టాలీవుడ్ హీరో నితిన్, రష్మిక మందన హీరో హీరోయిన్స్గా దర్శకుడు వెంకీ కుడుముల డైరెక్షన్లో ‘భీష్మ’ అనే రొమాంటిక్ కామెడీ చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం మేరకు నితిన్-రష్మిక కాంబినేషన్ మరోసారి రానుందని తెలుస్తోంది. ప్రస్తుతం నితిన్ ‘మాస్ట్రో’ సినిమాతో బిజీగా ఉండగా.. రష్మిక పుష్ప సినిమాతో బిజీగా వుంది. ఈ సినిమాల తరువాత వీరిద్దరూ వక్కంతం వంశీ దర్శకత్వంలో చేయనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకి సంబంధించిన సన్నాహాలు కూడా మొదలయ్యాయని తెలుస్తోంది.