Site icon NTV Telugu

మరోసారి నితిన్ సరసన రష్మిక!

టాలీవుడ్ హీరో నితిన్, రష్మిక మందన హీరో హీరోయిన్స్‌గా దర్శకుడు వెంకీ కుడుముల డైరెక్షన్‌లో ‘భీష్మ’ అనే రొమాంటిక్ కామెడీ చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం మేరకు నితిన్-రష్మిక కాంబినేషన్ మరోసారి రానుందని తెలుస్తోంది. ప్రస్తుతం నితిన్ ‘మాస్ట్రో’ సినిమాతో బిజీగా ఉండగా.. రష్మిక పుష్ప సినిమాతో బిజీగా వుంది. ఈ సినిమాల తరువాత వీరిద్దరూ వక్కంతం వంశీ దర్శకత్వంలో చేయనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకి సంబంధించిన సన్నాహాలు కూడా మొదలయ్యాయని తెలుస్తోంది.

Exit mobile version