు…”, ‘ఎవరోయ్ పెద్దోళ్ళు…” అంటూ సాగే పాటలు అలరించాయి. ‘పల్లెటూరి మొనగాడు’ మాస్ ను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా తరువాత రాజలక్ష్మీ ఆర్ట్ మూవీస్ చిరంజీవితో ‘గూండా’ చిత్రాన్ని నిర్మించి మంచి విజయం సాధించింది.
తాజావార్తలు
-
NALSAR row: CJI సూర్యకాంత్ ఆహ్వానంపై రచ్చ.. నల్సార్ విద్యార్థులకు బార్ కౌన్సిల్ షాక్..!
-
Team India: టీమిండియా జట్టులోకి ముగ్గురు దిగ్గజ ఆటగాళ్లు..! ఎల్లుండే బరిలోకి..
-
NBK112: బాలయ్య – కొరటాల సినిమా క్యాన్సిలా! కారణం ఇదేనా?
-
CM Revanth Reddy: మీరు కొనుకున్న భూమి ఎక్కడికీ పోదు.. నేనే రిజిస్ట్రేషన్ చేయిస్తా: సీఎం రేవంత్ రెడ్డి
-
Kolkata: కోల్కతా ఆస్పత్రిలో నర్సు మృతదేహం.. ఆర్జీకర్ తరహాలో కలకలం!
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!