దేవర బ్లాక్ బస్టర్ తర్వాత జోష్ లో ఉన్న ఎన్టీఆర్ అదే ఎనర్జీతో ‘వార్ 2’ తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. స్టార్ హీరో హృతిక్ రోషన్తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు తారక్. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఓ వైపు వార్ 2 జరుగుతుండగానే ప్రశాంత్ నీల్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆ మధ్య గ్రాండ్ పూజా కార్యక్రమాలు నిర్వహిచుకున్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ను రామోజీ ఫిల్మ్స్ లో స్టార్ట్ చేసారు. రాస్తారోకో, అల్లర్లు వంటి సన్నివేశాలు చిత్రీకరించాడు ప్రశాంత్ నీల్. ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్ లేని సీన్స్ తీసాడు ప్రశాంత్ నీల్. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాకు ‘డ్రాగన్’ అనే టైటిల్ పేరు వినిపిస్తోంది.
Also Read : Ravi Basrur : కన్నడలో సంచనలం రేపుతున్న ‘వీరచంద్రహాస’
కాగా ఇప్పుడు డ్రాగాన్ సెట్స్ లో టైగర్ అడుగుపెట్టబోతున్నాడు. అందుకు ఈ నెల 22న ముహూర్తం ఫిక్స్ చేసారు. అందు కోసం టైగర్ ఈ ఉదయం ఎయిర్ పోర్ట్ చేరుకున్నాడు. అందుకు సంబంధించిన ఫోటొలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. టైగర్ వేటకు సిద్దమయ్యాడని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాగా ప్రశాంత్నీల్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. తొలిసారి ప్రశాంత్, ఎన్టీఆర్ సినిమా కావడంతో ఈ సినిమాపై నందమూరి ఫ్యాన్స్ ఇప్పటి నుంచే భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ సినిమాలో యంగ్ టైగర్ సరసన కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తుండగా మలయాళ యంగ్ హీరో టోవినో థామస్ మరో ముఖ్య పాత్రలో నటించనున్నాడు. ఈ
